Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు..!

www.mannamweb.com


Case Filed on Allu Arjun for Nandyala Visit: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు నంద్యాల పోలీసులు షాక్ ఇచ్చారు. ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని అల్లు అర్జున్ పైనా, వైసీపీ ఎమ్మెల్యే శిల్వా రవిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసీ అనుమతి లేకుండా జనసమీకణ చేశారంటూ ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహీ రెడ్డితో కలిసి ఈరోజు తన స్నేహితుడైన నంద్యాల జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్వా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే అల్లు అర్జున్ దంపతులు రవి నివాసానికి వచ్చిన సమయంలో భారీ సమీకరణ ఏర్పడింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో రిటర్నింగ్ అధికారి అల్లు అర్జున్, ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.