Amaravati: రాజధాని దీక్షా శిబిరాలకు ముగింపు పలికిన రైతులు

Amaravati: రాజధాని దీక్షా శిబిరాలకు ముగింపు పలికిన రైతులు


అమరావతి: దీక్షా శిబిరాలకు అమరావతి రైతులు ముగింపు పలికారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ 1631 రోజులుగా రాజధాని ప్రాంతంలోని రైతులు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. జగన్‌ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి రైతులు పోరుబాట పట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంతో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతో దీక్షా శిబిరాలను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యమంలో మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన మీడియాకు రాజధాని రైతులు ప్రత్యే కృతజ్ఞతలు తెలిపారు.