Friday, September 20, 2024

Viral: ‘వీడే అసలైన జాతిరత్నం’.. ఎగ్జామ్‌లో ఏం ఆన్సర్ రాశాడో చూడండి..

ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్‌‌లోని క్లాసుల్లో కొందరు ఆణిముత్యాలు ఉంటారు. ఆణిముత్యాలు అంటే మరీ పాత వెర్షన్ అయిపోతుందేమో.. ఇలాంటి వారిని మన లేటెస్ట్‌ ట్రెండ్ ప్రకారం జాతిరత్నాలు అనాలి. వీళ్ల గొప్పతనం ఏంటి అంటే.. పరీక్షా పేపర్‌లో ప్రశ్నలకు సమాధానం తెలీనప్పుడు.. అలా వదిలెయ్యరు. తమకు వచ్చింది, నచ్చింది, తోచింది రాసి.. పేపర్స్ నింపేస్తారు. ఇన్విజిలేటర్… షీట్‌కు ఒక మార్క్ వేసినా పాస్ అవుతామని.. కొందరు అడిషినల్ షీట్స్ తీసుకుని మరీ తమ పైత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ రాసే సోది విషయంలో కూడా ఒక్కొక్కరికీ ఒక్కో స్మార్ట్‌నెస్ ఉంటుంది. కొందరు మూవీ కథలు రాస్తారు. మరికొందరు తమకు తెలిసిన వంటకం గురించి వివరిస్తారు. ఇక ఏ గ్రేడ్ ఆణిముత్యాలు అయితే.. బట్టలు ఎలా ఉతకాలి.. ఉప్మా ఎలా చెయ్యాలి.. చేపలు ఎలా పట్టాలి వంటివి రాసుకొస్తారు.

మీ స్కూల్లో, కాలేజీల్లో ఇలాంటి ఫన్నీ ఆన్సర్స్ రాసిన మీరూ లేదా మీ ఫ్రెండ్స్ టీచర్‌కు దొరికిపోయిన సందర్భాలు ఉంటాయి. ఆ ఘటనలు గుర్తుకువస్తే ఇప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. పాఠశాల రోజులు గుర్తుకు వచ్చి ఒకింత ఉద్వేగానికి కూడా లోనవుతారు. తాజాగా ఓ ఇస్మార్ట్ స్టూడెంట్ లెక్కల్లో అడిగిన ఓ ప్రశ్నకు.. టీచర్ బుర్ర హీటెక్కే సమాధానం ఇచ్చాడు. తనకు తిక్క ఏ రేంజ్‌లో ఉందో చూపించాడు. (a+b)^n ఈక్వెషన్‌ను విస్తరించమని అడిగితే.. ఆన్సర్ షీట్‌పై… స్పేస్ పెంచుతూ అదే ఈక్వెషన్‌ను రాసుకుంటూ వెళ్లాడు. బాబు పైత్యానికి స్టన్ అయిన టీచర్.. 10 మార్కుల ప్రశ్నకు సున్నా మార్కుల వేసింది. ఈ జాతిరత్నం రాసిన ఆన్సర్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ‘వీడే అసలైన జాతిరత్నం’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇది చూసిన నెటిజన్స్.

Gold Price Record: రికార్డ్‌ స్థాయిలో బంగారం ధరలు.. 100 రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా?

దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో పసిడి ధరలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర తొలిసారిగా రూ.72 వేల స్థాయికి చేరుకుంది. కాగా వెండి ధర రూ.85 వేలు దాటింది. దీనికి విరుద్ధంగా విదేశీ మార్కెట్లలో బంగారం ధర తగ్గుదల కనిపిస్తోంది. దీని ప్రభావం దేశంలోని ఫ్యూచర్స్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. నిజానికి, ఫెడ్ రేటు అవకాశాలు దెబ్బ తిన్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్, భారతదేశ ఫ్యూచర్స్ మార్కెట్ రెండింటిలోనూ క్షీణతకు ఇదే కారణం. ఏప్రిల్‌ 10న రాత్రి 9 గంటల సమయానికి దేశంలో బంగారం ధర రూ.380 మేర పెరుగుదల కనిపిస్తోంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,100 ఉండగా, 24 క్యారెట్ల 10

ఢిల్లీలో రికార్డు స్థాయిలో బంగారం, వెండి

దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరో సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా రూ.72,000 స్థాయికి చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఢిల్లీలో బంగారం ధర రూ.160 పెరిగి 10 గ్రాముల గరిష్ట స్థాయి రూ.72,260కి చేరుకుంది. మంగళవారం ఈ రికార్డు 10 గ్రాములకు రూ.71,840 వద్ద ముగిసింది. వెండి ధర కూడా రూ.200 పెరిగి, కిలో రూ.84,700 వద్ద సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, విదేశీ మార్కెట్‌లలో బలపడుతున్న ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం స్పాట్ ధర 10 గ్రాములకు తాజా రికార్డు గరిష్టంగా రూ.72,000 వద్ద ట్రేడవుతోంది, ఇది మునుపటి కంటే 100% ఎక్కువ. ముగింపు ధర రూ.160 పెరిగింది.

100 రోజుల్లో ఎంత పెరిగింది?

గత 100 రోజులుగా బంగారం ధరలో విపరీతమైన పెరుగుదల ఉంది. గతేడాది చివరి ట్రేడింగ్ రోజు బంగారం ధర పది గ్రాములు రూ.63,920గా ఉంది. ప్రస్తుతం రూ.72 వేలకు చేరింది. అంటే ప్రస్తుత సంవత్సరంలో ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధర పది గ్రాములకు రూ.8,080 పెరిగింది. మరోవైపు, వెండి గురించి మాట్లాడినట్లయితే, ప్రస్తుత సంవత్సరంలో వెండి ధరలో మంచి పెరుగుదల ఉంది. గతేడాది చివరి ట్రేడింగ్ రోజున వెండి ధర రూ.78,500గా ఉంది. ఇందులో ఇప్పటి వరకు రూ.6,200 పెరుగుదల కనిపించింది.

నిపుణులు ఏమంటున్నారు?

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కమోడిటీ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమానీ మాట్లాడుతూ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్‌ వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం, మార్చి నెల వడ్డీ రేట్ల గురించి ఆందోళనల కారణంగా బంగారం, వెండి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా డిమాండ్‌లో ఉంది. యుఎస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సిపిఐ)తో ఫెడరల్ రిజర్వ్ మార్చి సమావేశం వివరాలు కూడా బుధవారం తర్వాత రానున్నాయని ఆయన చెప్పారు.

అంతు చిక్కని శివయ్య లీల.. 12 ఏళ్ళకు ఒకసారి శివలింగంపై పిడుగు పడుతుంది…!

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుందికొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా. ప్రతి 12 ఏళ్లకోసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.
ఉరుములు… మెరుపులు… పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగంపైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత శబ్ధానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులు పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది.

కానీ మందిరం చెక్కుచెదరదు. కొండపై ఉన్న బండరాళ్లు కూడా కిందపడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజరి… తునాతునకలైన ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికే శివలింగం తిరిగి యధారూపంలోకి వచ్చేస్తుంది. అంతకుముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. దీన్ని వింత అనాలో… శివలీల అనాలో అర్థంకాని పరిస్థితి భక్తులది.

ఇలా ఒకటి రెండుసార్లు కాదు… వందల ఏళ్ల నుంచి వస్తోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది.ఈ ఆలయం పేరు బిజిలి మహాదేవ్ మందిర్. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ వ్యాలీలో ఉంది. ఇలా జరగడానికి కారణాలు వివరించే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కులూ వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి జనాన్ని, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడు. బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీన్ని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. చనిపోతూనే ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు.

అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. అయినప్పటికీ ప్రజలకు ముప్పు పొంచివుండడంతో శివుడు ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట. కానీ పిడుగుపడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని… ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి.

12 ఏళ్లకు ఒకసారి శివలింగంపై పిడుగు పడడం, అది తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. అయితే ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీకాదు. ఇది కొండపై సముద్ర మట్టానికి 2 వేల 450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. రాళ్లు రప్పల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. అదృష్ఠవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట. పర్వతంపైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇక ఈ భోళాశంకరుడికి ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడి ఆనవాయితీ.

Diabetes : షుగర్ 500 ఉన్నా.. మీరు 15 రోజుల్లో ఇలా తగ్గించుకోండి…!

Diabetes :  ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య షుగర్. అదే మదుమేహ వ్యాధి. దీన్నే ఇంగ్లీష్ లో డయాబెటిస్ అంటారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఈ వ్యాధి ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారు. మారుతున్న మనిషి జీవన శైలే డయాబెటిస్ వ్యాధికి కారణం అవుతోంది.

