ఆదర్శ వైద్యుడు !! గిరిజనుల కోసం కొండలు, కోనలు దాటి..

www.mannamweb.com


ఛత్తీస్‌గడ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో గుట్టపై దాదాపు 50 ఏళ్ల క్రితం వెలిసిన ఓ గిరిజన గ్రామం. ప్రస్తుతం ఈ మారుమూల పల్లె విషజ్వరాలతో మంచం పట్టింది. ఆ గిరిపుత్రుల ప్రాణాలు కాపాడడం కోసం ములుగు జిల్లా వైద్య సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులు దాటుకుంటూ వెళ్లి గుట్టలెక్కి ఆ గిరిపుత్రులకు గోలి బిళ్లలు అందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య బృందం చేసిన సాహసాన్ని చూసిన ప్రతి ఒక్కరూ శబ్భాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఛత్తీస్‌గడ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో గుట్టపై దాదాపు 50 ఏళ్ల క్రితం వెలిసిన ఓ గిరిజన గ్రామం. ప్రస్తుతం ఈ మారుమూల పల్లె విషజ్వరాలతో మంచం పట్టింది. ఆ గిరిపుత్రుల ప్రాణాలు కాపాడడం కోసం ములుగు జిల్లా వైద్య సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులు దాటుకుంటూ వెళ్లి గుట్టలెక్కి ఆ గిరిపుత్రులకు గోలి బిళ్లలు అందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య బృందం చేసిన సాహసాన్ని చూసిన ప్రతి ఒక్కరూ శబ్భాష్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఛత్తీస్‌గడ్ – తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో పెనుగోలు గ్రామం ఉంటుంది. దట్టమైన అడవిలో కనీసం ఎడ్ల బండి కూడా వెళ్లలేని దయనీయ స్థితిలో గుట్టపై ఈ గ్రామం ఉంటుంది. వాజేడు నుండి పెనుగోలు గ్రామానికి వెళ్లాలంటే మార్గమధ్యలో మూడు వాగులు దాటాలి రెండు గుట్టలు ఎక్కి దిగాలి. పెనుగోలు గ్రామంలో గత కొద్దిరోజుల నుండి గిరిజనులు విష జ్వరాలు, అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చింది.