ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.. రూ. 12వేలలోనే సూపర్ ఫీచర్స్

www.mannamweb.com


చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ3 ఎక్స్ పేరుతో బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది.ఈ స్మార్ట్ ఫోన్‌లో స్ప్లాష్ టచ్ టెక్నాలజీతోపాటు ట్వైస్ రీఇన్‌ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.

ఒప్పో ఏ3 ఎక్స్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను అందించారు. 45 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499 కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,499గా నిర్ణయించారు. ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2250 డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు.

ఒప్పో ఏ3 ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 45 వాట్స్ సూపర్ వూక్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 5.3, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.