తెల్లన్నం తినడం పూర్తిగా మానేయాలి
షుగర్ రావడానికి ప్రధాన కారణం మనం తినే అన్నం. అవును.. మన భారతదేశంలో ఎక్కువగా అన్నం తినే వాళ్లలో తెలుగు రాష్ట్రాలు ముందుంటాయి.మనం తినే బియ్యం బాగా పాలిష్ చేసినవి. వాటిలో ఉండే విటమిన్స్, మాంసకృత్తులు అన్నీ పోయి.. కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే మిగులుతాయి. కార్బోహైడ్రేట్స్ అంటే కేవలం పిండి పదార్థాలు మాత్రమే. బియ్యంలో 77 గ్రాములు కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఎక్కువగా అన్నాన్నే తింటూ ఉండటం అలవాటు చేసుకోవడం వల్ల.. షుగర్ వ్యాధి తొందరగా బాడీని అటాక్ చేస్తుంది.షుగర్ వ్యాధిని నయం చేయాలంటే ముందు అన్నం తినడం మానేయాలి. అలాగే చాలా మంది అన్నం ఎక్కువ కూర తక్కువ తింటుంటారు. కానీ.. అన్నం తక్కువ తిని కూర ఎక్కువ తినాలి. కురల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అందుకే కూరలు ఎక్కువ తిని అన్నం తక్కువ తింటే.. షుగర్ వెంటనే డౌన్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి కూరలు ఎక్కువగా తినే వాళ్లకు అసలు షుగర్ రానే రాదు. ఎప్పుడూ కంట్రోల్ లో ఉంటుంది.
Diabetes : ఉప్పు వాడకం తగ్గించాలి
షుగర్ ఎక్కువ ఉన్నవాళ్లు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినేవాళ్లకు 70 శాతం షుగర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే.. రోజుకు 2.5 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉప్పును వాడకూడదు.

Diabetes : మొలకెత్తిన విత్తనాలు
రోజూ ఉదయమే మొలకెత్తిన విత్తనాలను తినండి. పరిగడుపున మూడు రకాల గింజలను తినండి. ఉదయం పూట టిఫిన్ బదులు.. మొలకలు, పండ్లను తీసుకోండి.
Diabetes : చెమటలు పట్టేలా వ్యాయామం చేయండి
ఉదయం పూట ఖచ్చితంగా వ్యాయామం చేయండి. రోజూ ఉదయం అర్ధగంట చెమటలు పట్టేలా వ్యాయామం చేయండి. రాత్రి పూట అన్నం తిన్న తర్వాత ఓ అర్ధగంట నడవండి.

Viral video : ఫోన్ మైకంలో పడి పిల్లాడిని ఫ్రిజ్ లో పెట్టిన తల్లి… ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో…!

Viral video : ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగస్వామి అయిపోయిందని చెప్పాలి.ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ అనేది కచ్చితంగా ఉంటుంది. మొబైల్ ఫోన్ లేని వ్యక్తి కనిపించాడంటే కచ్చితంగా అది ఒక వింత అనే చెప్పాలి. అలాంటి పరిస్థితులలో నేటి సమాజం జీవిస్తోంది. అంతేకాదు బయటకు వెళ్లేందుకు ఆటో కావాలన్నా…ఆకలేసినప్పుడు ఫుడ్డు కావాలన్నా… బోర్ కొడితే ఎంటర్టైన్మెంట్ కావాలన్నా… మొబైల్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది. అంతేకాదు ఈ ఫోన్ ద్వారా ఆన్ లైన్ షాపింగ్ వేరే ఖండాల్లో ఉన్నవారితో సైతం మాట్లాడుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ ద్వారా అన్ని అవసరాలను మన దగ్గరికి వచ్చేలా చేసుకోవచ్చు. అందుకే నేటి కాలంలో మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం అరచేతిలో ఉన్నట్లే అని పెద్దలు అంటున్నారు. దీంతో నేటి కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ విపరీతంగా ఉపయోగిస్తున్నారు.

అయితే వాస్తవానికి ఈ మొబైల్ ఫోన్ వలన మనిషి జీవితంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో లేదా అదే టెక్నాలజీకి బలవుతున్న మనుషులను చూసి బాధపడాలో అర్థం కావడం లేదు. మన తాతల కాలంలో సాయంత్రం వేళ అందరూ అరుగులపై కూర్చొని ముచ్చట్లు పెడితే నేటి కాలంలో ఫోన్ మాయాజాలంలో పడి పక్కవారితో సైతం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. అలాగే మన చిన్నప్పుడు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తింటే ఇప్పుడు మాత్రం పిల్లల చేతికి ఫోన్ ఇవ్వనిదే నోట్లో ముద్ద కూడా పెట్టనివ్వడం లేదు. ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే మనం ఎలాంటి స్టేజ్ లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లలతో పాటు పెద్దవారు సైతం మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ సోషల్ మీడియాను చూస్తూ మైమర్చిపోతున్నారు. ఈ తరుణంలోనే చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోని పరిస్థితులలో కనిపిస్తున్నాయి.

Viral video తల్లి ఫోన్ లోనే నిమగ్నం
ఈ క్రమంలోనే ఈ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని గమనించినట్లయితే ఓ ఇంట్లో తల్లి తండ్రి చిన్నబాబు ఉంటున్నారు. ఈ క్రమంలోనే చిన్నపిల్లాడు హాల్లో ఆడుకుంటూ ఉండగా తన తల్లికి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ లోనే నిమగ్నం అవుతుంది. ఈ క్రమంలోనే తన పనులు తాను చేసుకుంటూ పిల్లాడు ఆడుకుంటుండగా చూస్తూ ఉంటుంది. పంట కోసం కూరగాయలు తరిగి మిగిలిన కూరగాయలను ఫ్రిడ్జ్ లో పెట్టాలి అనుకుంటుంది. కానీ ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాయలో మునిగిపోయిన ఆ తల్లి కూరగాయలకు బదులుగా హాల్లో ఆడుకుంటున్న చిన్నపిల్లల్ని తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెట్టింది. ఇంతలోకే ఆ పిల్లాడి తండ్రి స్నానం చేసి హాల్ లోకి వస్తాడు. పిల్లాడు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లాడని టెన్షన్ పడుతూ భార్యని అడుగుతాడు. అయితే ఫోన్ మైకంలో తాను ఏం చేసిందో తెలియని భార్య పిల్లాడి కోసం ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక పిల్లాడిని ఇంట్లో ఎక్కడ వెతికిన కనిపించడు.

ఇదే సమయంలో తండ్రికి ఆ పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. ఏడుపు శబ్దం వింటూ తండ్రి ఫ్రిడ్జ్ డోర్ వద్దకు చేరుకుంటాడు. పిల్లాడి ఏడుపు శబ్దం ఫ్రిడ్జ్ నుండి రావడాన్ని గమనించిన తండ్రి ఫ్రిడ్జ్ డోర్ తీసి చూడగా అందులో పిళ్లాడు కనిపిస్తాడు. ఇంకేముంది ఫ్రిడ్జ్ లోకి కొడుకు ఎలా వెళ్లాడో తెలియని పరిస్థితిలో ఉన్న భార్య వెంటనే కొడుకుని ఎత్తుకొని మొద్దాడుతుంది. ఈ విధంగా ఫోన్ మైకంలో పడి తల్లి తన సొంత బిడ్డని చంపుకునే పరిస్థితి ఏర్పడింది. తన తండ్రి ఇంకాస్త ఆలస్యం చేసుంటే ఆ పిల్లాడు ఫ్రిజ్ లో చలి తట్టుకోలేక చనిపోయి ఉండేవాడు. అయితే ఈ వీడియోలో ఆ తల్లి ఫోన్ కు ఎంతలా ఎడిక్ట్ అయిందో మనందరికీ అర్థమయ్యే ఉంటుంది. ప్రస్తుత కాలంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి అనడానికి ఈ వీడియో నిదర్శనం అని చెప్పాలి. కావున మొబైల్ ను అవసరమైన వరకే వాడడం మంచిది. అంతకుమించి వాడితే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వీడియో నేటి కాలంలో కొందరికైనా అవేర్నెస్ కల్పించేలా చేస్తే చాలు. మరి ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేసి ఇలాంటి పరిస్థితులకు గురికాకుండా జాగ్రత్త పడండి.

Dropout Chaiwala : టీ, కాఫీలు అమ్ముతూ ఏడాదికి రూ.5 కోట్లు సంపాదించిన కాలేజీ డ్రాపవుట్ స్టూడెంట్.. ఎలా సాధ్యం అయిందంటే?

Dropout Chaiwala : చదువుకుంటేనే మంచి జాబ్ వస్తుందా? మంచి జాబ్ వస్తే మంచిగా సంపాదించవచ్చు. ఇదే కదా.. అందరూ చెప్పేది. చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు.. మంచిగా చదువుకో అంటూ పిల్లలకు పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుందని కూడా చెబుతారు. చదువుకోకపోతే ఏ పని చేయలేమని కూడా అంటారు. కానీ.. కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే చదువుతో సంబంధం లేకపోయినా జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు ఓ కుర్రాడు. అది మన తెలుగు కుర్రాడే. నెల్లూరుకు చెందిన ఆ కుర్రాడు ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుదామని అనుకున్నాడు. అక్కడికి వెళ్లాడు కానీ.. మధ్యలోనే తిరిగి వచ్చేశాడు. దానికి కారణం..

