ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ కీలక అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆధార్ అప్ డేట్ చేసుకునే విధంగా అందుబాటులో క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థుల ఆధార్ వివరాలను సరిచేసుకునే, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు.
సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో నాలుగేళ్లలో పే ఆధార్ సేవలు దూర ప్రాంతాలకు చేరాయి. అయితే.. ఇంకా 15.46 లక్షల మంది పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా సరి చేయాలని సూచించారు. ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు.
































