ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా

మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా..


దీన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది. ఇప్పటికే డీఎస్సీ మెరిట్‌ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. డీఎస్సీలో వచ్చిన స్కోర్‌తోపాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు. రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్‌లెటర్లు జారీచేయాల్సి ఉంటుంది.

ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటికి రెండుసార్లు జాబితాలను పరిశీలిస్తున్నారు. విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్‌కు కాల్‌ లెటర్లు పంపించి, సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సి ఉండగా.. కాల్‌ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. కాల్‌ లెటర్లను సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్‌లో ఉంచనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.