Health Tips : రాత్రి పడుకోనే ముందు ఒక గ్లాసు తాగితే చాలు.. ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..

ఉదయం తీసుకొనే ఫుడ్ లేదా పానీయాలు శరీరానికి బాగా పడతాయని నిపుణులు అంటున్నారు.. అది నిజమే.. రాత్రి పడుకొనే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది.. పాలను మాత్రమే కాదు.. కొన్ని కలుపుకొని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.. ఎటువంటివి కలుపుకొని తాగాలి.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..


మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం మనం చూస్తూనే ఉంటాం.. కొన్ని వ్యాధులకు మందు కూడా లేదని చెప్పాలి.. అందుకే ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి.. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. ముఖ్యంగా ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు, ఆస్తమా,గొంతు ఇన్ ఫెక్షన్ వంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి.. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ డ్రింక్ ను తప్పనిసరిగా తాగాలి..

రెండు స్పూన్ల నెయ్యి వేయాలి. ఆ తర్వాత 300 గ్రాముల పసుపు., 50 గ్రాముల శొంఠి పొడి, 25 గ్రాముల నల్ల మిరియాల పొడి, 15 గ్రాముల దాల్చిన చెక్క పొడి వేసి రంగు పూర్తిగా మారేవరకు వేడి చెయ్యాలి.. పొడి చల్లారాక టైట్ కంటైనర్ లో స్టోర్ చేయాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది. రాత్రి పడుకోవటానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో అర టీ స్పూన్ పొడిని కలిపి తాగాలి.. ఇలా కొద్ది రోజులు తాగితే ప్రయోజనాలు తెలుస్తాయి.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..