నల్గొండ జిల్లా నకిరేకల్ జడ్పీహెచ్ స్కూల్లో ఝాన్సీ అనే విద్యార్ధిని డీబార్ అయిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ పరిణామంలో తనకేం తెలీదు..
ఎవరో కావాలనే కిటికీ దగ్గరికి వచ్చి పేపర్ చూపించమని అడిగారు అంటూ వాపోయింది. తన డీబార్ని రద్దు చేయాలంటూ అధికారులను కోరింది. అయితే ఈ లీక్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.
తనకు ఏ పాపం తెలియదు అంటూ విద్యార్థి వేడుకుంది. పేపర్ లీక్తో విద్యార్ధి ఝాన్సీని డీబార్ చేశారు అధికారులు. కొందరు ఆకతాయిలు కిటికీ దగ్గరకు వచ్చి.. ఎగ్జామ్ రాస్తున్నా తను క్వొశ్చన్ పేపర్ చూపించు.. లేకుంటే రాయితో కొడతాను అని బెదిరించి ఫోటో తీసుకున్నాడని చెప్పింది. ఆ సమయంలో నాకు భయం వేసింది.. నాకు ఏం చేయాలో అర్థం కాక పేపర్ చూపించాను. పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అనడంతో వాళ్లకి పేపర్ చూపించానని ఝాన్సీ చెప్పుకొచ్చింది. ఇందులో తన ప్రమేయం ఏమి లేదని.. దయచేసి తన డిబార్ ను రద్దు చేయండి అని ఝాన్సీ లక్ష్మి వేడుకుంది.
నేను క్లవర్ స్టూడెంట్ని.. నాకు ఎక్కడ ఎగ్జామ్ రాపిచ్చిన నేను రాస్తాను.. చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు.. దయచేసి ఎగ్జాం రాసే అవకాశం మళ్ళీ కల్పించాలని వేడుకుంటున్నా.. ఎగ్జామ్ రాయకపోతే నాకు సావే శరణ్యం అని అంటున్న విద్యార్ధిని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం నకిరేకల్ జడ్పీహెచ్ స్కూల్లో పేపర్ లీక్ అయిన ఘటన అందరికి తెలిసిందే. ఈ పరిణామంలో విద్యార్ధిని ఝాన్సీని డీ బార్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో తనకు ఏ పాపం తెలియదంటూ ఝాన్సీ, తన కుటుంబ సభ్యులు కూడా వాపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మార్చి 21న విద్యార్థులు తెలుగు పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. అయితే పరీక్షలు స్టార్ట్ అయిన మొదటిరోజే పేపర్ లీకేజ్ తో గందరగోళం నెలకొంది. నల్గొండ జిల్లా నకిరేకల్లోని ZPH స్కూల్ ఇన్విజిలేటర్ తెలుగు పేపర్ లీక్ చేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇన్విజిలేటర్ ని విధుల నుంచి తొలగించారు. అలాగే సెంటర్ లోని మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఓ ఝాన్సీ అనే విద్యార్థిని డీబార్ కూడా చేశారు.