అశ్విన్‌ ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే.. స్టార్‌ ప్లేయర్స్‌కు దక్కని చోటు

www.mannamweb.com


టీమ్ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించాడు.

తాజాగా భారత మాజీ క్రికెటర్‌, 1983 ప్రపంచకప్‌ విన్నర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో అశ్విన్‌ వివిధ అంశాలపై మాట్లాడాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌ ఆల్‌టైమ్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంపిక చేయాలని యాష్‌ను కోరారు. అశ్విన్‌ ప్రకటించిన జట్టులో కొంతమంది స్టార్‌ ఆటగాళ్లకు అవకాశం దక్కలేదు. ఐపీఎల్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులు సృష్టించిన క్రిస్‌ గేల్, శిఖర్‌ ధావన్‌, హార్దిక్ పాండ్య, ఆండ్రీ రస్సెల్, కీరన్‌ పొలార్డ్‌, డేవిడ్ వార్నర్‌లలో ఒక్కరిని కూడా అశ్విన్‌ తన టీమ్‌లోకి తీసుకోలేదు. తొలుత మహ్మద్‌ షమి, షేన్‌ వాట్సన్‌లను ఎంపిక చేసిన అతడు.. చివరి నిమిషంలో లసిత్ మలింగ, సూర్యకుమార్‌ యాదవ్‌ వైపు మొగ్గుచూపడం గమనార్హం.

అశ్విన్‌ ఐపీఎల్ జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్‌/వికెట్ కీపర్‌), సునీల్ నరైన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్‌ బుమ్రా, లసిత్ మలింగ