తియ్యని గడ్డ పెరుగు కావాలా? ఇదిగో మంచి టిప్

Homemade Curd: అన్నం తిన్న తర్వాత కచ్చితంగా చివరికి పెరుగుతో తినాల్సిందే. అలా తింటేనే పూర్తిగా తిన్న ఫీల్ వస్తుంది. మరి ఈ పెరుగు తియ్యగా ఉంటేనే బాగుంటుంది.


పుల్లగా ఉంటే ముద్దు కూడా ముట్టాలి అనిపించదు. మరి తియ్యటి పెరుగు కావాలంటే ఎలా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా.. అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకొని.. శుభ్రం చేసుకోవాలి. తర్వాత అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ పోయాలి. ఈ ఫుల్ క్రీమ్ మిల్క్‌లో 6 శాతం ఫ్యాట్ ఉంటుంది. ఈ పాలను సిమ్ లో లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేడిచేయాలి. ఈ పాలతో పెరుగు చేస్తే అదిరిపోతుంది.

పాలు వేడి అవుతున్న సమయంలో.. మధ్య మధ్యలో గరిటతో తిప్పాలి. వేడి అవుతున్నప్పుడు మీగడ ప్యాన్ కు అతుకుతుంది. అలా అతుక్కుపోకుండా చూడాలి. ప్యాన్ అడుగు భాగంలో కూడా మీగడ అతుక్కోకుండా చూసుకోవాలి. దాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ.. పాలలో కలిసేలా చెస్తుండాలి. కాసేపటికి పాలు పొంగుతూ, బుడగలు వస్తుంటాయి. ఇలా పాలు ఒకసారి పొంగిన తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఆ పాలను మూత పెట్టి.. వేడి తగ్గడం కోసం పక్కన పెట్టాలి. ఓ అరగంటలో పాల వేడి తగ్గుపోతుంది.

గోరు వెచ్చగా అయిన తర్వాత ఈ పాలలో ఒక స్పూన్ పెరుగు వేయాలి. వేసవికాలంలో.. 1 టీస్పూన్ వేసినా సరిపోతుంది. పాలలో వేసే పెరుగు గట్టిగా ఉండేలా చూసుకోండి. ఇక ఈ పెరుగు పుల్లగా అసలు ఉండకూడదు. కాస్త తియ్యటి పెరుగును వేయండి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఓ 4 నుంచి 7 గంటలపాటూ పక్కన ఉంచేస్తే సరిపోతుంది. చల్లని వాతావరణంలో 8 నుంచి 12 గంటలు పక్కన ఉంచేయండి. కమ్మని పెరుగు తయారు అయిపోతుంది.

తక్కువ సమయం ఉంచితే ఎక్కువగా గడ్డ కట్టకపోవచ్చు. ఎక్కువ సమయం ఉంచితే.. బాగా గడ్డ కడుతుంది పెరుగు. కానీ ఎక్కువ సేపు ఉంచడం వల్ల పెరుగు పుల్లగా అయిపోతుంది. ఎంత ఎక్కువ సేపు ఉంచితే, అంతగా పులుపు పెరిగిపోతుంది అని గుర్తు పెట్టుకోండి. అందువల్ల మీకు ఏ రుచిలో కావాలో చూసుకొని, దానికి తగినట్లుగా అంతసేపు పక్కన ఉంచేయండి. మీకు కావాల్సిన టేస్ట్ వచ్చిన తర్వాత ప్రీజ్ లో స్టోర్ చేసుకోండి.