శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నవంబర్ నెల టికెట్ల బుకింగ్స్ ఆ రోజు నుంచే ప్రారంభం.. పూర్తి వివరాలు..

www.mannamweb.com


తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకట చేసింది.. ఈ ఏడాది నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగష్టు 19న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నవంబరు నెల కోటాను ఆగష్టు 19 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగష్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను, అదే విధంగా నవంబరు 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఆగష్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టిటిడి.

ఆగస్టు 22న వర్చువల్ సేవల కోటాను టిటిడి విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగస్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఇక నవంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆగస్టు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఆగస్టు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనుంది. ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

తిరుమల, తిరుపతిలలో నవంబరు నెల గదుల కోటాను ఆగస్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టిటిడి.

ఆగష్టు 27న తిరుమల, తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in లో లాగిన్ అయి బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.