2 షాపులు, 8 మంది ఉద్యోగులు.. రూ. 12 కోట్లు వస్తాయనుకుంటే.. లెక్కలు చూస్తే పిచ్చెక్కాల్సిందే

www.mannamweb.com


రెండు అవుట్​లెట్లు.. 8మంది ఉద్యోగులు.. పెద్దగా పరిచయం లేని కంపెనీ.. ఐపీఓలో అదరగొట్టేసింది! అవును మీరు విన్నది నిజమే. ఢిల్లీకి చెందిన రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ సంస్థ ఐపీవో..

ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్మాల్‌ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్‌ సెగ్మెంట్‌లో ఐపీఓకు వచ్చిన ఆ కంపెనీకి రూ.4,800 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. రూ.12 కోట్ల ఐపీఓకు ఏకంగా 419 రెట్లు ఓవర్‌ స్క్రైబ్‌ అవ్వడం గమనార్హం. 2018లో రిసోర్స్‌ఫుల్‌ ఆటోమొబైల్‌ కంపెనీ ప్రారంభం అయింది. సహానీ ఆటోమొబైల్‌ బ్రాండ్‌ పేరుతో ప్రస్తుతం బిజినెస్ చేస్తోంది. యమహా కంపెనీతో డీలర్​షిప్ ఉన్న ఆ సంస్థ- మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల సేల్స్‌, సర్వీసింగ్‌ను నిర్వహిస్తోంది. ఆ సంస్థకు ఉన్న రెండు షోరూమ్​లలో 8 మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు.

ఆగస్టు 22 నుంచి 26 వరకు ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కొనసాగింది. ఒక్కో షేరును రూ.117 చొప్పున సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంచగా, 40.76 కోట్ల బిడ్లు దాఖలయయ్యాయి. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 315.61 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 496.22 రెట్లకు సమానమైన బిడ్లు దాఖలు చేయడం విశేషం. ఆగస్టు 29న బీఎస్‌ఈ, ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ కానున్న రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ సంస్థ, ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కొత్త షోరూమ్‌లను తెరవడం కోసం, రుణాలతోపాటు నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించుకుంటామని తెలిపింది.