వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్స్‌తో

www.mannamweb.com


చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్ అక్టోబర్‌ నెలలో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొదట చైనాలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు.

ఆ తర్వాత భారత్‌లో లాంచ్‌ కానుంది.

ఈ ఫోన్‌కు సంబంధించిన కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి కొన్ని వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది.

ఇక వన్‌ప్లస్ 13 ఫోన్‌లో 6.8 ఇంచెస్‌తో కూడి స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన అత్యంత శక్తివంతమైన బ్యాటరీని అందించనున్నారు.

ఈ ఫోన్‌ను 100 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసేలా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. స్క్వేర్‌ కెమెరా సెటప్‌తో ఇందులో కెమెరాను ఇవ్వనున్నారు. 50 ఎంపీతో కూడిన కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే 6 ఎక్స్‌ ఆప్టికల్ జూమ్‌ ఈ కెమెరా సొంతం.

ఈ ఫోన్‌లో ఐపీ68 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌ను ఇవ్వనున్నారు. సెక్యూరిటీ కోసం అల్ట్రా సోనిక్‌ సెన్సర్‌ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ను ఇవ్వనున్నారు. ఇందులో 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.