పెన్షనర్లకు ప్రభుత్వం భారీ ధమాకా! రూ.10,000కు పెన్షన్ పెంపు?

రాబోయే బడ్జెట్‌పై పెన్షనర్లు భారీ అంచనాలే పెట్టుకున్నారు. బడ్జెట్‌ సమీపిస్తుండటంతో మరోసారి ఎంప్లాయీస్‌ పెన్షన్ స్కీమ్‌ (EPS) 1995 మినిమం పెన్షన్ ఇష్యూ తెరపైకి వచ్చింది.
చాలా సంవత్సరాలుగా EPS కింద మినిమం మంత్లీ పెన్షన్ రూ.1,000 వద్దే నిలిచిపోయింది. ఈ మొత్తం ఇకపై కనీస అవసరాలకు కూడా సరిపోదని పెన్షనర్లు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2026 బడ్జెట్‌లో దీనిపై ఒక ప్రకటన వస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం వినియోగ ఆధారిత (Consumption-driven) బడ్జెట్‌ను లక్ష్యంగా పెట్టుకోవడంతో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యుల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచే సంస్కరణలను ప్రకటించవచ్చని భావిస్తున్నారు.


హైయర్‌ EPS పెన్షన్ కోసం డిమాండ్
మినిమం EPS పెన్షన్‌ పెంచాలని ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్లు, నిపుణుల నుంచి బలమైన ఒత్తిడి ఉంది. గతంలో డిమాండ్లు రూ.2,500 నుంచి రూ.3,000 ఇవ్వాలని ఉన్నాయి. కొన్ని యూనియన్లు నెలకు రూ.7,500 కూడా అడిగాయి. అయితే ప్రభుత్వం పెన్షన్ భారీగానే పెంచవచ్చని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. మినిమం పెన్షన్‌ను నెలకు రూ.5,000 లేదా రూ.10,000 తీసుకెళ్లవచ్చని పేర్కొంటున్నాయి. అంటే ప్రస్తుతమున్న రూ.1,000 నుంచి ఐదు రెట్లు లేదా పది రెట్లు పెరుగుతుంది.

పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా మనీ సేవింగ్ టిప్స్ గురించి ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయా? మీ ప్రశ్నను ఇక్కడ సబ్మిట్ చేయండి. ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ నుండి సమాధానాలు పొందొచ్చు. ఎంపిక చేసిన ప్రశ్నలకు సమాధానాలను మా వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్ రూపంలో మరుసటి రోజు చూడొచ్చు.
మినిమం పెన్షన్‌ రూ.5,000కు పెంచాలా?
మాతృభూమి నివేదిక ప్రకారం, ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షన్ సిస్టమ్‌లో పెద్ద మార్పును ప్లాన్ చేస్తోందని పేర్కొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల పెరుగుదల, రిటైర్డ్ ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా పెన్షన్‌ పెంచవచ్చు. ఇది అమలైతే దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

పెన్షన్‌ రూ.10,000కి పెరుగుతుందా?
EPFO సభ్యుల పెన్షన్ పెంపును ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ‘ఆసియానెట్ న్యూస్’ మరో నివేదికలో పేర్కొంది. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ సమయంలో లేదా తర్వాత EPS పెన్షన్‌పై తుది నిర్ణయం తీసుకోవచ్చు. కార్మిక సంఘాలు ఇప్పుడు నెలకు రూ.7,000 నుంచి రూ.10,000 వరకు కనీస పెన్షన్‌ను డిమాండ్ చేస్తున్నాయని కూడా నివేదిక పేర్కొంది. గత 11 సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం బాగా పెరిగిందని, కనీస పెన్షన్ మారలేదని వారు వాదిస్తున్నారు.

ఎంప్లాయీస్‌ పెన్షన్ స్కీమ్‌ (EPS) 1995 అంటే ఏంటి?
ఎంప్లాయీస్‌ పెన్షన్ స్కీమ్‌, 1995, EPF & MP చట్టం, 1952లోని సెక్షన్ 6A కింద తీసుకొచ్చారు. ఈ పథకం చట్టం పరిధిలోకి వచ్చే సంస్థలలో పనిచేసే అర్హత కలిగిన ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి. EPS మంత్లీ పెన్షన్‌లను సూపర్‌యాన్యుయేషన్ (పదవీ విరమణ), ముందస్తు పదవీ విరమణ, శాశ్వత వైకల్యం వంటి సందర్బాల్లో అందిస్తుంది. అలానే సభ్యుడు మరణిస్తే ఆధారపడిన వారికి ఫ్యామిలీ పెన్షన్‌ లభిస్తుంది.

ఈ స్కీమ్‌కి పని చేసే కంపెనీ ఉద్యోగి వేతనంలో 8.33% కాంట్రిబ్యూట్‌ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వేతనంలో 1.16% పెన్షన్‌ ఫండ్‌కి జమ చేస్తుంది. కనీసం 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు మంత్లీ పెన్షన్ పొందేందుకు అర్హులు. తక్కువ సర్వీస్ ఉన్నవారు బెనిఫిట్స్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా స్కీమ్ సర్టిఫికేట్‌ను ఎంచుకోవచ్చు.

ఏం జరుగుతుంది?
పెన్షన్ పెంపు గురించి ఇంకా అఫీషియల్‌ కన్‌ఫర్మేషన్‌ లేదు. పెరుగుతున్న అంచనాలు, పెరుగుతున్న ప్రజల ఒత్తిడి, రాబోయే కేంద్ర బడ్జెట్ EPS పెన్షనర్లలో ఆశను పుట్టించాయి. పెన్షన్‌లో ఏదైనా పెరుగుదల పెరుగుతున్న ఖర్చులను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత ఇస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.