LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. అపోలో ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు..

LK Advani Admitted In Apollo Hospital: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను న్యూఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.


మథుర రోడ్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో అద్వానీని ఎమర్జెన్సీకి తరలించారు. ప్రస్తుతం అద్వానీ డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది.

దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో తరలించారు. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితం ఎయిమ్స్ యూరాలజీ విభాగంలో చేరారు. అద్వానీ పరిస్థితి మెరుగుపడడంతో, మరుసటి రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అద్వానీకి ఈ ఏడాది మార్చి 30న భారతరత్న అవార్డు లభించింది. 2015లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించారు. ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్లు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

రాజకీయ నాయకుడిగానే కాకుండా, శక్తివంతమైన వక్తలలో అద్వానీ కూడా ఉన్నారు. రామమందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఆయన ఒకరు. భారతీయ జనతా పార్టీకి పునాది వేసిన వారిలో అద్వానీ ఒకరు. అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో కలిసి పని చేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. మూడు సార్లు బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో పాటు దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు.