వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు ఇచ్చే అలవెన్సు రద్దు

అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు కోసం గతంలో ఇచ్చే అలవెన్సును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. న్యూస్‌ పేపర్‌ అలవెన్సు కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది.


గత ప్రభుత్వం అడ్డదారుల్లో తమ సొంత పత్రిక సర్క్యులేషన్‌ పెంచుకొనేలా.. వాలంటీర్లు పత్రిక వేయించుకోవాలంటూ రూ.200 చొప్పున చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సొంత పత్రికకు ప్రభుత్వ నిధులు దోచిపెట్టేందుకు జగన్‌ ఆ జీవోలు ఇచ్చారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పత్రిక కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం మెమో జారీ చేసింది.