ఏదైనా వ్యాపారం చేయాలని అనుకోవడమే. అతడికి వచ్చిన ఆలోచనను కార్యరూపం దాల్చాడు. సక్సెస్ అయ్యాడు. ఆస్ట్రేలియాలో బీబీఏ చదవడానికి సంజిత్ అనే నెల్లూరుకు చెందిన కుర్రాడు వెళ్లాడు కానీ.. అక్కడ అతడికి చదువు అబ్బలేదు. కాలేజీ డ్రాప్ అవుట్ గా మారాడు. కాలేజీ డ్రాపవుట్ అవడంతో తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలి అనిపించింది. ఓడిపోయి ఇండియాకు తిరిగి వెళ్లలేక తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. అక్కడే ఆస్ట్రేలియాలో డ్రాపవుట్ చాయ్ వాలా అనే ఓ టీ స్టాల్ ను తెరిచాడు. తాను చదువు వదిలేసి టీ కొట్టు పెట్టుకున్నాను అని తన తల్లిదండ్రులకు చెబితే ముందు బాధపడ్డారు. కానీ.. ఇప్పుడు తను ఒక స్థాయిలో ఉండటంతో అతడిని చూసి తల్లిదండ్రులు గర్విస్తున్నారు.

నిజానికి సంజిత్ కు టీ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి టీ అంటే ఉన్న ఇష్టంతో ఆస్ట్రేలియాలో టీ షాప్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. వెంటనే ఓ ఎన్ఆర్ఐని ఒప్పించి పెట్టుబడి పెట్టించాడు. ఒక ఏడాదిలోనే రూ.5.2 కోట్ల లాభం వచ్చింది సంజిత్ కు. నిజానికి ఆస్ట్రేలియాలో కాఫీ ఎక్కువగా తాగుతారు. కానీ.. సంజిత్ చేసే చాయ్ కు మెల్ బోర్న్ వాసులు ఫిదా అయిపోయారట. అతడి టీ కొట్టులో చాయ్ విత్ సమోసా, చాయ్ విత్ పకోడాలు చాలా ఫేమస్ అట. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇండియన్స్ కూడా ఖచ్చితంగా మనోడి చాయ్ ను రుచి చూడనిదే వెళ్లరట.

Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

Garlic Health Benefits : మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వెల్లుల్లిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
1. రోగనిరోధక వ్యవస్థ :
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండే అల్లిసిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. అంతేకాదు.. అంటువ్యాధులు, అనారోగ్యాలను ఎదుర్కోవడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
2. కార్డియోవాస్కులర్ :
వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడంలో సాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు :
వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సాయపడతాయి. వివిధ దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి, వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది.

4. మెరుగైన జీర్ణక్రియ :
వెల్లుల్లిని సాంప్రదాయకంగా జీర్ణక్రియకు, జీర్ణశయాంతర సమస్యల నుంచి ఉపశమనానికి ఉపయోగిస్తారు. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడుతుంది. ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. క్యాన్సర్ నిరోధక లక్షణాలు :
కొన్ని అధ్యయనాల్లో వెల్లుల్లికి యాంటీకాన్సర్ లక్షణాలు ఉన్నాయని తేలింది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ, ఇతర అవయవాలలో కణితులు ఏర్పడకుండా నిరోధించే సమ్మేళనాలను కలిగి ఉంది.

6. ఎముకల ఆరోగ్యం :
ఎముకల ఆరోగ్యానికి అవసరమైన మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి వంటి పోషకాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల నష్టాన్ని నివారించవచ్చు. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

7. రక్తంలో చక్కెర నియంత్రణ :
వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలపై తగ్గించగలదు. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత కలిగిన వ్యక్తులకు సమర్థవంతంగా సాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ స్థాయిలను కూడా క్రమంగా తగ్గిస్తుంది.

8. శ్వాసకోశ ఆరోగ్యం :
వెల్లుల్లి మ్యూకోలైటిక్ లక్షణాలను కలిగి ఉంది. ఇది శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి, శ్వాసకోశ వ్యవస్థలో రద్దీని తగ్గించగలదు. తరచుగా జలుబు, ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాలను తగ్గించడంలో సాయపడుతుంది.

Good news : Flipkartలో ఇకపై బస్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు…భారీ డిస్కౌంట్‌ పొందండి

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ గురించి అందరికి తెలిసిందే.ఎప్పటికప్పుడు వినియోదారుల అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల ఉత్పత్తులను ఈ ఫ్లిప్ కార్ట్ సంస్థ అందిస్తోంది. అలాగే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను అతి తక్కువ ధరలతో కష్టమర్లను ఆకర్షించడంలో ఈ ఫ్లిప్ కార్డ్ సంస్థ ఎప్పుడు ముందుటుంది. ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్, ఆఫ్‌లైన్ పేమెంట్స్, సూపర్ కాయిన్స్ , క్యాష్ బ్యాక్ , మిలిస్టోన్ బెనిఫిట్స్ , బ్రాండ్ వోచర్‌లు వంటి సేవలెన్నో ఈ యూపీఐలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫ్లిప్ కార్డ్ సంస్థ మరో కొత్త సర్వీస్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రముఖ డిజిటల్‌ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మరో కొత్త సర్వీస్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ సేవలనేవి వినియోగాదారులకు ప్రయోజకరంగా ఉంటాయి. ఇంతకి ఆ సేవలు ఏమిటంటే.. ఫ్లిప్ కార్ట్ తాజాగా బస్‌ టెకెట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ రాష్ట్ర రవాణ కార్పొరేషన్లు, ప్రైవేట్‌ అగ్రిగేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ రావాణా సేవలనేవి బెంగళూరు, ఛండీగఢ్‌, ఢిల్లీ, జైపూర్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ముంబై, చెన్నై వంటి ప్రాంతాల్లో టికెట్‌ బుకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే దీనిలో ఎలాంటి చార్జీలు లేకుండా బస్‌ టికెట్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా, ఈ కొత్త సేవలు ప్రారంభ సందర్భంగా.. ఈ నెల 15 వరకు 20 శాతం వరకు రాయితీని కల్పించనుంది.ఇక పై దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులకు టికెట్‌ బుకింగ్‌ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ విమాన టికెట్‌, హోటల్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ బస్ టికెట్ సేవలన కూడా ఫ్లిప్ కార్డ్ ప్రారంభించింది. కాగా, ఈ ఫీచర్ ప్రస్తుతం ఈ యాప్ లో Android, iPhone వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాప్ బస్ బుకింగ్ ఈజీ యాక్సెస్, సులభమైన రీఫండ్‌లు, రూ. 50 వరకు సూపర్ కాయిన్స్ రిడెంప్షన్ ద్వారా ఆఫర్లు, 24×7 వాయిస్ హెల్ప్‌లైన్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. దీంతో పాటు లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు ఫ్లాట్ 15% తగ్గింపుతో పాటు 5% అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. అంతేకాకుండా.. ఫ్లిప్‌కార్ట్ తన యాప్‌లో లక్కీ డ్రా పోటీని కూడా నిర్వహిస్తోంది. ఇక్కడ రూ. 1 వద్ద బస్సు టిక్కెట్‌లను అందిచబోతుంది. అయితే వారణాసి, అయోధ్య, హరిద్వార్, తిరుపతికి వెళ్లాలనుకునే కస్టమర్‌లకు కంపెనీ ఫ్లాట్ 25 శాతం తగ్గింపు బస్సు బుకింగ్ కూపన్‌ను కూడా అందిస్తోంది.

Diabetic Tea Options: మీకు డయాబెటిస్ ఉందా..? రోజుకు రెండుసార్లు ఇలాంటి టీ తాగండి చాలు..!

పాలు, చక్కెర కలిపి తయారు చేసిన టీ తాగటం మానేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. కానీ, డయాబెటిక్ పేషెంట్లు టీ ఎలా తాగాలో ప్రత్యేకించి చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ డైట్‌ విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. షుగర్ లెవల్స్ మెయింటెయిన్ చేయడం తప్పనిసరి అంటున్నారు. షుగర్‌ బాధితులు దూరంగా ఉండాల్సిన ఆహారాల్లో టీ కూడా ఒకటి. ఇందులో పాలు, పంచదార ఉన్నందున దీనిని నివారించడం మంచిదని చెబుతున్నారు.. కానీ, డయాబెటిక్ పేషెంట్లు ఎలాంటి టీ తాగితే మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

1. గ్రీన్ టీ

మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఆరోగ్యకరమైన టీలలో గ్రీన్ టీ ఒకటి. గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాదు, గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
2. దాల్చిన చెక్క టీ

దాల్చిన చెక్క టీ మధుమేహాన్ని నియంత్రించడంలో ఉత్తమమైనది. దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క టీ చేయడానికి, ఒక కప్పు నీటిలో దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత టీకి బదులుగా తాగేయాలి.

3. మెంతి టీ

డయాబెటిక్ బాధితులకు మెంతి టీ మరొక గొప్ప ఎంపిక. మెంతులలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. మెంతి టీ చేయడానికి, ఒక కప్పు వేడి నీటిలో ఒక చెంచా మెంతులు వేసి 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టి తాగేయండి. రుచి కోసం కావాలంటే మీరు నిమ్మరసం కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

4. వాముతో తయారు చేసిన టీ

వాము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వాము టీ తయారు చేయడానికి ఒక గ్లాస్‌ నీటిలో పావు చెంచా వాము వేసి 5 నిమిషాలు మరిగించండి. కాస్త ఆ తర్వాత వడకట్టి తాగాలి.

