జియో- బీపీ నుంచి యాక్టివ్ పెట్రోల్

రిలయన్స్, బ్రిటిష్ ​పెట్రోలియం (బీపీ) భాగస్వామ్య సంస్థ జియో- బీపీ తీసుకొచ్చిన యాక్టివ్​ టెక్నాలజీ పెట్రోల్​ను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2026లో విడుదల చేశారు.

సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఈ యాక్టివ్​ టెక్నాలజీ ఇంధనం వాడటం వల్ల వాహనాలు ఏటా 100 కిలోమీటర్ల అదనపు మైలేజీని ఇస్తాయని జియో బీపీ ప్రకటించింది. ఇది ఇంజిన్ లోపలి భాగాలను శుభ్రంగా ఉంచి పనితీరును మెరుగుపరుస్తుంది.


అదనపు ఖర్చు లేకుండానే వినియోగదారులకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. అన్ని జియో- బీపీ బంకుల్లో యాక్టివ్​ పెట్రోల్ లభిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.