AP BREAKING: ఏపీలో మరో కొత్త జిల్లా.. చంద్రబాబు కీలక ప్రకటన చేసారు

మార్కాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామన్నారు.


తప్పకుండా మార్కాపూరంను జిల్లా కేంద్రం చేస్తామని స్పష్టం చేశారు. తద్వారా ఈ ప్రాంతంలోని అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. చంద్రబాబు ప్రకటనతో మార్కాపురం ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.