బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రస్తుతం భారీగా పెరిగింది. గత నాలుగు రోజుల్లో బంగారం ధర మూడుసార్లు పెరిగింది. ప్రతీసారి బంగారం ధర భారీగానే పెరిగింది.
గత నాలుగు రోజుల్లో గోల్డ్ రేట్ రూ.5,500 పైనే పెరిగింది. అయితే ప్రస్తుతం నవంబర్ 13వ తేదీన భారీగా పెరిగింది.
తులం బంగారంపై ఏకంగా రూ.2,290 వరకరు ఎగబాకింది. ఇదిలా ఉంటే వెండి మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. కిలోపై ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు. ఏకంగా రూ.10 వేలు పెరిగింది.
ప్రస్తుతం కిలో వెండి ధరపై రూ.10 వేలు పెరిగి రూ.1,72,000 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం విషయానికొస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,27,800 ఉండగా, 22 క్యారెట్ల తులం ధర రూ.1,17,150 ఉంది.
నవంబర్ 13న హైదరాబాద్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.2,290 పెరిగి రూ.1,2,510 నుంచి రూ.1,27,800కి పెరిగింది. ఇక 22 క్యారట్ బంగారం ధర చూస్తే ఈ రోజు రూ.2,100 పెరిగి రూ.1,15,050 నుంచి రూ.1,17,150 కి చేరుకుంది. ఇక 18 క్యారట్ గోల్డ్ ధర రూ.1720 పెరిగి రూ.94,130 నుంచి రూ.95,850కి చేరుకుంది. అయితే విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లో తులం బంగారం ధర రూ.5500 పెరిగింది.
సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం భయాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఈరోజు హైదరాబాద్లో కనిపించిన ఈ ధర పెరుగుదల మార్కెట్లో పసిడిపై పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతోందని స్పష్టం చేస్తోంది. ఏదేమైనప్పటికీ, బంగారం కొనేవారు లేదా పెట్టుబడి పెట్టే ముందు, మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలించి, సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
































