ప్రపంచంలో 7 వింతలు.. కడపలో బయటపడ్డ 8వ వింత!

ప్రపంచంలో ఇంతవరకు 7 వింతలు ఉంటాయని కడపలో 8వ వింత చూపిస్తానని కడప నియోజకవర్గం టీడీపీ- జనసేన అభ్యర్ధి రెడ్డప్పగారి మాధవి అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కడపలో హైటెన్షన్ వైర్లు ఉంటే టవర్ కింద రోడ్డు వేశారని, ప్రపంచంలో ఏడు వింతలు ఉంటే, కడపలో ఎనిమిదవ వింత ఉందని అని ఎద్దేవా చేశారు. రోడ్డు మీద టవర్లు ఉండగా వాహానాలు ఎలా ప్రయాణిస్తాయని, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఇలా చేశారని విమర్శించారు.


అలాగే పక్కనే ఉన్న కొండను కూడా కొరిగేస్తున్నారని, జగన్ ప్రభుత్వంలో ఎవరి నియోజవర్గంలోకి కొండలు ఉన్నా ఆ ఎమ్మెల్యేలు కొరిగేసుకునే అధికారం ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు దోచుకోవడమే జగన్ చెప్పే సామాజిక సాధికారత అని, వాటి ప్రకారమే సీట్లు పంపకం జరుగుతుందని విమర్శించారు. మళ్లీ రేపు అధికారంలోకి వస్తే మనుషుల అవయవాలు దోచుకునే విధంగా జగన్ సామాజిక సాధికరత ఉంటుందని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై జగన్ పాలన దేశానికి ఆదర్శం అంటే ఇదేనేమో..!, రేపు అధికారంలోకి వస్తే ఇండ్లల్లోకి రోడ్లు వేసి బిల్లులు తీసుకుంటారేమో అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.