5. తులసి టీ

తులసి టీలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. తులసి ఆకులు హైపోగ్లైసీమిక్ ప్రభావాలను కలిగి ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీని కోసం, ఒక కప్పు వేడి నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రుచి కోసం కొంచెం తేనె కలుపుకుని తాగేయొచ్చు.

చివరగా, మధుమేహులు ఇలాంటి టీ తాగుతున్నప్పుడు దానికి చక్కెర, లేదా తేనె కలుపుకోవడం మంచిదికాదు. రుచి కోసం కావాలంటే మీరు దాల్చినచెక్క పొడి లేదా ఏలకుల పొడి వేసుకుని తాగొచ్చు. మరీ ముఖ్యంగా ఇలాంటి ఇంటి చిట్కాలు, ఆయుర్వేద మందులు వాడే ముందు..మీరు మీ వైద్యుడిని సంప్రదించండి. దీనితో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, వైద్యుల సలహాలను అనుసరించడం చాలా ముఖ్యం.

Cockroach: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా.. అయితే వెంటనే టిప్స్ ఫాలోకండి

చాలామంది మహిళలు ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ బొద్దింకలు వస్తూనే ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇంట్లో తిరుగుతూ చికాకాను తెప్పిస్తాయి. బెద్దింకలకు చెక్ పెట్టే కొన్ని టిప్స్ ఎంటో తెలుసుకుంటే ఇక హాయిగా ఉంటూ వాటిని వదిలించుకోవచ్చు. అయితే చాలామంది మార్కెట్లో దొరికే మందులను వాడుతుంటారు. అయితే అందులో కొన్ని పనిచేస్తే, మరికొన్ని ఏమాత్రం ప్రభావం చూపవు. అంతేకాదు.. ఇంట్లోవాళ్లు అనారోగ్యానికి కూడా గురవుతుంటారు. అయితే ఇంట్లోనే నేచురల్ గా దొరికే పదార్థాలతో బొద్దింకలకు చెక్ పెట్టొచ్చు. ఎటువంటి హాని లేకుండా శాశ్వతంగా బొద్దింకలను వదిలించుకోవచ్చు. ఎలాగంటే…

నిమ్మరసం, నీరు

ముందుగా, స్ప్రే బాటిల్‌లో ఒకే మోతాదులో నిమ్మరసం, నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ వంటగది మూలల్లో షెల్ఫ్‌ల కింద, సింక్ చుట్టూ, బొద్దింకలు తిరిగే చోట స్ప్రే చేయండి. బొద్దింకలు నిమ్మకాయ పుల్లని వాసనను ఇష్టపడవు. దీంతో అక్కడ్నుంచి పారిపోతాయి.

బేకింగ్ సోడా, చక్కెర

ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా, చక్కెర కలపండి. వంటగదిలోని వివిధ భాగాలలో ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయండి. చక్కెర బొద్దింకలను ఆకర్షిస్తుంది. అయితే బేకింగ్ సోడా వాటిని చంపుతుంది.

బోరిక్ యాసిడ్

మీ వంటగదిలోని పగుళ్లలో బోరిక్ యాసిడ్ పొడిని వేయండి. బోరిక్ యాసిడ్ బొద్దింకలకు ప్రాణాంతకం. వెంటనే వాటిని చంపుతుంది.

వేపనూనె, నీటితో

వేపనూనెలోని గుణాలు బొద్దింకలను దూరంగా ఉంచుతాయి. మీరు చేయాల్సిందల్లా వేపనూనెను నీటిలో కలిపి, స్ప్రే బాటిల్‌లో నింపి మీ వంటగదిలోని మూలలో స్ప్రే చేయండి. దీని వల్ల బొద్దింకలు చనిపోతాయి.

క్లీనింగ్ తప్పనిసరి

అయితే చాలామంది సింకుల్లో ఉన్న గిన్నెల తోమకుండా అలాగే వదిలేస్తుంటారు. వాటి వల్ల బొద్దింకలతో పాటు ఇతర కీటకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు క్రమం తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకుంటూ డెటాల్ లాంటి వాడితే ఎలాంటి సమస్య ఉండదు.

ఏపీ రాజధానిపై స్పష్టత లేదు.. అందుకే RBI కార్యాలయం ఏర్పాటు చెయలేక పోయాం

అమరావతి: ఏపీకి రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ సమిత్‌ తెలిపారు.

అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటుపై గుంటూరుకు చెందిన జాస్తి వీరాంజనేయులు 2023లో ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.

అఖిలభారత పంచాయతీ పరిషత్‌ ఏపీ అధ్యక్షుడి హోదాలో ఆయన రాసిన లేఖను.. ప్రధాని కార్యాలయం ఆర్‌బీఐకి పంపించింది. దీంతో రిజర్వు బ్యాంకు అధికారులు ఆ లేఖకు సమాధానమిచ్చారు. రాజధాని విషయం తేలనందునే కార్యాలయం ఏర్పాటు చేయలేదని వీరాంజనేయులుకు ఆర్‌బీఐ లేఖ పంపింది. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆర్‌బీఐ అధికారులు అందులో సమాధానమిచ్చారు. దీనిపై జాస్తి వీరాంజనేయులు ఆగ్రహం వెలిబుచ్చారు. ”2016లోనే అమరావతిలో ఆర్‌బీఐకి అప్పటి తెదేపా ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించింది. కేంద్రప్రభుత్వ మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించింది. పార్లమెంట్ సాక్షిగా కూడా అమరావతి రాజధాని అని ప్రకటించింది. అయినా, ఆర్‌బీఐ అధికారులు ఏపీ రాజధాని ఏదో తెలియదన్నట్టు సమాధానమివ్వడం దారుణం” అని వ్యాఖ్యానించారు.

Whatsappలో ఈ చిన్న తప్పు చేశారంటే.. మీ అకౌంట్‌ బ్లాక్ అవుతుంది!

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు వాట్సాప్ ను వినియోగించేవారే. వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చాక సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం మరింత సులభమైపోయింది. క్షణాల్లోనే కావాల్సిన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా చేరవేయొచ్చు. చాట్స్, కాల్స్ తో యూజర్లు తెగ వాడేస్తుంటారు. రోజులో ఒక్కసారైనా వాట్సాప్ ని చూడని వారు ఉండరేమో కదా. మరి వాట్సాప్ యూజర్లు ఈ యాప్ ను వినియోగించే సమయంలో ఏవైనా తప్పులు చేస్తే మీ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు వాట్సాప్ సంస్థ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తుంది. భారత్ లో కూడా వాట్సాప్ వినియోగం ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే వాట్సాప్ వినియోగించేటపుడు దాని నియమ నిబంధనలకు లోబడి వ్వవహరించాల్సి ఉంటుంది. మెసేజ్ లు పంపేటపుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్‌ని నిబంధనలను ఉల్లంఘిస్తే మీ వాట్సాప్ ఖాతాను శాశ్వతంగా నిషేధించే అవకాశం ఉంది. కాబట్టి వాట్సాప్ ను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉంటే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చు.

ఇటీవల వాట్సాప్ నియమాలను ఉల్లంఘించిన దాదాపు 76 మిలియన్ల ఖాతాలను బ్లాక్‌ చేసింది. మత విధ్వేషాలను రెచ్చగొట్టే విధంగా, అల్లర్లకు తెరలేపే విధంగా మెసేజ్ లను వైరల్ చేయడంతో వాట్సాప్ సంస్థ కఠిన చర్యలు తీసుకుంది. కాబట్టి మీరు మెసేజ్ లను పంపే సమయంలో.. ఫార్వాడ్ చేసే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా మెసేజ్ లు ఉన్నట్లైతే వాట్సాప్ చర్యలు తీసుకునేందుకు వెనకాడదు.ఈ చిన్న చిన్న తప్పులు చేశారంటే మీ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

Shubman Gill: విరాట్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్! ఇది మామూలు ఘనత కాదు..

శుబ్ మన్ గిల్.. ఇటు కెప్టెన్ గా అటు బ్యాటర్ గా టీమ్ కు తిరుగులేని విజయాలను అందిస్తూ వస్తున్నాడు. ఈ సీజన్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు గిల్. తాజాగా రాజస్తాన్ తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 72 పరుగులతో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు గుజరాత్ కెప్టెన్. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు ఈ యంగ్ ప్లేయర్. మరి ఈ ఘనతకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు శుబ్ మన్ గిల్. కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ తో కలిసి తొలి వికెట్ కు 61 రన్స్ జోడించాడు. ఇక ఈ మ్యాచ్ లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు గిల్. ఐపీఎల్ చరిత్రలోనే 3000 వేల పరుగులను సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గిల్ 24 ఏళ్ల 215 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. ఇంతకు ముందు ఈ రికార్డు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ ఈ మార్క్ ను 26 ఏళ్ల 186 రోజుల్లో అందుకోగా.. తాజాగా ఈ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్.

