హైడ్రా పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారటంటే

www.mannamweb.com


తెలంగాణలో హైడ్రా కూల్చివేతలపై… ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ అంశంలో ఆలోచించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది తెలిపారు పవన్ కళ్యాణ్.

హైడ్రా కూల్చివేతలు.. సామాజిక సమస్యగా మారే అవకాశం ఉంది. 20ఏళ్లుగా ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు జరుగుతున్నాయి. నీరు వచ్చే అవకాశం లేదని ప్రజలు ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా కూల్చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది పడతారు అన్నారు పవన్. కూల్చివేశాక, ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంటుంది తెలిపారు.

ఇది ఇలా ఉంటే వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష చేశారు. విజయవాడలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో.. వరద విలయానికి సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ వీక్షించారు పవన్‌.

వరద ప్రాంతాల్లో పరిస్థితులను పవన్‌కు వివరించిన అధికారులు. వరద తీవ్రతను, సహాయక కార్యక్రమాలు జరుగుతున్న తీరును.. అధికారులను అడిగి తెలుసుకున్నారు పవన్‌.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. వ్యక్తిగతంగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.