నేను సంపాదించుకున్న ఆస్తి అతడే.. ఆ కన్నీటి చుక్కలు చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ కింగ్ బ్రహ్మానందం క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.


కానీ ఇన్ని సంవత్సరాల తన సినీప్రయాణంలో తాను సంపాదించుకున్న ఆస్తి దివంగత కమెడియన్ ఎమ్మెస్ నారాయణ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన చివరి రోజుల్లో జరిగిన ఓ విషయం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఎమ్మెస్ నారాయణ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆఖరి రోజున తన కుమార్తెను ఎమ్మెస్ నారాయణ పిలిచి పేపర్ మీద బ్రహ్మానందం అన్నయ్యను కలవాలని ఉందని.. ఆయనను పిలిపించు అని రాశారట. ఆ తర్వాత ఎమ్మెస్ నారాయణ కూతురు బ్రహ్మానందానికి ఫోన్ చేసి విషయం చెప్పారట.

అప్పుడే ఏదో షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం పర్మిషన్ తీసుకుని మరీ ఆసుపత్రికి వచ్చారట. అప్పుడు ఆయన చేతిని పట్టుకుని ఎమ్మెస్ నారాయణ కాసేపు అలా ఉండిపోయారట. ఆ సమయంలో ఎమ్మెస్ కళ్ల నుంచి కన్నీరు అలా జారుతూ వచ్చిందట… ఆ సమయంలో అంత మంది కుటుంబ సభ్యులు ఉన్నా తనను పిలిచాడని… ఎంతో ప్రేమ, అభిమానం ఉండి ఉంటే అలా తనను అలాంటి సమయంలో పిలిచి ఉంటాడని చెబుతూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం. ఎమ్మెస్ నారాయణ మాత్రమే తాను సంపాదించుకున్న ఆస్తి అన్నారు.

ఎమ్మెస్ నారాయణ.. సినీరంగంలో బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న కమెడియన్. ఆయన కామెడీ టైమింగ్, యాక్టింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలాగే తనతో గడిపిన క్షణాలను, షూటింగ్ విషయాలను పంచుకున్నారు బ్రహ్మానందం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.