ఈ లిస్ట్ లో వీరిద్దరి తర్వాత సంజూ శాంసన్, సురేశ్ రైనా, రోహిత్ శర్మలు ఉన్నారు. దీంతో పాటుగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఇన్నింగ్స్ ల పరంగా 3000 వేల రన్స్ పూర్తి చేసుకున్న ప్లేయర్ల జాబితాలో టాప్ 5లో చేరాడు. 94 ఇన్నింగ్స్ ల్లో గిల్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు కేవలం 75 ఇన్నింగ్స్ ల్లోనే 3 వేల పరుగులు దంచికొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్ నిర్దేశించిన 197 పరుగుల టార్గెట్ ను చివరి బంతికి ఛేదించింది గుజరాత్ టీమ్. అసలైతే ఈ మ్యాచ్ లో రాజస్తాన్ గెలవాల్సింది. కానీ రియాన్ పరాగ్ ఓవరాక్షన్ కారణంగా స్లో ఓవర్ రేట్ తో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

Credit Card Billing Cycle: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఎలా మార్చాలి? నిబంధనలు ఏమిటి?

క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌కి సంబంధించిన నియమాలలో రిజర్వ్ బ్యాంక్ కొన్ని మార్పులు చేసింది.

ఈ మార్పుల కారణంగా, మీ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది. అంటే, మీరు క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే ఇది బిల్లింగ్ సైకిల్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది. అది ఎలా ప్రయోజనకరంగా మారుతుంది? ఇప్పుడు చూద్దాం. నిజానికి ఆర్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన కొన్ని నియమాలను ఏప్రిల్ 2022లో తీసుకువచ్చింది. దీని ఉద్దేశం వినియోగదారుకు అతని కార్డ్‌పై మరింత కంట్రోల్ ను ఇవ్వడమే. ఈ నిబంధనలు జూలై 2022లో అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని బ్యాంకులను RBI కోరింది.

నిబంధనల ప్రకారం, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను మార్చడానికి వన్-టైమ్ ఆప్షన్‌ను ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు మార్చి 7 నుండి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలలో RBI కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పు ప్రకారం, బ్యాంకులు వారి క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు వారి బిల్లింగ్ సైకిల్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు మార్పులు చేసే అవకాశాన్ని ఇవ్వాలి.

Personal Loan : చాలా చీప్‌గా ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌చ్చు.. అది ఎలా అంటారా?

Personal Loan : మ‌న ప‌నుల‌తో మ‌నం బిజీబిజీగా ఉంటుండ‌గా, మ‌ధ్య‌లో ప‌ర్స‌న‌ల్ లోన్ కోసం కాల్స్ వస్తుండ‌డం వాటి వ‌ల‌న మ‌న‌కు చిరాకు రావ‌డం కూడా జ‌రుగుతుంటుంది. కుటుంబ అవసరాలు, వ్యాపార పెట్టుబడులు, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి చాలా మంది ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుంటారు. మధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే ఎక్కువ‌గా వాటిపై ఆధార‌ప‌డుతుంటారు. అయితే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే అవసరాలు తీరడంతో పాటు వ్యాపారాలలో కూడా ప్రగతి సాధించవచ్చు. మిగిలిన రుణాలతో పోల్చితే వ్యక్తిగత రుణాలకు ధ్రువీకరణ పత్రాలు పెద్దగా అవసరం ఉండదు. అయితే బ్యాంకులు వీటిని రిస్క్ గా పరిగణిస్తాయి.
త‌నఖా పెట్టుకోవ‌డానికి బ్యాంకుల‌లో ఎలాంటి వ‌స్తువులు ఉండ‌వు కాబ‌ట్టి వ‌డ్డీ రేటుని బ్యాంకులు గ‌ట్టిగానే విధిస్తాయి. అయితే వ్యక్తిగత రుణాలను కూడా తక్కువ వడ్డీ రేటుకు పొందే అవకాశం ఉంది. దానికి కోసం మీరు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముందుగా క్రెడిట్ స్కోరు. ప‌ర్స‌న‌ల్ లోన్ ఇచ్చే వారు ముందుగా క్రెడిట్ స్కోరు ప‌రిశీలిస్తారు. దానిని బ‌ట్టే రుణం ఇవ్వాలా వ‌ద్దా అని నిర్ణ‌యిస్తారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తి తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో మనం తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోరు మంచిగానే ఉంటుంది. ఇక మ‌నం రుణం తీసుకునే ముందు ఇత‌ర రుసుముల గురించి క్లియ‌ర్‌గా ప‌రిశీలించుకోవాలి. వడ్డీ, ఇతర ఖర్చులను ఎంత కలిపారో తెలుసుకోవాలి.

ఇక రుణాలపై వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. ప్రాసెసింగ్ చార్జీలు కూడా మారుతూ ఉంటాయి. రుణం తీసుకునే ముందు వాటినన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ బ్యాంకు నిబంధనలు అనుకూలంగా ఉన్నాయో, ఎక్కడ తక్కువ చార్జీలు విధిస్తారో త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటంఉది. ఇక అప్పు తీసుకున్న తర్వాత వాయిదాలు సకాలంలో చెల్లించగలరో, లేదో లెక్కవేసుకొని దానిని బ‌ట్టి ముందుకు వెళ్లాలి. మీకు వస్తున్న ఆదాయం, ఖర్చులతో పాటు అత్యవసరాలకు కూడా కొంత మొత్తాన్ని ప‌క్క‌న పెట్టి ముందుకు సాగాలి

Real Estate News: గృహ కొనుగోలుదార్లకు పిడుగులాంటి వార్త.. ఇలా అయితే కష్టమే మరి..

Cement Prices: అంతకంతకూ పెరుగుతున్న ఖర్చులు సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గృహ నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇళ్ల ధరలకు హద్దే ఉండటం లేదు. తాజాగా మరో వార్త ఇప్పుడు గృహ కొనుగోలుదార్లకు నిద్ర పట్టనివ్వడం లేదు.

దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలు పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించి షాక్ ఇచ్చాయి. ప్రాంతాన్ని బట్టి బస్తాకు 10 నుంచి 40 వరకు ప్రియం కానున్నట్లు తెలిపాయి. ఈ నిర్ణయంతో ఇప్పటికే డీలా పడిన గృహ కొనుగోళ్ల డిమాండ్‌ మరింత బలహీనపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావం రిటైల్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. పెద్దఎత్తున చేపడుతున్న నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్ద దెబ్బగా బిల్డర్లు చెబుతున్నారు.

బలహీన డిమాండ్ కారణంగా వరుసగా 5 నెలల పాటు సిమెంట్ ధరలు క్షీణించాయి. ఈ సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు రేట్లు పెరిగాయి. సిమెంట్‌ ధరల పెంపు వల్ల ఇళ్లకు డిమాండ్‌ మరింత తగ్గుతుందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ నిరంజన్ హీరానందని పేర్కొన్నారు. ప్రతి 10 రూపాయల సిమెంట్ ధర పెరుగుదల.. నిర్మాణ వ్యయంపై సుమారు 5 రూపాయల మేర ప్రభావం చూపుతుందని కొలియర్స్ ఇండియా MD జతిన్ షా తెలిపారు. వినియోగదారుల మనోభావాలను ఇది ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. సిమెంట్ ధరలు పెరగడానికి వివిధ అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముడి పదార్థాలు, విద్యుత్ మరియు రవాణా ఖర్చుల పెరుగుదల ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమకు సవాలుగా నిలవనుంది. ఈ కారణంగా బిల్డర్‌లు ఈ ధరల హెచ్చుతగ్గులను నావిగేట్ చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న మరియు భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల కొనసాగింపుపై పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రపంచంలోనే భారత్ రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ఉంది. దీనికితోడు గ్లోబల్ ఇన్‌స్టాల్ కెపాసిటీలో 8 శాతానికి పైగా వాటా ఇండియా సొంతం. క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం భారతీయ సిమెంట్ పరిశ్రమ FY24లో దాదాపు 80 మిలియన్ టన్నుల (MT) సామర్థ్యాన్ని జోడించింది. గత 10 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. FY27 చివరి నాటికి సిమెంట్ వినియోగం 450.78 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా.

BREAKING: నేడు ఆకాశంలో మరో అద్భుతం.. భూమికి దగ్గరగా రానున్న గురు గ్రహం

కొన్నేళ్ల ఏళ్ల తరవాత ఆకాశంలో అరుదైన ఘట్టం అవిష్కృతం కాబోతోంది. నేడు భూమికి అతి దగ్గరగా గురు గ్రహం రాబోతోంది. అయితే, సాధారణంగా గురుగ్రహం భూమికి 85 వేల కోట్ల కి.మీ.దూరంలో తిరుగుతూ ఉంటుంది. కాగా, నేడు పరిభ్రమనలో భాగంగా ఇవాళ రాత్రి గురు గ్రహాన్ని భూమి నుంచి వీక్షించే అవకాశం దేశ ప్రజలకు లభించనుంది. చంద్రుడిపై చిన్న నక్షత్రంలా గురు గ్రహం దర్శనమివ్వనుందని ఖగోళ శాస్రజ్ఞులు తెలిపారు.

తల్లిదండ్రులకు గమనిక.. పిల్లలకు ముందు ఇది ఇవ్వండి.. కేంద్ర ప్రభుత్వ ఆదేశం..!!

Blue Aadhaar: దేశంలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటిగా మారిపోయింది. బ్యాంకింగ్ పనుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఏది పొందాలన్నా అందుకు ఆధార్ తప్పనిసరి. దీనిని ఇతర అవసరాలకు గుర్తింపు కార్డుగా కూడా పరిగణించబడుతోంది.

