ఏపీ డీఎస్సీకి సంబంధించి కౌంట్డౌన్మొదలైంది. షెడ్యూలు ప్రకారం రేపటి నుంచి (శుక్రవారం) అభ్యర్థులకు హాల్టికెట్లు (Hall tickets) అందుబాటులోకి రానున్నాయి.
పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూలును ఈ రోజు ప్రకటిస్తారని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఏపీలో 16347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి షెడ్యూలు ప్రకారం ముందుకుసాగుతున్నారు. ఈ మేరకు మాక్టెస్టులను (Mock Test) అప్డేట్చేశారు.
ప్రభుత్వం ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 30 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు (Online Exams) జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహిం చనున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరిస్తారు.
అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు. పరీక్ష వాయిదా వేయాలంటూ కొందరు డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్చేస్తున్నారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. ఏపీ మెగా డీఎస్సీ (Mega DSC) 2025 షెడ్యూల్ యథా విధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు సైతం గత వారంలో స్పష్టం చేసింది. దీంతో పరీక్షల వాయిదా దాదాపు లేనట్లేనని స్పష్టమవుతోంది.
