కేవైసీ ధృవీకరణ కోసం ఉపయోగించే అతి ముఖ్యమైన పత్రం ఆధార్ కార్డ్. గతంలో పెద్దలకు మాత్రమే ఉన్న ఆధార్ కార్డును 2018 నుంచి చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకురాబడింది. వీటిని బ్లూ ఆధార్ కార్డ్ అని పిలుస్తారు. ఈ ఆధార్ కార్డ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ద్వారా జారీ చేయబడింది. 12 అంకెల ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు సంఖ్య వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది.

2018లో పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు బ్లూ ఆధార్ కార్డును ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలు పొందే బ్లూ ఆధార్ కార్డు నమోదు చేసినప్పటి నుంచి కేవలం 5 ఏళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుందని తల్లిదండ్రులు గమనించాలి. దీనిని పొందటానికి ఎలాంటి ప్రధాన పత్రాలు అవసరం ఉండదు. తల్లిదండ్రులు ఉపయోగించే బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ స్లిప్ సరిపోతుంది. ఇది కాకుండా పిల్లల బడికి వెళుతుంటే వారి ఐడి కార్డ్ కూడా గుర్తింపుకు స్వీకరించబడుతుంది. ఇప్పుడు ఈ కార్డు పాఠశాల అడ్మిషన్ల కోసం ఉపయోగించబడుతుంది. బ్లూ ఆధార్ కోసం వారి తల్లిదండ్రుల UIDతో లింక్ చేయబడిన ఫోటో మాత్రమే సరిపోతుంది. తర్వాత వారి ఐరిస్, వేలిముద్రలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో బ్లూ ఆధార్ కార్డ్ నమోదు ప్రక్రియ.. 1) బ్లూ ఆధార్ కార్డ్ పొందడానికి ముందుగా మనం అధికారిక వెబ్‌సైట్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

2) తర్వాత “మై ఆధార్”కి వెళ్లండి. “మై ఆధార్” విభాగాన్ని కనుగొని, “అపాయింట్‌మెంట్ బుకింగ్”పై క్లిక్ చేయండి. 3) ఇక్కడ “చైల్డ్ ఆధార్” ఎంచుకోండి. “న్యూ ఆధార్”ని ఎంచుకుని, మీ మొబైల్ నంబర్, సెక్యూరిటీ కోడ్ (క్యాప్చా) నమోదు చేయండి. “కుటుంబ అధిపతితో సంబంధం” కింద, “చైల్డ్ (0-5 సంవత్సరాలు)” ఎంచుకోండి. 4) మీ పిల్లల వివరాలను పూరించండి. పిల్లల పేరు, పుట్టిన తేదీ, చిరునామాను జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ ఆధార్ కార్డులతో పాటు పిల్లల బర్త్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

5) వివరాలన్నీ పూరించిన తర్వాత అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. సమీపంలోని ఆధార్ సేవా కేంద్రంలో వీలును బట్టి తేదీ, సమయాన్ని ఎంచుకోండి. తర్వాత కేంద్రాన్ని సందర్శించి బ్లూ ఆధార్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోండి.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారిలో ఉండే ప్రత్యేక గుణలు ఇవే..

ఏప్రిల్ నెలలో( month of April ) జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో వికసించే పువ్వులు, వసంత సాహసాలు మరియు వేసవి ప్రారంభాన్ని తెలియజేస్తాయి.

ఏప్రిల్ లో జన్మించిన వ్యక్తులు వారి ప్రత్యేక లక్షణాల కలయికకు ప్రసిద్ధి చెందారు. వారి ఉత్సాహం మరియు తెలివితేటలతో ప్రసిద్ధి చెందారు. ఏప్రిల్ నెలలో జన్మించిన పిల్లల భవిష్యత్తు, వ్యక్తిత్వం( Children’s future, personality ) మరియు లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ లో జన్మించిన వారు తమ జీవితాంతం తరచుగా జోకులతో మరియు చిలిపిగా ఉంటారు.

ముఖ్యంగా ఏప్రిల్ ఫూల్స్ డే రోజు పుట్టిన వారు ఆనందాన్ని పంచడం అలవాటు చేసుకుంటారు.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారు వారి చుట్టూ ఉన్న వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఏప్రిల్ నెలలో జన్మించిన వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడానికి నమ్మశక్యం కాని విధంగా పని చేస్తారు. వారు ఒక దానిపై దృష్టి సారించిన తర్వాత వారు దాన్ని సాధించడానికి ఏమైనా చేస్తారు.అలాగే వీరు మొదలుపెట్టిన పనిని ఎంతో పట్టుదలతో పూర్తి చేస్తారు. ఏ పనిలోనైనా విజయం సాధించడానికి తమను తాము అంకితం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు.

అలాగే ఏప్రిల్ నెలలో జన్మించిన వారు సవాళ్లకు దూరంగా ఉంటారు. ఏప్రిల్ లో జన్మించిన వ్యక్తులు వారి పనులలో సృజనాత్మకతను కలిగి ఉంటారు. కళా, సంగీతం, సాహిత్యం ( Art, Music, Literature )మొదలైన వాటి పై వారి అభిరుచిని పెంచుకుంటూ ఉంటారు. వారు ప్రపంచం పై ప్రత్యేకమైన దృక్పధాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కొత్త మరియు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతారు.

ఏప్రిల్ లో జన్మించిన వ్యక్తుల యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణాలలో ఒకటి వారి తేజస్సు. వీరు ప్రజలను తమ వైపుకు ఆకర్షించే సహజ ఆకర్షణను కలిగి ఉంటారు. వారు ఎక్కడికి వెళ్లినా స్నేహితులను సంపాదించుకుంటారు.వీరు స్నేహపూర్వక స్వభావం మరియు స్నేహపూర్వక ప్రవర్తన వీరిని అందరినీ దగ్గర చేస్తుంది. ఏప్రిల్ లో జన్మించిన వ్యక్తులు ఇతరుల పట్ల లోతైన సానుభూతి మరియు కరుణను కలిగి ఉంటారు. అవసరమైన వారికి సహాయం చేయడానికి వీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాగే వారు వ్యక్తుల భావోద్వేగాలను అర్థం చేసుకునే సమర్ధాన్ని కలిగి ఉంటారు.

Big shock to CM Jagan: జగన్‌కు మరో బిగ్ షాక్, ఈ వారంలో ఉత్తర్వులు..?

Big shock to CM Jagan: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతల మధ్య వివాదాస్పద మాటలు పక్కనబెడితే.. ఎన్నికల సంఘం అందరిపై ఓ కన్నేసి ఉంచుతోంది. తాజాగా సీఎం జగన్ మరో షాక్ తగలనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

ముఖ్యంగా సీఎస్ జవహర్‌రెడ్డి మార్పుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎస్ పదవి నుంచి ఆయన్ని తప్పించకుండా వేరే రాష్ట్రానికి ఎన్నికల అబ్జర్వర్‌గా కేంద్ర ఎన్నికల సంఘం పంపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్కడి నేతలు బలంగా చెబుతున్నారు. ఇదే జరిగితే జగన్ గెలుపు కష్టమనే అన్నవారు లేకపోలేదు. సీఎస్ జవహర్‌రెడ్డి స్థానంలో నలుగురు పేర్లు పంపించారట. వారిలో సీనియర్ ఐఏఎస్ రజత్ భార్గవ్, అనంతరాములు, ఆర్పీ సిసోడియా, నీరవ్ కుమార్ ప్రసాద్‌లు ఉన్నారు. దాదాపు నీరవ్‌కుమార్ పేరు ఖారైనట్లు తెలుస్తోంది.

సీఎస్ జవహర్‌రెడ్డిని తప్పించడానికి కారణాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లా వ్యక్తి కావడం, రెండోది ప్రధాని నరేంద్రమోదీ చిలుకలూరిపేట సభ ఇష్యూ, మూడోది ఏపీలో పింఛన్ల వ్యవహారం.. ఇవన్నీ కలిసి ఆయన వేటుకు కారణమని చెబుతున్నారు. అయితే ఎన్నికల వేళ అధికారుల బదిలీలు, తప్పించడం సహజమేనని నేతలు చెబుతున్నమాట. గత టీడీపీ హయాంలోనూ సీఎస్‌ను మార్చిన సందర్భాలను ఇక్కడ గుర్తు చేస్తున్నారు పలువురు రాజకీయ నేతలు.
మరోవైపు ఏప్రిల్ మూడోవారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈలోగా డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులను ఎన్నికల సంఘం మార్చే అవకాశముందని పలువురు ఐపీఎస్‌లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లపై వేటు వేసింది ఎన్నికల సంఘం. కొందరికి పోస్టింగులు ఇవ్వగా, మరికొందరిని పెండింగ్‌లో పెట్టింది. సిన్సియర్ ఐపీఎస్ అధికారి రఘురామ్‌రెడ్డిని అస్సాం ఎన్నికల అబ్జర్వర్‌గా ఈసీ పంపిన విషయం తెల్సిందే. మొత్తానికి సీఎం జగన్ అంతర్గత వ్యూహాన్ని టీడీనీ నేతలు బట్టబయలు చేస్తున్నారు.

Triphala Water : ప్రతిరోజు ఉదయం ఈ త్రీఫల చూర్ణం తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో…?

Triphala Water : త్రిఫల అనే పదం మీరు వినే ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ముఖ్యంగా ప్రతిరోజు దీనిని ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ త్రీఫల గురించి చాలామందికి తెలియదు. కానీ ఆయుర్వేద గ్రంధాలలో త్రిఫల వేయి ఆరోగ్యకరమైన గుణాలను కలిగి ఉంటుందని చెబుతున్నాయి. అయితే వాస్తవానికి ఈ త్రీఫల అనేది సంస్కృత పదం. ఇక ఇది మూడు పండ్ల మిశ్రమం కాబట్టి దీనిని త్రీఫల అని పిలుస్తారు. దీనిని ఉసిరికాయ , తానికాయ , కరక్కాయ..పండ్లతో కలిపి తయారు చేయడం వలన త్రీఫలగా పిలుస్తారు. దీనిలో ఒక్కో పండులో ఉన్న ఒక్కో రకమైన పోషక మరియు ఆరోగ్య గుణాలు ఉండటం వలన ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. మరి ఈ త్రీఫలను ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Triphala Water : ప్రయోజనాలు…
త్రిఫల చూర్ణాన్ని మూడు పండ్ల మిశ్రమంతో ఎంతో నాణ్యతగా తయారు చేస్తారు. కావున దీని ప్రయోజనాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి.

Triphala Water : జీర్ణ క్రియ మెరుగుపరచడానికి…
త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే ప్రతిరోజు ఉదయం త్రిఫల లేదా త్రీఫల నానబెట్టిన నీటిని తాగటం వలన ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేద గ్రంధాలలో ఈ త్రీఫల చూర్ణం తీసుకున్న తర్వాత గ్యాస్ మందులు అసలు తీసుకోకూడని సూచించారు. అంతేకాక ఆరోగ్య నిపుణులు సైతం అదే చెబుతున్నారు. కావున త్రిఫల చూర్ణాన్ని తీసుకున్నప్పుడు గ్యాస్ మందుకు దూరంగా ఉండటం మంచిది.
Triphala Water : దంతాల ఆరోగ్యం…
త్రీఫలను ప్రతిరోజూ తీసుకోవడం వలన దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక దంతాలపై ఉండే పసుపు మరకలను తొలగించడానికి , చిగుళ్ల నుండి రక్తస్రావం నివారించడానికి , నోటి దుర్వాసన వంటి సమస్యలను నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక త్రిఫల చూర్ణాన్ని తీసుకోవడం వలన శరీరంలో ఉండే అదనపు కొవ్వును సులువుగా కరిగించవచ్చు. అంతేకాక ఈ త్రీఫల వలన జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. తద్వారా సులువుగా బరువు తగ్గుతారు.

నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (తేదీ 11/04/24)

Today panchangam and Horoscope in Telugu: నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (11/04/24)

ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం , యమగండం సమయం, రాహూకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : ఉదయం 06:27 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:22 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు ఏప్రిల్ 11 శుభ సమయాలు

బ్రహ్మ ముహుర్తం సమయం : తెల్లవారుజామున 05:09 గంటల నుంచి ఉదయం 05:57 గంటల వరకు ఉంటుంది.
అభిజిత్ ముహుర్తం సమయం : ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 గంటల వరకు ఉంటుంది.

గోధూళి ముహూర్తం సమయం : లేదు.

అమృత కాలం సమయం : ఉదయం 11:21 నుంచి మధ్యాహ్నం 12:51 గంటల వరకు ఉంటుంది.

నేడు ఏప్రిల్ 11 అశుభ సమయాలు
యమగండం సమయం : ఉదయం 06:06 నుంచి ఉదయం 07:39 గంటల వరకు ఉంటుంది.

దుర్ముహర్తం సమయం : ఉదయం 10:13 నుంచి ఉదయం 11:02 గంటల వరకు ఉంటుంది.

రాహూకాలం సమయం : మధ్యాహ్నం 01:49 నుంచి మధ్యాహ్నం 03:22 గంటల వరకు ఉంటుంది.

గులిక్ కాలం సమయం : ఉదయం 09:11 నుంచి ఉదయం 10:44 గంటల వరకు ఉంటుంది.

మేషం
అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

వృషభం
మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందకపోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

మిథునం
ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. మీ బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్సును ఇస్తుంది.

కర్కాటకం
శుభ సమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.

సింహం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

కన్య
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.

తుల
శుభకాలం. చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. అధికారుల కోపానికి గురికాకుండా, ఓర్పుగా వ్యవహరించండి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.

వృశ్చికం
మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శారీరకశ్రమ పెరుగుతుంది. గిట్టనివారితో మితభాషణం అవసరం. స్థానచలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

ధనుస్సు
ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీలక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.

మకరం
పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరారాధన శుభప్రదం.

కుంభం
శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన శుభకరం.

మీనం
సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీలక్ష్మీ సందర్శనం ఉత్తమం.

APPSC Group -2 Prelims Results

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష (Prelimis) ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. మొత్తం 92,250 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ జరిగిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జులై 28న ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు.ప్రిలిమ్స్కు రాష్ట్ర వ్యాప్తంగా 4,04,037 మంది హాజరయ్యారు. ఏపీ 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో పరీక్ష జరిగింది.

Chanakya Niti: పొరపాటున కూడా ఈ నలుగురిపై కోపం తెచ్చుకోకండి.. వీరితో వాదన చేస్తే మీకే నష్టమంటున్న చాణక్య

చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి గుర్తింపునిస్తుంది. మనిషి ప్రవర్తన ఆధారంగా మంచి చెడులను అనుభవించాల్సి ఉంటుంది. మీరు కూడా మీ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలనుకుంటే ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించండి

విజయం సాధించాలనే అహంకారం లేదా తన దగ్గర డబ్బు ఎక్కువ అనే అహంభావం ఉన్న వారి వద్ద లక్ష్మీదేవి ఉండదు. చాణక్యుడి ప్రకారం డబ్బు ఉందనే అహంకారం మీలో ఉంటే.. మీ తెలివితేటలు భ్రష్టు పట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. డబ్బు తెచ్చిన అహంకారంతో ఉన్నవారు ఆ డబ్బుని పోగొట్టుకుని పేదవారు కావచ్చు.

స్నేహితుల మీద కోపం తెచ్చుకోకండి: స్నేహంబంధం జీవితంలో చాలా ప్రత్యేకమైనది. సరదాగా, సంతోషంగా ఉండడమే కాదు.. మీ రహస్యాలను పంచుకోవడం వరకు.. మీ స్నేహితులు మీకు అడుగడుగునా మద్దతు ఇస్తారు. స్నేహితులపై కోపం తెచ్చుకోవడం వల్ల మీరు వారిని శాశ్వతంగా కోల్పోవచ్చు. దీనితో.. విశ్వాసం కలిగిన మంచి వ్యక్తి.. విశ్వసనీయ సంబంధం ముగుస్తుంది.

ఆధునిక కాలంలో నేటి యువత తమ వృద్ధ తల్లిదండ్రుల గురించి తరచుగా సిగ్గుపడుతున్నారు. కాలక్రమేణా.. ప్రతి ఒక్కరి శరీరంలో వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఇదొక రోజు వృద్ధులు అవుతారు. అందుకే మీ పేరెంట్స్‌ని చూసి సిగ్గుపడడం కానీ.. వారిని మార్చుకోవాలని కానీ ఎప్పుడూ ప్రయత్నించకండి. తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించండి.

How To Control Someone: ఇతరులను ఎలా కంట్రోల్ చేయాలి..? ఈ చాణక్య వ్యూహాలు పాటించండి

Chanakya Niti in Telugu: ఎదుటివారిని ఎలా కంట్రోల్ చేయాలో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పొందుపరిచారు. ఇతరుల స్వభావాన్ని బట్టి.. మనం మాట్లాడాల్సి ఉంటుంది. మనం చెప్పిన మాట వారు వినాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

Chanakya Niti in Telugu: ఇతరులను ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక కళ. ఎదుటివారు మన మాట వినేలా ఒప్పించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. తమ మాటతీరు ఆకట్టుకునే నేర్పు కొందరిలోనే ఉంటుంది. భారతీయ పురాతన తత్వవేత్త ఆచార్య చాణక్యుడికి ఎవరినైనా తన మాట`వినేలా చేసే శక్తి ఉంది. ఎదుటివారిని అలవోకగా తన నియంత్రణలోకి తెచ్చుకునే సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయన బోధనలు, సూక్తులు నేటి యువతకు మార్గం దర్శకంగా నిలుస్తున్నాయి. ఆచార్య చాణక్యుడు ఎలాంటి వ్యక్తినైనా ఆకట్టునేలా ఎలా మాట్లాడలో తన నీతిశాస్త్రంలో వివరించారు. మీరు కూడా మీ మాటను ఇతరుల వినేలా.. మీ నియంత్రణలో ఉండాలని కోరుకుంటున్నారా..? అయితే చాణిక్యుని నీతిశాస్త్రంలోని విషయాలను తెలుసుకోండి. ఈ పద్ధతులను అనుసరించి.. ఎదుటివారిని ఆకట్టుకోండి.

ఎదుటివారితో మాట్లాడుతుంటే.. వారు ఎలాంటి వారో క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. వ్యక్తి స్వభావాన్ని బట్టి మనం మాట్లాడాలి. అందరికీ ఒకే రీతిలో ఆకట్టుకోలేం. ఇతరులకు మనం ఏ విషయం అయినా చెప్పే ముందు పూర్తి సమాచారం అందించాలి. మనం ఎన్ని చెప్పినా.. కొంతమంది తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు ఇతరులు చెప్పిన మాటలు పట్టించుకోరు. అలాంటి వారి ధోరణిని మార్చాలంటే.. మనకు ముందు విషయ పరిజ్ఞానం ఉండాలి.

అత్యాశ గల వ్యక్తులతో ఇలా..

ముల్లును ముల్లుతోనే తీయాలని అంటారు. అత్యాశ గల వ్యక్తికి ఏదైనా ఆశ చూపితినే లొంగుతారు. వారు మాటలకు అస్సలు పడిపోరు. అంటే డబ్బు లేదంటే వారు కోరుకున్నది ఇచ్చినప్పుడే మీ చెప్పిన విషయాలను అంగీకరిస్తారు.

తెలివి తక్కువ వారితో..

తెలివి తక్కువ వ్యక్తులను ఒప్పించాలంటే.. వారి మనస్తత్వానికి తగిన విధంగా వ్యవహరించాలి. వారికి నచ్చిన పనిని మీరు చేస్తే.. వాళ్లకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడే మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు మీరు చెప్పినదల్లా చేస్తారు.

తెలివైన వ్యక్తులతో ఇలా..

తెలివైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారితో మీరు తెలివిగానే మాట్లాడాలి. తెలివితో మీరు చెప్పే విషయాలను వారు అంగీకరిస్తారు. అతి తెలివి ప్రదర్శించకుండా.. వాళ్లకు నిజాలే చెప్పాలి. మీకు కూడా అన్ని విషయాల గురించి తెలియకపోతే.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాట వినరు. మిమ్మల్ని చులకనగా కూడా చూస్తారు.

గర్విష్ఠులతో ఇలా..

అహంకారం ఉన్న వ్యక్తులను ఒప్పించడానికి ముందు మీ గర్వం పక్కనపెట్టాల్సి ఉంటుంది. వారిని మీ నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే.. వాళ్లను గౌరవించాలి. వారికి నమస్కరించి.. కాస్త పొగడాలి. వారిని పొగడ్తలతో ముంచేస్తూ.. తల వంచినట్లు ప్రవర్తించాలి. ఇలా చేస్తే వాళ్లే వాళ్లకు తెలియకుండా మీ మాటలకు బానిసలుగా మారిపోతారని చాణక్య నీతి చెబుతోంది. అహంకారులు సాధారణంగా ఎవరి మాట వినరు. తమ ఎంచుకురన్న మార్గమే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. అందుకే వారికి ఇచ్చే విలువను వారి ఇచ్చి.. మీ వ్యవహరాలను చక్కదిద్దుకోవచ్చు.

చాణక్య నీతి: విజయం సాధించాలంటే చాణక్య చెప్పిన 4 మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..

చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహకర్త, ఆర్థికవేత్త. అంతే కాదు.. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాలా పుస్తకాలను రచించారు. అతను చెప్పిన నీతి వ్యాఖ్యల కారణంగా ఆయనకు కౌటిల్యుడు అని పేరు వచ్చింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంధంలో అనేక అంశాలను ఆచార్యుడు ప్రస్తావించారు. ఆయన రాసిన చాణక్య నీతి ఇప్పటికీ ప్రజలకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. అయితే జీవితంలో విజయం సాధించాలంటే ఆచార్య చాణక్య 4 మార్గాలను సూచించారు. వాటి గురించి తెలుసుకుందాం.

1. మతం మార్గం విజయాన్ని సాధించడానికి అధర్మ మార్గాన్ని ఎప్పటికీ ఎంచుకోరాదని ఆచార్య చాణక్య సూచించారు. అటువంటి విజయం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా వెళ్లిపోతుందని చెప్పారు. మతం మార్గం కొంచెం కష్టమైనది కావొచ్చు కానీ అది మీ కీర్తిని చాలా దూరం తీసుకువెళుతుంది.

2. క్రమశిక్షణ అవసరం క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆచార్య చెప్పారు. విజయం సాధించాలనుకుంటే ప్రతి ఒక్క నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమయాన్ని అస్సలు వృథా చేయరాదన్నారు. క్రమశిక్షణ లేకుంటే జీవితంలో విజయం సాధించడం అసాధ్యమన్నారు.

3. ఓటమికి భయపడవద్దు.. ఒక వ్యక్తి లక్ష్యాన్ని సాధించే క్రమంలో చాలాసార్లు ఓటమిని ఎదుర్కోవలసి వస్తుంది కానీ దాని గురించి ఎప్పుడు భయపడవద్దని ఆచార్య చాణక్య సూచించారు. ఓడిపోవడం కూడా మీ అభ్యాస ప్రక్రియలో ఒక భాగమని చెప్పారు. జీవితంలో సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి దానికోసం నిత్యం కష్టపడాలని తెలిపారు.

4. సోమరితనం విడనాడాలి సోమరితనం ఉన్న వ్యక్తి పనిని పలుమార్లు వాయిదా వేస్తాడు. కానీ అది సరైన పద్దతి కాదని ఆచార్య చాణక్య సూచించారు. మీరు జీవితంలో విజయం సాధించాలంటే సోమరితనం విడనాడాలని చెప్పారు. సోమరితనం వల్ల ఒక వ్యక్తి ఎప్పుడు విజయం సాధించలేడని తెలిపాడు. అంతేకాదు సోమరితనాన్ని అతి పెద్ద శత్రువుగా భావించారు.

Andhra Pradesh: అయ్యో పాపం.. కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన రెండేళ్ల బాలుడు.. తీవ్ర విషాదం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింగ్ అనుకుని రెండేళ్ల బాలుడు పెట్రోల్ తాగిన సంఘటన ఆ ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషాదకర ఘటన నెల్లూరు నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఇరుగాళమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా, అమ్ము దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరిముల్లా చికెన్ దుకాణం నడిపిస్తుండగా..అమ్ములు చేపల దుకాణంలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ హాయిగా జీవిస్తున్నారు.

అయితే, ఈ నెల 7వ తేదీ సాయంత్రం అమ్ము ఇరుగాళమ్మ ఆలయం దగ్గర పనిచేస్తుండగా…ఆమె కొడుకు కాలేషా తన వద్దే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ ఒక బాటిల్లో ఉన్న పెట్రోల్ చూసిన బాలుడు.. అది కూల్ డ్రింక్ అనుకుని తాగాడు.. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన తల్లి బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. బాధిత తల్లిదండ్రులు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

Life style: కాళ్లలో కనిపించే ఈ లక్షణాలు.. లివర్‌ డ్యామేజ్‌కు సంకేతాలు..

శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు ముందస్తు వ్యాధులకు సంకేతాలుగా నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధులకు సంబంధించి శరీరం ముందుగానే మనల్ని ఈ లక్షణాల ద్వారా అలర్ట్ చేస్తుంది.

అలాంటి వాటిలో కొన్ని లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా లివర్‌ సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే లివర్‌ సమ్యలను ముందుగానే గుర్తిస్తే.. చికిత్స కూడా త్వరగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ లివర్‌ వ్యాధిని ముందుగా గుర్తించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కాలేయం దెబ్బతినడం ప్రారంభమైనప్పుడు. పాదాలు, చీలమండలు, అరికాళ్లు ఉబ్బుతాయి. ఇవి కాలేయ సంబంధిత వ్యాధుల సంకేతాలు కావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ వ్యాధి కారణంగా కాలేయ వ్యాధి సిర్రోసిస్‌తో పాటు కాలేయ క్యాన్సర్‌గా మారుతుంది. దీని కారణంగా కాలు వాపు ప్రారంభమవుతుంది.

* హెపటైటిస్ వ్యాధి ప్రాథమిక లక్షణాల్లో కాళ్లలో దురద కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు కాలేయ వ్యాధి ఉన్న వారికి చేతులు, కాళ్ల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దురద ఎక్కువగా వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

* లివర్‌ వ్యాధి ప్రారంభ లక్షణాల్లో అరికాళ్లలో నొప్పి కూడా ఒకటని పుణులు చెబుతున్నారు. కాలేయం సరిగా పనిచేయని సమయంలో కాళ్లలో ద్రవాలు పేరుకు పోవడం ప్రారంభమవుతాయి. దీంతో అరికాళ్లు ఉబ్బడంతో పాటు నొప్పి కూడా మొదలవుతుంది. కాబట్టి ఈ లక్షణం కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత చికిత్స చేయించుకోవాలి.

* ఇక లివర్‌ వ్యాధికి అత్యంత సాధారణ కారణాల్లో హెపటైటిస్‌ కూడా ఒకటి. డయాబెటిక్ పేషెంట్‌కు కాలేయంలో ఎలాంటి సమస్య వచ్చినా పాదాలలో జలదరింపు, తిమ్మిరి మొదలవుతుంది. డయాబెటిక్ రోగులలో ఈ సమస్య తరచుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

BREAKING: పవన్ కల్యాణ్‌కు ఈసీ నోటీసులు.. వివరణ ఇవ్వాలని 48 గంటల డెడ్ లైన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు.

ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని పవన్‌ను ఈసీ ఆదేశించింది. కాగా, పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

Health

సినిమా