Friday, September 20, 2024

ఆ పదిపైసలు బిళ్ళ ఖరీదు..10 కోట్లు..స్పెషల్ ఏమిటంటే…!!!!

మీరు చదివింది నిజమే, కేవలం ఒకే ఒక్క పదిపైసలు బిళ్ళ కోట్ల రూపాయలు పలికింది. పదిపైసలు బిళ్ళ కోట్లు పలకడం ఏమిటి అంటూ ఇంట్లో ఎక్కడో ఉన్న పాత పదిపైసలు బిళ్ళలు వెతికే పని మాత్రం పెట్టుకోకండి. ఆ పదిపైసలు బిళ్లలో ఒక స్పెషాలిటీ ఉంది ఏమిటా స్పెషాలిటీ అంటే. అమెరికాలోని షికాగో లో ఓ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంపాటలో ఎన్నో పురాతన వస్తువులు అందుబాటులో ఉంచారు నిర్వాహకులు.

అక్కడ ఉన్న వస్తువులు అన్నిటిలో అందరూ కేవలం ఒక పదిపైసలు బిళ్ళని దక్కించుకోవాలని ఆరాట పడుతున్నారు. ఎవరికీ వారు పోటీ పడుతున్న సమయంలో ఎక్కడి నుంచీ వచ్చాడో కానీ ఒక పెద్దాయన అందరికన్నా ఎక్కువ మొత్తంలో పాడి ఆ పదిపైసలు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆ పెద్దాయన ఎంత మొత్తం పాట పాడాడో తెలుసా. అక్షరాలా 10 కోట్లు..ఆ వస్తువు ఖరీదు ఎందుకు అంత రేటు పలికిందంటే.

ఆ బిళ్ళ సుమారు 1894 లో ముద్రించారట అంతేకాదు అలాంటి బిళ్ళలు కేవలం 24 మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయని, ఈ నాణేలని డైమ్ అంటారని తెలిపారు నిర్వాహకులు. వీటి వులువ అప్పట్లో చాలా అధికంగా ఉండేదట కేవలం ధవంతుల ఇళ్ళలో మాత్రమే ఈ నాణాలు ఉండేవని అందుకే దీని ధర కోట్లు పలికిందని అంటున్నారు చరిత్ర కారులు.

అవినాష్ రెడ్డికి బెయిలు రద్దైతే..?

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా చిన్నాన్న అయిన వైఎస్ వివేకా హత్య కేసు రానున్న ఏపీ ఎన్నికలలో ప్రధాన అజెండాలలో ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రం వివేకా హత్య కేసు ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రంగంలో ఉన్నారు. దీంతో కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం మొత్తం వైఎస్ వివేకా హత్య కేసు చుట్టూనే సాగుతున్నది. వైఎస్ షర్మిలకు మద్దతుగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా ప్రత్యక్ష ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ తన తండ్రి హంతకుడు అవినాష్ రెడ్డే అంటూ నేరుగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు.

దీంతో అనివార్యంగా వైసీపీ కూడా వివేకా హత్యపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడింది. వైఎస్ అవినాష్ రెడ్డి కానీ, ఇతర నేతలు కానీ ఇస్తున్న వివరణలు ఏ మాత్రం హేతుబద్ధంగా ఉండటం లేదు. ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా మేనమామ అయిన రవీద్రనాథ్ రెడ్డి బహిరంగంగానే వేదికపై అవినాష్ ను పక్కన పెట్టుకునే చెప్పిన విషయాలు వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయాన్ని బట్టబయలు చేశాయి. సాక్ష్యాల నాశనం జరుగుతుంటే పాపం అవినాష్ ఏం చేయాలో తెలియక చూస్తూ నిలబడిపోయారంటూ రవీంధ్రనాథ్ రెడ్డి చేసిన సమర్థింపు వివేకాహత్య కేసులో అవినాష్ ప్రమేయం ఉందన్న నిర్ణారణకు అందరూ వచ్చేలా చేసింది.

ఇదంతా ఒకెత్తయితే సీబీఐ వివేకా హత్య కేసులో సాక్షుల భద్రతపై వ్యక్తం చేసిన ఆందోళన అవినాష్ బెయిలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంగతిని తేటతెల్లం చేసింది. నిజంగానే అవినాష్ బెయిలును కోర్టు రద్దు చేస్తే.. వైసీపీ పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అవినాష్ బెయిలు రద్దై ఆయన జైలుకు వెడితే.. ఇక కడప జిల్లాలో విజయంపై వైసీపీ ఆశలు వదిలేసుకోవలసిందేనన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. అన్నిటికీ మించి అవినాష్ బెయిలు రద్దై జైలుకు వెడితే కడప లోక్ సభ బరిలో అవినాష్ స్థానంలో మరో అభ్యర్థిని వైసీపీ నిలబెట్టాల్సి ఉంటుంది. అదే జరిగితే వైసీపీకి జిల్లా వ్యాప్తంగా తేరుకోలేని నష్టం వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదన్న విషయాన్ని సర్వేలన్నీ చెబుతున్నాయి. అయితే రాయలసీమలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రం ఇప్పటికీ మొగ్గు వైసీపీ వైపు ఉంది. సర్వేలు సైతం అదే చెబుతున్నాయి. కానీ షర్మిల కడప లోక్ సభ బరిలో దిగడం, వైఎస్ వివేకాహత్య వెనుక ఉన్నది అవినాష్ రెడ్డే అని బహిరంగంగా విమర్శలు చేయడమే కాకుండా, వైఎస్ బిడ్డ వైపు ఉంటారా, వివేకా హంతకుడి వైపు ఉంటారా? అంటూ ఆమె ప్రజలకు సంధిస్తున్న ప్రశ్నాస్త్రం కడప లోక్ సభ నియోజకవర్గంలో పరిస్థితులను మార్చేసే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అవినాష్ బెయిలు రద్దు అయ్యి అరెస్టయితే మాత్రం వైసీపీ కడపపై ఆశలు వదిలేసుకోవలసిందేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మ‌న దేశంలో ఉన్న టాప్ 5 డేంజ‌ర‌స్ రోడ్లు ఇవే..!

ప‌ర్వ‌తసానువుల్లో ఉండే రోడ్లంటే అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఆద‌మరిచి డ్రైవ్ చేస్తే వాహ‌నం లోయ‌లోకి ప‌డిపోతుంది. క‌నుక అలాంటి రోడ్ల‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఎటు చూసినా ప‌చ్చ‌ని ప్ర‌కృతి.. ర‌మ‌ణీయ‌మైన వాతావ‌ర‌ణం.. మేఘాల్లో క‌లుస్తున్నాయా అన్న‌ట్లుగా ఉండే ఎత్తైన ప‌ర్వతాలు.. వాటిపై పాములాంటి మెలిక‌ల‌తో ఉండే రోడ్లు.. అలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో కారులో జామ్ అని వెళ్తుంటే వ‌చ్చే మ‌జాయే వేరు. అయితే అలాంటి మెలిక‌లు తిరిగిన రోడ్ల‌లో మ‌న‌కు ఎంత ఆహ్లాదం ల‌భిస్తుందో.. అంత‌క‌న్నా డేంజ‌ర్ ఆ రోడ్ల‌లో పొంచి ఉంటుంది. అవును మ‌రి. ప‌ర్వ‌తసానువుల్లో ఉండే రోడ్లంటే అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఆద‌మరిచి డ్రైవ్ చేస్తే వాహ‌నం లోయ‌లోకి ప‌డిపోతుంది. క‌నుక అలాంటి రోడ్ల‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అయితే అలాంటి రోడ్లు ఎక్క‌డున్నాయి ? అనేగా మీ డౌట్‌..! ఏమీ లేదండీ.. మీరు అంత‌గా డౌట్ ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే అలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపులు ఉన్న రోడ్లు మ‌న దేశంలోనే ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

1. జొజి లా

లెహ్ నుంచి శ్రీ‌న‌గ‌ర్ వెళ్లే దారిలో ఈ రోడ్డు ఉంటుంది. ఇది స‌ముద్ర మ‌ట్టానికి సుమారుగా 11వేల అడుగుల ఎత్తులో ప‌ర్వ‌తాల‌పై ఉంటుంది. ఈ రోడ్డులో ప్ర‌యాణించేట‌ప్పుడు చ‌క్క‌ని ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌మైన దృశ్యాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. కానీ ఈ రోడ్డు మాత్రం ప్ర‌యాణించేందుకు చాలా డేంజ‌ర్‌గా ఉంటుంది. మీరు సాహ‌సికులు అయితే ఈ రోడ్డులో వెళ్ల‌వ‌చ్చు. కానీ ప్ర‌యాణంలో కింద‌కు మాత్రం చూడ‌కండి. క‌ళ్లు తిరుగుతాయి. ఇక ఈ రోడ్డులో ప్ర‌యాణించేట‌ప్పుడు అప్పుడ‌ప్పుడు మ‌న‌కు అనేక ప్ర‌కృతి విప‌త్తులు కూడా ఎదుర‌వుతుంటాయి. బుర‌ద‌గా ఉండే రోడ్లు, మంచు తుపాన్లు, కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డ‌డం, బ‌ల‌మైన గాలులు మ‌న‌ల్ని ప‌ల‌కరిస్తాయి. వీటిని త‌ట్టుకుని వెళ్ల‌గ‌లం అనుకుంటేనే ఈ రోడ్డులో ప్ర‌యాణించాలి.

2. కిన్నౌర్ రోడ్డు

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు నైరుతి దిశ‌లో ఈ రోడ్డు ఉంటుంది. ఇక్క‌డి ప‌ర్వ‌తాల‌పై ఉండే రాళ్ల‌ను తొలిచి రోడ్డును వేశారు. అందువ‌ల్ల మ‌లుపులు మ‌రీ ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే రోడ్డు మార్గంలో కొన్ని చోట్ల షార్ప్, బ్లైండ్ ట‌ర్న్‌లు ఉంటాయి. వాటి వద్ద ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయి. ఇక సాహ‌సం చేసేవారికి ఈ రోడ్డు స‌వాల్ విసురుతుంది. ఎక్స్‌పీరియెన్స్ ఉన్న డ్రైవ‌ర్లే ఈ రోడ్డులో వాహ‌నాన్ని న‌డ‌పాలంటే జంకుతారు. క‌నుక ధైర్యంగా ఉంటేనే ఈ రోడ్డులో వాహ‌నం న‌డ‌పాలి.

3. ఖార్దుంగ్ లా

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన ప్ర‌దేశాల‌లో ఉన్న రోడ్డుల‌లో ఈ రోడ్డు కూడా ఒక‌టి. దీన్ని ఇండియ‌న్ ఆర్మీ వారు నిర్మించారు. అందుకు వారు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ రోడ్డు ఉండే ప‌ర్వ‌త శ్రేణులు స‌ముద్ర మ‌ట్టానికి సుమారుగా 18,380 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇక అంత ఎత్తులో చ‌లి బాగా ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే ఆక్సిజ‌న్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటాయి. దీంతో ఈ రోడ్డులో ప్ర‌యాణించే వారు వాహ‌నాల్లో ఆక్సిజ‌న్ మాస్కుల‌ను పెట్టుకుంటారు.

4. లెహ్‌-మ‌నాలి హైవే

ఈ రోడ్డు దాదాపుగా 479 కిలోమీట‌ర్ల పొడ‌వు ఉంటుంది. ఈ రోడ్డులో ప్ర‌యాణించేట‌ప్పుడు కూడా మ‌న‌కు చ‌క్క‌ని ప్ర‌కృతి అందాలు క‌నిపిస్తాయి. కానీ అదే స్థాయిలో డేంజ‌ర్లు కూడా ఉంటాయి. మెలిక‌లు తిరుగుతూ రోడ్డుపై వెళ్తుంటే ఎంత‌టి అనుభ‌వం ఉన్న డ్రైవ‌ర్‌కైనా భ‌యం వేస్తుంది.

5. రోహ్‌తంగ్ పాస్

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణుల్లో సముద్ర మ‌ట్టానికి దాదాపుగా 3978 మీట‌ర్ల ఎత్తులో ఈ రోడ్డు ఉంటుంది. ఇది ఇండియాలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన రోడ్డుగా పేరుగాంచింది. ఈ రోడ్డుపై ప్ర‌యాణించాలంటే వాహ‌న‌దారుల‌కు గ‌ట్స్ ఉండాలి. ఎందుకంటే ఈ రోడ్డుపై ఉండే మ‌లుపుల్లో ప్ర‌యాణించ‌డం అంత సుల‌భం కాదు. ఎదురుగా వ‌చ్చే వాహ‌నాల‌ను త‌ప్పించుకుంటూ చాక‌చ‌క్యంగా వాహ‌నం న‌డపాలి. అదుపు త‌ప్పినా, చిన్న త‌ప్పు చేసినా వాహ‌నం లోయ‌లోకి ప‌డిపోతుంది. ఇక ఈ రోడ్డు ఉన్న ప‌ర్వ‌త శ్రేణుల పైభాగం నుంచి త‌ర‌చూ కొండ చ‌రియ‌లు కింద ప‌డుతుంటాయి. దీంతో అనేక ప్ర‌మాదాలు కూడా జ‌రుగుతుంటాయి. సాహ‌సం చేయాల‌నుకునే వారికి ఈ రోడ్డు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది.

క్రికెట్‌లో 0 (సున్నా) ప‌రుగులు చేస్తే డ‌క‌వుట్ అంటారు.. దానికి ఆ పేరు ఎలా వ‌చ్చిందంటే..?

క్రికెట్‌లో ఎవ‌రైనా ప్లేయ‌ర్ సున్నా ప‌రుగుల‌కే ఔట్ అయితే మొద‌ట్లో డ‌క్స్ ఎగ్ అవుట్ అని అన‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే వాడుక‌లో ఆ ప‌దం డ‌క్ అవుట్ అయింది.
సాధార‌ణంగా మ‌నం క్రికెట్‌లో ఎవ‌రైనా ప్లేయ‌ర్ 0 (సున్నా) ప‌రుగుల‌కే ఔటైతే డ‌క్ అవుట్ అయ్యాడు.. అని అంటుంటాం క‌దా.. క్రికెట్ భాష‌లో ఈ ప‌దం వాడ‌డం చాలా కామ‌న్‌. కామెంటేట‌ర్లు కూడా ఎవ‌రైనా ప్లేయ‌ర్ సున్నా ప‌రుగుల‌కే ఔటైతే ఆ ప్లేయ‌ర్‌ను డ‌కౌట్ అయ్యాడు అని అంటుంటారు. అయితే డ‌క్ అంటే ఇంగ్లిష్‌లో బాతు అని అర్థం వ‌స్తుంది క‌దా. మ‌రి ఆ ప‌దం క్రికెట్‌లోకి ఎలా వ‌చ్చింది ? అస‌లు సున్నా ప‌రుగుల‌కే ఔట్ అయితే డ‌క్ అవుట్ అని ఎందుకంటారు ? అస‌లు ఇలా అన‌డం ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మైంది ? ఇవే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రికెట్‌లో ఎవ‌రైనా ప్లేయ‌ర్ సున్నా ప‌రుగుల‌కే ఔట్ అయితే మొద‌ట్లో డ‌క్స్ ఎగ్ అవుట్ అని అన‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే వాడుక‌లో ఆ ప‌దం డ‌క్ అవుట్ అయింది. ఇక డ‌క్స్ ఎగ్ అవుట్ అనే ఎందుకు అన‌డం మొద‌లు పెట్టారంటే.. డ‌క్ అంటే బాతు గుడ్డు 0 (సున్నా) ఆకారంలో ఉంటుంది క‌దా. అందుకే 0 ప‌రుగులు చేస్తే బాతు గుడ్డును పోలి ఆ అంకె ఉంటుంది క‌నుక బాతు గుడ్డుతో పోలుస్తూ డ‌క్స్ ఎగ్ అవుట్ అని అన‌డం మొద‌లు పెట్టారు. అయితే ఈ ప‌దాన్ని మొద‌ట 1886లో వాడారు. అప్ప‌ట్లో వేల్స్ యువ‌రాజు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ.. సున్నా ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. దీంతో ఓ ప‌త్రిక అత‌ని స్కోర్‌ను బాతు గుడ్డు (0 – సున్నా)తో పోలుస్తూ ఓ క‌థ‌నాన్ని రాసింది. అందులో సున్నా స్కోర్‌ను డ‌క్స్ ఎగ్ అవుట్ అని రాశారు. అంతే.. అప్ప‌టి నుంచి ఆ ప‌దం ఫిక్సైంది. దీంతో ఎవ‌రు సున్నా ప‌రుగులు చేసినా డ‌క్ అవుట్ అయ్యాడు.. అని అన‌డం మొద‌లు పెట్టారు.

అయితే క్రికెట్‌లో ఎవ‌రైనా ప్లేయ‌ర్ తాను ఆడిన మొద‌టి బంతికే ప‌రుగులేమీ చేయ‌కుండా ఔట్ అయితే దాన్ని గోల్డెన్ డ‌క్ అని అంటారు. అలాగే ప‌రుగులు ఏమీ చేయ‌కుండానే రెండు, మూడు బంతుల్లో ఔట్ అయితే వాటిని సిల్వ‌ర్‌, బ్రాంజ్ డ‌క్స్ అని వ్య‌వ‌హ‌రిస్తారు. ఇక మ్యాచ్‌లో బాల్స్‌ను ఆడ‌కుండా, ప‌రుగులు ఏమీ చేయ‌కుండా ర‌న‌వుట్ అయితే దాన్ని డైమండ్ డ‌క్ అంటారు. ఇక ఒక ప్లేయ‌ర్ తాను మ్యాచ్‌లో ఆడే మొద‌టి బాల్‌కు లేదా ఆ సీజ‌న్‌లో ప్లేయ‌ర్ టీం ఆడే మొద‌టి మ్యాచ్ మొద‌టి బాల్‌కు ప‌రుగులు ఏమీ చేయ‌కుండా అవుట్ అయితే దాన్ని ప‌ల్లాడియం డ‌క్ అని పిలుస్తారు. ఇదీ.. క్రికెట్‌లో డ‌క‌వుట్‌కు ఉన్న స్టోరీ.. ఆస‌క్తిగా ఉంది క‌దూ..!

కడపలో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్.!

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైఎస్ షర్మిల పుట్టలేదంటూ, వైఎస్ విజయమ్మ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.! ఇదీ ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల ఆవేదన.! వైఎస్ షర్మిల, వైఎస్ సునీత.. ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కడప లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆమె వైఎస్ జగన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు. కానీ, ఆమెకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు వైఎస్ జగన్. వైఎస్ విజయమ్మ విషయంలోనూ వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేసింది. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా గతంలో పని చేసిన విజయమ్మని, ఆ పదవిలోంచి పీకి పారేశారు వైఎస్ జగన్. తనంతట తానుగా విజయమ్మ, వైసీపీకి దూరమయ్యేలా చేశారు వైఎస్ జగన్. వైసీపీకి తొలి ఎమ్మెల్యే విజయమ్మ. ఆ విషయాన్ని వైఎస్ జగన్ మర్చిపోతే ఎలా.? వైసీపీకి ఒకప్పుడు స్టార్ క్యాంపెయినర్ వైఎస్ షర్మిల.! కానీ, వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యుల మీద కనీసపాటి విశ్వాసం చూపలేదు. తల్లి, చెల్లి విషయంలోనే ఇలా వ్యవహరించిన వైఎస్ జగన్, తన బాబాయ్ వివేకానంద రెడ్డి విషయంలో ఇంకెలా వ్యవహరించేవారో.? అని పులివెందుల నియోజకవర్గంలోనూ, కడప లోక్ సభ నియోజకవర్గంలోనూ జనం చర్చించుకుంటున్నారు. వీటికి తోడు, వైఎస్ షర్మిలను అలాగే వైఎస్ సునీతా రెడ్డినీ పెయిడ్ ఆర్టిస్టులుగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించడం, సజ్జల కుమారుడు భార్గవ్ కనుసన్నల్లో వైసీపీ సోషల్ మీడియా, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో షర్మిల, సునీతా రెడ్డి మీద ట్రోలింగ్ చేస్తుండడం.. ఇవన్నీ కడపలో పొలిటికల్ ఈక్వేషన్స్‌ని మార్చేస్తున్నాయి. ఇంట్లోని ఆడవాళ్ళ మీదనే ఇంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తోంటే, చూస్తూ ఊరుకుంటున్న వైఎస్ జగన్, రాష్ట్రంలోని మహిళలకు ఏం భరోసా ఇవ్వగలరనే చర్చ తెరపైకొస్తోంది. రాజకీయాలన్నాక విమర్శలు సహజమే కావొచ్చు.. క్యారెక్టర్ మీద మచ్చ వేయాలని చూడటం.. అదీ కుటుంబంలోని మహిళల మీద.. అత్యంత జుగుప్సాకరం.! అందుకే, వైసీపీకి కంచుకోట అయిన ఉమ్మడి కడప జిల్లాలో, వైసీపీ అంటేనే మహిళా ఓటర్లు అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తోంది.!

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ లో (ఎలక్ట్రికల్ సర్వీస్ ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ లో (ఎలక్ట్రికల్ సర్వీస్ ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్
పోస్టుల ఖాళీలు :
03
అర్హతలు :

వయస్సు :
అభ్యర్థులు 18-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు. SC/ST/BC వాళ్ళకు వయో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం :
21.03.2024
అప్లికేషన్ చివరి తేదీ:
10.04.2024

NOTIFICATION Download Download

WhatsApp New: మీరు స్టేటస్ పెడితె చాలు ఇక అందరికి తెలిసిపోతుంది.!

WhatsApp New: వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది వాట్సాప్. రీసెంట్ గా కూడా ఈ జనం మెచ్చిన మెసేజింగ్ యాప్ మరొక కొత్త ఫీచర్ ను అందించింది. అయితే, కొత్తగా తీసుకు వచ్చిన ఈ ఫీచర్ ని మరింత మెరుగు చేసే మరొక కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది, అని అంచనా వేస్తున్నారు.

ఏమిటా WhatsApp New ఫీచర్?
ఇటీవల వాట్సప్ స్టేటస్ టైం ను 30 సెకన్ల నుండి 1 నిముషం నిడివికి పెంచిన వాట్సాప్ దీన్ని మెరుగుపరుస్తూ మరొక పిచర్ ని జత చేయబోతోందని చెబుతున్నారు. ఇప్పటి వరకు కూడా వాట్సాప్ స్టేటస్ పెడితే మీ కాంటాక్ట్స్ లేదా నచ్చిన వారు వాళ్లకి నచ్చినపుడు చూసేవారు. కానీ, ఇకనుండి వాట్సాప్ కొత్తగా తీసుకు వచ్చిన ఫీచర్ ద్వారా స్టేటస్ పెడితే వెంటనే అందరికీ తెలియచేస్తుంది.

దీనికోసం, వాట్సాప్ స్టేటస్ నోటిఫికేషన్ ఫీచర్ ను వాట్సాప్ పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్ కమింగ్ ఫీచర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ పెట్టిన వెంటనే ఎవరినైతే మీ స్టేటస్ చూడటానికి అనుమతిస్తారో, వారికి నోటిఫికేషన్ అందుతుంది. అంటే, మీ కంటాక్స్ లో ఉన్నవారికి మీ వాట్సాప్ స్టేటస్ ను నోటిఫికేషన్ రూపంలో వాట్సాప్ అందిస్తుంది.

అయితే, ఈ ఫీచర్ ను గిరినుంచి కొత్త నివేదికలు వస్తున్నా, వాట్సాప్ మాత్రం ఈ ఫీచర్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెల్లడించ లేదు. కానీ, ఈ ఫీచర్ ఒకవేళ అంధుబాటులోకి వస్తే, యూజర్లకు వారి స్టేటస్ ను అందిరికి తెలియ చేసే అవకాశం లభిస్తుంది.

అయితే, కంటాక్స్ లో చాలా మంది యాడ్ అయ్యి ఉంటారు కాబట్టి, అందరి నోటిఫికేషన్ ను అందుకుంటే ఉంటే, యూజర్ అనుభూతి కొంత దెబ్బతినే అవకాశం ఉండవచ్చు. కానీ, రోజూ కొత్త స్టేటస్ లతో తమను తాము కొత్త చూపాలి అని చేసే వారికి మాత్రం ఇది పండగ లాంటి ఫీచర్ అవుతుంది.

AP SSC Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాలు నేడే April 22..!

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (AP SSC Results 2024) విడుదలయ్యాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తంగా 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

AP SSC Results 2024 @bse.ap.gov.in; Check AP 10th Class Results 20

SSC Board Official  Website https://bse.ap.gov.in/

Eenadu ఈనాడు Website link 1 

Eenadu ఈనాడు Website link 2   

Sakshi (సాక్షి ) Website  link  1

Sakshi (సాక్షి ) Website  link  2

Manabadi (మన బడి ) Web link 

 

AP SSC Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఈ నెల 22న విడుదల


 

AP SSC Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్. ఈ నెల 22వ తేదీన టెన్త్ రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది.

AP SSC Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాల(AP SSC Results 2024) తేదీ, సమయాన్ని విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22 ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎల్లుండి(సోమవారం) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషన్ ఎస్.సురేష్ కుమార్ టెన్త్ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను https://bse.ap.gov.in/  వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP SSC Results 2024) విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ నెల 22 ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు (AP 10th Exams)జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 6.30 లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల అనంతరం మూల్యాంకనం చేపట్టిన విద్యాశాఖ అధికారులు.. ఏప్రిల్ 8 నాటికి ప్రక్రియ పూర్తి చేశారు. విద్యార్థులు నేరుగా ఎస్.ఎస్.సి బోర్డులో ఫలితాలు చెక్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది మే 6న పదో తరగతి ఫలితాలు విడుదల చేయగా… ఈసారి ఎన్నికల కారణంగా చాలా తొందరగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు.

జవాబు పత్రాలను మరోసారి పరిశీలించి, మార్కులు కంప్యూటీకరణ చేసే ప్రక్రియ అధికారులు పూర్తిచేశారు. పదో తరగతి ఫలితాల విడుదలకు ఈసీ అనుమతిని ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 22న ఫలితాలు(AP 10th Results Date) విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవందర్ రెడ్డి ప్రకటించారు.

How To Download AP 10th Results 2024 : ఏపీ పదో ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు?
విద్యార్థులు ఎస్.ఎస్.సి బోర్డు అధికారిక వెబ్Website https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లాలి.

హోమ్ పేజీలో కనిపించే “AP SSC Results 2024” లింక్‌పై క్లిక్ చేయాలి.
విద్యార్థి హాల్ టికెట్ నంబర్ ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
విద్యార్థి ఫలితాలు, మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ ను పొందవచ్చు.

Andhra Pradesh: ‘మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా ’

Andhra Pradesh: ఇటీవల కాలంలో విద్యార్థులు పరీక్షల్లో రాసే చిలిపి సమాధానాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగానే విద్యార్థులు పరీక్షలంటేనే కాస్త భయాందోళనలకు గురవుతారు. కొందరు ఎగ్జామ్స్‌కు ముందు ప్రణాళికతో ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతారు. మరికొందరు ఏదో వెళ్లి పరీక్ష రాసివచ్చాం అన్నట్లుగా ఉంటారు. సాధారణంగా పరీక్షల్లో ప్రశ్నాపత్రంలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తుంటారు. చాలా మంది ఏదో తెలియకపోయినా సినిమా స్టోరీయో.. పాటలు.. కథలు.. లేకపోతే ఉపాధ్యాయుడిని కాకపట్టేందుకు ఏవో ఇబ్బందులను చెబుతూ జవాబులు రాసింది చూసే ఉంటాం అయితే, తాజాగా పరీక్షకు హాజరైన విద్యార్థి ఓ ప్రశ్నకు రాసిన సమాధానం చూసి ఖంగుతిన్నాడు.

బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ విద్యార్థి రాసిన జవాబును చూసి కంగుతిన్నారు. తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి వింత సమాధానం రాశాడు. ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని ఉండటం చూసి..టీచర్ అవాక్కయ్యారు. వెంటనే జవాబు పత్రాన్ని ఉన్నతాధికారులకు చూపించారు. అయితే, ఆ విద్యార్థికి 70 మార్కులు రావడం విశేషం. మరో ఆన్సర్ షీట్‌లో రామాయణంలో పాత్ర స్వభావం గురించిన ప్రశ్నకు.. ‘మంధర.. శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాయడంతో.. ఉపాధ్యాయులు కంగుతిన్నారు.

ఫుడ్ కోసం లైన్ లో నిలుచున్న బిల్ గేట్స్.. వైరల్ పిక్

బిల్ గేట్స్… పరిచయం అవసరం లేని వ్యక్తి. మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి తెలుసు కదా. అపర కుబేరుడు… ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఆయన ఒకరు. ఆయన చిటికేస్తే.. ఏదంటే అది ముందుకొచ్చి వాలుతుంది. కానీ.. ఆయన చాలా సాధారణంగా ఉంటారు. అదే ఆయన్ను వినూత్నంగా ఉండేలా చేస్తుంది. తాజాగా ఆయన చేసిన మరో పని కూడా ఆయన సింప్లిసిటీకి నిదర్శనం.

ఇటీవల షియాటిల్ లో ఉన్న ఓ రెస్టారెంట్ కు వెళ్లిన బిల్ గేట్స్.. బర్గర్, ఫ్రైస్, కోక్ బాటిల్ కొనుక్కోవడం కోసం లైన్ లో నిలబడ్డాడు. రెస్టారెంట్ ముందు క్యూ ఉండటంతో… లైన్ లో నిలబడి ఆయనకు కావాల్సిన ఫుడ్ ను తీసుకొని వెళ్లారు. బిల్ గేట్స్ అక్కడికి వచ్చి క్యూలో నిలబడటం చూసిన రెస్టారెంట్ సిబ్బంది, కస్టమర్లు నోరెళ్లబెట్టారు. కోట్ల ఆస్తి ఉన్నా.. ఎంత సాధారణ వ్యక్తిలా వచ్చి క్యూలో నిలబడ్డాడు.. అంటూ ప్రశంసించారు. ఆ ఫోటో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా బిల్ గేట్స్ ను తెగ మెచ్చుకుంటున్నారు.

సైకిల్ ను ఢీకొని డ్యామేజ‌యిన కారు.. వీడియో

సైకిల్ ను ఢీకొంటే కారుకు డ్యామేజ‌వ‌డ‌మేంట‌ని మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు. లేదంటే ఆ ఫోటో ఫేక్ కావ‌చ్చు అని కూడా మీరు అనుకోవ‌చ్చు. కానీ.. ఆ ఫోటో ఫేక్ కాదు. సైకిల్ ను కారు ఢీకొన్న‌ది నిజం. కారు దెబ్బ‌తిన్న‌ది నిజం. చైనాలోని షెన్‌జెన్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. సైకిల్ ను కారు ఢీకొనడంతో కారు ముందు భాగంలోని బంప‌ర్ పూర్తిగా నుజ్జునుజ్జ‌యింది. సైకిల్‌కు మాత్రం ఏం కాలేదు. కాక‌పోతే.. సైకిల్ మీద ఉన్న వ్య‌క్తికి గాయాల‌య్యాయి. ఇక‌.. ఈ ఫోటోను పోలీసులు సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేయ‌డంతో నెటిజ‌న్లు ఆ ఫోటోపై ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు.

విరాట్ కోహ్లీ తాగే నీళ్ల ధర ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు..!

విరాట్ కోహ్లీ గురించి.. ఆయన క్రికెట్ లో సాధించిన విజయాల గురించి ఎవరికి తెలియదు. కానీ.. విరాట్ కోహ్లీ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. గతంలోనే ఈ విషయం బయటికి వచ్చినా.. ఇప్పుడు అది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో నెటిజన్లు దానిపై ప్రత్యేకంగా చర్చపెట్టారు. ఇంతకీ ఏంటా విషయం.. అంటారా? పదండి అక్కడికే వెళ్దాం.

ఇవియన్ వాటర్… అర్థం కాలేదా? విరాట్ కోహ్లీ తాగే నీళ్లు అవి. అయితే ఏంటటా? అంటారా.. అక్కడే ఉంది ట్విస్ట్. సాధారణంగా వాటర్ బాటిల్ ఖరీదు ఎంతుంటుంది.. మా.. అంటే 20 రూపాయలు వేసుకోండి అంటారు. కానీ.. విరాట్ కోహ్లీ తాగే ఇవియన్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా? లీటరుకు 600 రూపాయలు. చెప్పా కదా మీరు ఖరీదు పేరు చెప్పగానే మీరు నోరెళ్లబెడతారని. వామ్మో.. నీళ్లను కూడా ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? ఇంతకీ ఆ నీళ్లలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటారా? ఇవియన్ వాటర్ కూ పేద్ద స్టోరీ ఉందండోయ్. పదండి… ఓసారి ఆ నీళ్ల సంగతేందో తెలుసుకుందాం.


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీళ్లు అట ఇవి. అంతే కాదు.. ఇవియన్ అనే కంపెనీ కూడా మామూలుదేమీ కాదు. అదో పెద్ద బ్రాండ్. అవి చాలా సహజసిద్ధమైన నీళ్లు. స్విట్జర్లాండ్ – ఫ్రాన్స్ మధ్యలో ఉన్న జెనీవా సరస్సు నుంచి నీళ్లను సేకరించి ఈ నీటిని తయారు చేస్తారు. ఈ నీళ్లను ఇదివరకు ఔషధాల తయారీలో ఉపయోగించేవారట. ఎందుకంటే.. ఆ ప్రాంతంలోని నేలలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయట. అవి ఆ నీళ్లలో కలిసి ఆ నీళ్లు కూడా నాచురల్ గానే ఖనిజ లవణాలను కలిగి ఉంటాయన్నమాట.

ఈ నీటిని హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పోటీ పడి మరీ తాగుతారట. ఇండియాలో మాత్రం ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే తాగుతాడు ఈ నీళ్లను. విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ రహస్యం కూడా ఈ నీళ్లదే కావచ్చు. ఒక లీటర్ ఇవియన్ నీళ్లలో 8 మిల్లీగ్రాముల కాల్షియం, 26 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 6.8 మిలీగ్రాముల క్లోరైడ్, 1 మిల్లీగ్రామ్ పొటాషియం, 6,5 గ్రాముల సోడియం ఉంటాయి.

Rains: చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు..!

ఈఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల నుంచే భానుడు తన ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. మాడు పగిలే ఎండలతో జనాలు విలవిల్లాడుతున్నారు. మార్చి నెల నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇక ఏప్రిల్ మాసం సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మండే ఎండలకు తోడు.. వడగాలులు వీస్తుండటంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఏసీ, ఫ్రిజ్జులు కూడా వేసవి తాపాన్ని తీర్చలేకపోతున్నాయి. మరో రెండు నెలల పాటు ఎండలను ఎలా భరించాలా అని జనాలు భయపడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి అని వెల్లడించింది. ఆ వివరాలు..

ఎండ వేడిమి, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. వేసవిలో ఈ అకాల వర్షాలు ఎందుకు అంటే.. ఉత్తర కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు… ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది.

ఇక తెలంగాణలో కూడా ఉపరితల ద్రోణి ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. మిగతా జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మరీ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలో ఇవాళ జోగులాంబ జిల్లా వడ్డేపల్లిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది.

ఉపరిత ద్రోణి ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 40 డిగ్రీలకుపైన నమోదైన ఉష్ణోగ్రతలు ఈ రెండు రోజుల్లో 35-40 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.

ఎన్నికల్లో వేసే సిరా గుర్తు ఎందుకు చెరిగిపోదో తెలుసా?

సాధారణంగా ఓటు వేసేవాళ్లకు ఈ సిరా గుర్తు గురించి తెలిసే ఉంటుంది. ఓటు వేశాక సిరా గుర్తును ఎడమ చేయి చూపుడు వేలుపై వేస్తారు. దీంతో ఆ వ్యక్తి ఓటు వేసినట్టు లెక్క. ఎన్నికల్లో రిగ్గింగ్, డబుల్ ఓట్లు లాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకే ఈ సిరా చుక్కను ఓటు వేసిన వ్యక్తుల వేలికి వేస్తారు. అయితే.. ఆ సిరా చుక్క కనీసం మూడు నుంచి నాలుగు రోజుల దాకా ఉంటుంది. అప్పటి వరకు అది ఎంత చెరిపినా చెరగదు. మరి.. ఆ సిరా గుర్తు ఎందుకు చెరగదో తెలుసా?

సిరా గుర్తు మూడు నుంచి నాలుగు రోజుల దాకా ఉండేందుకు దాంట్లో ఎక్కువ శాతం సిల్వర్ నైట్రేట్ ను కలుపుతారు. దాదాపు 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉంటుందట ఇందులో. అందుకే అది వెంటనే చెరిగిపోదు. అది దాని చరిత్ర అన్నమాట.

viral 9 నిమిషాల్లోనే 646 కోట్లు పలికిన పెయింటింగ్…!

9 అంటే 9 నిమిషాల్లోనే ఆ పెయింటింగ్ వేలంలో సుమారు 646 కోట్ల రూపాయల ధర పలికింది. నమ్మశక్యంగా లేదు కదా. ఓసారి గిల్లుకొని చూడండి. నొప్పి పుట్టిందా? అయితే ఇది నిజమే. డేవిడ్ హాక్నీ తెలుసు కదా. చాలా ఫేమస్ ఆర్టిస్ట్. బ్రిటన్ కు చెందిన వ్యక్తి. ఆయన వేసిన పెయింటింగే ఇంత ధర పలికింది. అది కూడా కేవలం వేలం ప్రారంభమయిన 9 నిమిషాల్లోనే. ఆ పెయింటింగ్ మరేదో కాదు.. మీరు పైన చూస్తున్నారు కదా ఫోటో అదే పెయింటింగ్. దాని పేరు పూల్ విత్ టూ ఫిగర్స్. న్యూయార్క్ లోని క్రిస్టీస్ లో దాన్ని వేలం వేశారు. దీంతో వేలంలో దానికి 90 మిలియన్ డాలర్ల ధర పలికింది. అంత ధర పలికి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఆ పెయింటింగ్. ఇదివరకు ఈ రికార్డు యూఎస్ కు చెందిన జెఫ్ కూన్స్ పేరు మీద ఉండేదట. ఆయన వేసిన బెలూన్ డాగ్ పెయింటింగ్ ను అదే క్రిస్టీస్ లో వేలం వేస్తే అది 58.4 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన కరెన్సీలో 419 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

ఏపీ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. పవన్ కల్యాణ్‌పై పోటీ చేయనున్న తమన్నా

ఏపీ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పై ప్రముఖ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు.
గతంలో తమన్నా మంగళగిరి నుంచి పోటీ చేశారు. భారత చైతన్య యువజన పార్టీ నుంచి ఆమె బరిలో ఉండనున్నట్లు ఆ పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ మాట్లాడుతూ.. ఏపీలో ఏ పార్టీ చేయని సాహసాన్ని తమ పార్టీ చేసినట్లు పేర్కొన్నారు.

చట్టసభల్లో ట్రాన్స్ జెండర్స్ కు అవకాశం కల్పించాలని తమన్నా సింహాద్రికి టికెట్ కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఇక, తమన్నా బిగ్ బాస్ షో తో సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో మంగళగిరి నుంచి పోటీ చేసిన సందర్భంగా రాజకీయాలు వ్యాపారం అయ్యాయని.. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన నేతల్లో తగ్గిందని తమన్నా తెలిపారు. జనసేన కోసం సైతం తమన్నా పని చేసినా.. పవన్ కల్యాణ్ ను కనీసం కలిసే చాన్స్ రాలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న తమన్నా ఏకంగా పవన్ పై పోటీకి దిగడం ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది.

మీ యొక్క పేరు, జిల్లా, నియోజకవర్గం వివరాలు ఇచ్చి మీ ఓటు ఎక్కడ ఉంది అనే వివరాలు తెలుసుకోవచ్చు.

Search your voter I’d details using district, constituency name, voter name
కేవలం మీ యొక్క పేరు, జిల్లా, నియోజకవర్గం వివరాలు ఇచ్చి మీ ఓటు ఎక్కడ ఉంది అనే వివరాలు తెలుసుకోవచ్చు. ఈ క్రింది లింకు పైన క్లిక్ చేసి పై వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఆ పేరుతో ఉన్నటువంటి అన్ని పేర్లను చూపించడం జరుగుతుంది. ప్రక్కన ఉన్న ప్రింట్ ఆప్షన్ ద్వారా save చేసుకోవచ్చు.

https://ceoaperolls.ap.gov.in/Name_Search/Search.aspx

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను చూశారా?

చైనా అంటేనే సమ్ థింగ్ స్పెషల్. దేంట్లోనైనా తమ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటారు వాళ్లు. ఏ టెక్నాలజీ కానీ ముందు చైనాలో రావాల్సిందే. అన్నింట్లో ముందుండాలనే తాపత్రయం, ఆసక్తి, పట్టుదలే వాళ్లను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న చైనా.. తాజాగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను నిర్మించి అన్ని రికార్డులను తిరగరాసింది. 24, october 2018 న ఈ వంతెన ప్రారంభం ఈ వంతెన చైనా, హాంకాంగ్, మకావ్ లను కలుపుతుంది. మొత్తం 55 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల రోడ్డు అది. దీని నిర్మాణం 2009లో ప్రారంభం అయింది. ప్రతిరోజు దాదాపు 30 వేల మంది ఈ వంతెనపై ప్రయాణించే అవకాశం ఉందట. ఇంకో 120 ఏళ్ల పాటు ఈ వంతెన పటిష్టంగా ఉంటుందట.

2026… జీరో సంవత్సరమట.. ఎందుకో తెలుసా?

జీరో సంవత్సరమేంది.. 2026 ఏంది.. ఏంటి మ్యాటర్ అసలు అంటారా? 2026 వ సంవత్సరం వరకు ఈ ప్రపంచంలో ఉన్న జంతువులన్నింటిలో ఒక్క మనిషికి తప్ప మిగితా జీవరాశులన్నీ తమ సహజసిద్ధమైన ప్రాంతాలను కోల్పోబోతున్నాయి. అది సంగతి. అంటే వాటి మనుగడ రోజురోజుకూ కష్టమైపోతున్నది. కేవలం ఇంకో ఎనిమిదేళ్లలోనే ఇదంతా జరగనుంది. 2026 లోపు అన్నమాట. అందుకే 2026 ను సైంటిస్టులు జీరో ఇయర్ గా ప్రకటించబోతున్నారు.

బయో డైవర్సిటీకి తీరని దెబ్బ పడుతున్నది. దీనికి కారణం వంద శాతం మనుషులు. అవును.. మనుషులే జీవరాశుల ఆవాసాలపై దెబ్బ కొడుతున్నాడు. వాటిని నాశనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కాలుష్యమే. ఆ కాలుష్యమే వాటి ఆవాసాలను దెబ్బ తీస్తోంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఆవాసాలు 2026 తర్వాత కనిపించవు. కాకపోతే మానవుడు సృష్టించే ఆవాసాలు ఎప్పటికీ ఉంటాయి. అడవులు, ఎడారులు, చెరువులు, వాగులు, వంకలు, గడ్డి భూములు.. ఇలా సహజ సిద్ధంగా ప్రకృతి ఏర్పరుచుకున్న ఏదైనా జంతుజాలానికి ఆవాసమే. కానీ.. మనిషి తన స్వార్థం కోసం.. తన అవసరం కోసం ప్రకృతి నాశనం చేసేస్తున్నాడు.

జంతువులకు నీడ లేకుండా చేస్తున్నాడు. దీంతో రోజు రోజుకూ జంతువులు నిలువ నీడలేక అల్లాడిపోతున్నాయి. 1970 నుంచి 2010 సంవత్సరం వరకు పరిగణనలోకి తీసుకుంటే సగానికి పైగా జంతువులు తమ ఆవాసాలను కోల్పోయాయి. 2014 లో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే సంస్థ తేల్చిన నిజాలు అవి. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం కావచ్చు.. గ్లోబల్ వార్మింగ్ కావచ్చు.. మనిషి స్వార్థం కావచ్చు.. ఏదైనా కావచ్చు.. ఇవన్నీ జంతువుల ఆవాసాలకు గండి కొడుతున్నాయి. అందుకే అవి ఒంటరివైపోతున్నాయి. అంతే కాదు.. వాటి ఆవాసాలతో పాటు అవి కూడా త్వరలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మానవజాతి మేల్కొని వాటిని కాపాడుకుంటేనే ఈ ప్రపంచంలో జీవవైవిధ్యం బతికుంటుంది. ఒకసారి జీవవైవిధ్యం నాశనమైతే ప్రపంచంలో మానవ జాతి కూడా అంతమైనట్టే. అంటే.. మన చేతులారా మనమే మన నాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాము.

63 ఏళ్ళ పార్లే జీ పాపా.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

అమ్మా.. ఆకలేస్తోందమ్మా. ఏదైనా ఉంటే పెట్టమ్మా… ఒరేయ్.. నీకెప్పుడూ ఆకలి గోలే. అది కడుపా లేక చెరువా. ఇందా.. ఈ రెండు రూపాయలు తీసుకెళ్లి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తినుపో. ఆయ్.. థాంక్యూ మమ్మీ.

అంకుల్.. అంకుల్.. రెండు రూపాయలకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వరా? ఇదిగో బాబు.. పార్లీజీ బిస్కెట్ ఫ్యాకెట్. హుం.. హుం.. వావ్.. బాగుంది బిస్కెట్.. ఇలా ఈ ఒక్క అబ్బాయే కాదు ప్రతి ఒక్కరు లొట్టలేసుకుంటూ తింటారు పార్లీజీ బిస్కెట్ ను. అది కూడా అతి తక్కువ ధరలోనూ బిస్కెట్ ప్యాకెట్ లభించడం.. పిల్లలకు నచ్చే విధంగా బిస్కెట్లను తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. అందుకే.. పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్ అంటేనే పిల్లలు పడి చచ్చిపోతారు.

సరే.. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. 1929 లో పార్లీజీ బిస్కెట్ కంపెనీని ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువ బిస్కెట్లను అమ్ముతున్న కంపెనీగా రికార్డు సృష్టించింది. అయితే.. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా ఉండే ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది. ఆ చిన్నారి ఎవరో ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికీ.. ఆ పాప బొమ్మనే బిస్కెట్ ప్యాకెట్ మీద అచ్చేస్తూ వస్తున్నారు. కానీ.. మీకు ఎప్పుడైనా ఆ అమ్మాయి ఎవరు అనే డౌట్ రాలేదా? వచ్చే ఉంటుంది కానీ.. లైట్ తీసుకొని ఉంటారు. ఆ అమ్మాయి పేరు నీరు దేశ్ పాండె. తనకు నాలుగేండ్ల వయసు ఉన్నప్పుడు తన ఫోటోను తీసుకొని పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్ మీద వాడుతున్నారు. ఇప్పటికీ అదే అమ్మాయి ఫోటోను వాడుతుండటం విశేషం. నీరు తండ్రి ఆ ఫోటోను తీయగా.. ఆ ఫోటో పార్లీజీ బిస్కెట్ యాజమాన్యానికి నచ్చడంతో వాళ్లు అతడి అనుమతి తీసుకొని అప్పటి నుంచి ఆ అమ్మాయి ఫోటోనే వాడుతున్నారు.

ఇప్పుడు అదే నీరు దేశ్ పాండే వయసు ఎంతో తెలుసా? 63 ఏండ్లు. ఆమె ఇప్పుడు ఎలా మారిందో కింది ఫోటోలో చూడండి. అయితే.. కొంతమంది అసలు ఆ ఫోటోలో ఉన్నది అమ్మాయే కాదు.. కేవలం సృష్టించిన బొమ్మ మాత్రమే అని అంటుంటారు. కానీ.. నిజానికి ఆమె నీరూ దేశ్ పాండే అంటూ చెబుతున్నారు. ఆ అమ్మాయే ఈమె అంటూ నీరు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది పార్లీజీ గర్ల్ స్టోరీ.

Health Tips: అన్ని సమస్యలకు దివ్యౌషధం! అల్లం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

సరైన ఆహారం లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం మధుమేహానికి కారణం కావచ్చు. అంతే కాకుండా జన్యుపరమైన కారణాల వల్ల కూడా మధుమేహం రావచ్చు. అందువల్ల, అల్లం ఈ వ్యాధి ప్రమాదాలను నియంత్రించడానికి, అది రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

మనందరికీ ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా జీవించాలనే కోరిక ఉంటుంది. కాబట్టి, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనం కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. అలాగే, ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చడం కూడా చాలా ముఖ్యం. మనం తప్పక తీసుకోవాల్సిన ఆహారాలలో అల్లం ఒకటి. మన శరీరంలోని చాలా సమస్యలను అల్లంతో పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? ఇక్కడ తెలుసుకుందాం..

మైగ్రేన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

తలనొప్పి అనే పేరు చాలా మందికి పెద్ద తలనొప్పి. ఒత్తిడి, మానసిక గందరగోళం, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది మైగ్రేన్‌తో బాధపడుతుంటారు. తలనొప్పి నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంది టీ తాగుతుంటారు. టీ తాగటం వల్ల తలనొప్పిని దూరం చేసుకునే వారు, ఈ మైగ్రేన్‌లను వదిలించుకోవడానికి అల్లం టీ తాగడం ఉత్తమమైన మార్గం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆర్థరైటిస్ నుండి ఉపశమనం :

చాలా మందికి వృద్ధాప్యం కారణంగా మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఈ నొప్పితో బాధపడేవారు చాలా మంది తీవ్ర వేదనకు గురవుతారు. ఎక్కువ మంది వైద్యులు దీని కోసం వివిధ మందులను సూచిస్తున్నప్పటికీ, అల్లం ఉత్తమ నొప్పి నివారిణిగా పరిగణించబడుతుంది. మీ రోజువారీ ఆహారంలో అల్లం తీసుకోవడం ఇది ఖచ్చితంగా నొప్పి నివారిణిగా పనిచేస్తుందని చెబుతున్నారు.

బహిష్టు నొప్పిని దూరం చేసుకోండి:

ఋతుస్రావం సమయంలో చాలా మంది మహిళలు కడుపు తిమ్మిరితో బాధపడుతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు అల్లం కూడా ఉపయోగపడుతుంది. దీన్ని నీటిలో వేసి మరిగించి రుతుక్రమానికి ముందు తినాలి. లేదా నిమ్మరసం కలిపి తాగండి. కొంతమంది దీనిని ప్రారంభ ఋతుస్రావం కోసం కూడా ఉపయోగిస్తారు.

మధుమేహం నియంత్రణకు:

ఒక వ్యక్తికి మధుమేహం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన ఆహారం లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం మధుమేహానికి కారణం కావచ్చు. అంతే కాకుండా జన్యుపరమైన కారణాల వల్ల కూడా మధుమేహం రావచ్చు. అందువల్ల, అల్లం ఈ వ్యాధి ప్రమాదాలను నియంత్రించడానికి, అది రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

గొంతు నొప్పికి నివారిణి..

కాలానుగుణ మార్పుల కారణంగా చాలా మంది గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. గొంతునొప్పితో పాటు, చలి వల్ల కూడా శరీరం బాగా అలసిపోయినట్లుగా ఉంటారు. మీరు ఈ సమయంలో అల్లం ఉపయోగించవచ్చు. నీళ్లలో, టీలో లేదా నేరుగా తినడం వల్ల కూడా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల గొంతునొప్పి, జలుబు, జ్వరం రాకుండా చూసుకోవచ్చు.

గుండెను రక్షించడంలో సహాయపడుతుంది:

ప్రస్తుత కాలంలో గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువయ్యాయి. అల్లం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుందని వైద్య పరిశోధనలు సూచిస్తున్నాయి. గుండె జబ్బులకు వివిధ కారణాలు ఉన్నప్పటికీ, జన్యుపరమైన అంశాలు ప్రధానమైనవిగా పరిగణించబడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఆహారంలో అల్లం చేర్చుకోవడం మంచిదని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కడుపు రుగ్మతలకు నివారణలు:

అల్లం కూడా కడుపు సమస్యలకు నివారణగా ఉపయోగపడుతుంది. అల్లం నీటిలో వేసి మరిగించి తాగితే వికారం , అజీర్ణం, వాంతులు, మూర్ఛ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Gold-Silver Prices Today: గోల్డ్‌ రేట్‌ వింటే బీపీ ఖాయం – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices 10 April 2024: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర రికార్డ్‌ స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,361 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 100 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 110 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 90 రూపాయల చొప్పున పెరిగాయి. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 65,750 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,730 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 53,800 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 88,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 65,750 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,730 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 53,800 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 88,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Cities)

చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 66,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 72,650 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 65,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,730 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 65,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,770 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 65,750 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,730 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 65,750 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,730 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 65,750 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,730 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Countries)

దుబాయ్‌లో (Today’s Gold Rate in Dubai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 59,158.78 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 63,862.02 వద్దకు చేరింది. UAE, షార్జా, అబుదాబిలో ఇవే రేట్లు అమల్లో ఉన్నాయి.
మస్కట్‌లో (Today’s Gold Rate in Muscat) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 61,080.46 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 64,215.56 వద్దకు చేరింది.
కువైట్‌లో (Today’s Gold Rate in Kuwait) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 59,839.73 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 63,630.48 వద్దకు చేరింది.
మలేసియాలో (Today’s Gold Rate in Malaysia) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 61,148.29 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 64,126.86 వద్దకు చేరింది.
సింగపూర్‌లో (Today’s Gold Rate in Singapore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 60,216.78 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 66,639.90 వద్దకు చేరింది.
అమెరికాలో (Today’s Gold Rate in United States) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 59,101.32 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,430.97 వద్దకు చేరింది.

ప్లాటినం ధర (Today’s Platinum Rate)
మన దేశంలో 10 గ్రాముల ‘ప్లాటినం’ ధర ₹ 1,220 పెరిగి ₹ 26,060 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

Investment: ప్రతి నెలా గ్యారెంటీగా రూ.9,000 పైగా ఇచ్చే పోస్టాఫీస్‌ పథకం, మిస్‌ చేసుకోవద్దు

పోస్టాఫీసు పథకాల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో పెట్టుబడి పెడుతూ వెళితే, దీర్ఘకాలంలో వడ్డీతో కలిపి మంచి సంపద సృష్టించొచ్చు.
Post Office Monthly Income Scheme: మన దేశ ప్రజల్లో తరతరాలుగా పొదుపు గుణం కొనసాగుతూ వస్తోంది. ఆదాయంలో ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అలవాటుగా మారింది. భవిష్యత్‌ అవసరాల కోసం ప్రజలు ముందు నుంచే డబ్బు దాస్తుంటారు. ఇలా డబ్బు దాచేందుకు చాలా సంప్రదాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో.. పోస్టాఫీస్‌ పథకాలు ప్రజల నమ్మకం సంపాదించాయి. మన దేశంలో బ్యాంక్‌ ఖాతాల కంటే పోస్టాఫీస్‌ ఖాతాలు ఎక్కువగా ఉండడమే దీనికి నిదర్శనం.

ప్రస్తుతం షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఆకర్షణీయంగా కనిపిస్తున్నా.. వాటితో వ్యవహారం రిస్క్‌తో కూడుకున్నది. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. పోస్టాఫీస్‌ స్కీమ్స్‌ అలా కాదు. వీటిలో జమ చేసే డబ్బు ఎక్కడికీ పోదు, కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. పైగా, ముందుగానే నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం ఖచ్చితంగా ఆదాయం లభిస్తుంది. అందుకే, పోస్టాఫీస్‌ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Post Office Small Savings Schemes) పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే వ్యక్తులు దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు.

పోస్టాఫీసు పథకాల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో పెట్టుబడి పెడుతూ వెళితే, దీర్ఘకాలంలో వడ్డీతో కలిపి మంచి సంపద సృష్టించొచ్చు. అంతేకాదు, ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని పొందే స్కీమ్‌ కూడా ఒకటి ఉంది. దాని పేరు పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌.

పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం వివరాలు:

పోస్టాఫీస్‌ నెలవారీ ఆదాయ పథకానికి (Post Office Monthly Income Scheme – POMIS) ప్రజల నుంచి మంది ఆదరణ లభిస్తోంది. పోస్ట్ ఆఫీస్ అమలు చేస్తున్న బెస్ట్‌ స్కీమ్స్‌లో ఇది ఒకటి. ఒకేసారి కొంత మొత్తాన్ని ఈ ఖాతా ద్వారా పెట్టుబడి పెడితే, ప్రతి నెల హామీతో కూడిన రాబడిని పొందొచ్చు.

పోస్టాఫీస్‌ నెలవారీ ఆదాయ పథకం కింద సింగిల్ లేదా జాయింట్ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు.

సింగిల్‌ అకౌంట్‌లో ఏకమొత్తంగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఉమ్మడి ఖాతాలో పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలు.

ఈ పథకంలో 5 సంవత్సరాల కాలానికి డబ్బును డిపాజిట్ చేయవచ్చు.

POMIS ఖాతాలో డిపాజిట్‌ చేసే మొత్తంపై కేంద్ర ప్రభుత్వం 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఈ పథకం కింద వచ్చే వడ్డీ ఆదాయం ప్రతి నెలా ఖాతాదారు ఖాతాలో జమ అవుతుంది. ప్రతి నెలా ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

సింగిల్‌ అకౌంట్‌లో రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ. 5,500 చేతికి వస్తుంది.

జాయింట్ ఖాతాలో గరిష్టంగా రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రతి నెలా రూ. 9,250 గ్యారెంటీ ఆదాయాన్ని పొందొచ్చు.

వైకాపాకు ప్రచారం చేసిన యూనియన్‌ నేతలపై కనికరం .నలుగురినే సస్పెండ్‌ చేసిన ఆర్టీసీ అధికారులు మిగిలిన వారిపై చర్యలొద్దంటూ ఓ సలహాదారు ఒత్తిడి?

ఆర్టీసీ డిపోలు, గ్యారేజీలు, బస్టాండ్లలో తిరిగి.. వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేసి, కరపత్రాలు పంచిన పీటీడీ వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘనేతల్లో మరికొందరిపై చర్యలు తీసుకోకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సహా నలుగురిని సస్పెండ్‌ చేసి, చేతులు దులిపేసుకున్నారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకోలేదు. ఇందుకు ఓ సలహాదారు ఒత్తిడే కారణమని తెలిసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రజా రవాణాశాఖ (పీటీడీ) వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, మరికొందరు వైయస్‌ఆర్‌ జిల్లా కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల్లో గత నెల 31న ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ రుణం తీర్చుకుందామని వెంకట్రామిరెడ్డి పేరిట ముద్రించిన కరపత్రాలను ఉద్యోగులకు పంచారు. దీనిపై ‘ఈనాడు’లో ఈ నెల 2న కథనం ప్రచురితమైంది. అందులోని ఫొటోలో ఉన్నవారిపైనే చర్యలు తీసుకున్నారు. చల్లా చంద్రయ్య, బద్వేలు డిపోకు చెందిన ఎ.సుందరయ్య, ప్రొద్దుటూరు డిపోకు చెందిన రామచంద్రయ్య, కడప డిపోకు చెందిన ఫక్రుద్దీన్‌ను ఈ నెల 3న సస్పెండ్‌ చేశారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చి ప్రచారం చేసినవారి జోలికి వెళ్లలేదు. ఎవరెవరు ప్రచారం చేశారో పేర్కొంటూ.. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి (డీపీటీవో) నివేదిక ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

మూడు జిల్లాల నుంచి హాజరు
డిపోల్లో ప్రచారం చేసినవారిలో తిరుపతి డిపోకు చెందిన కె.అర్జునయ్య, జి.నర్సింహులు, జీవీ ముని, ఒంగోలు డిపోకు చెందిన ఎ.రాధాకృష్ణ, బనగానపల్లి డిపోకు చెందిన బి.శ్రీపతి ఉన్నట్లు వైయస్‌ఆర్‌ డీపీటీవో నివేదిక ఇచ్చారు. బద్వేలు డిపోకు చెందిన ఎస్వీ సుబ్బయ్య గత నెల 31న సెలవు పెట్టి మరీ ఎన్నికల ప్రచారం చేసినట్లు గుర్తించారు. వీరంతా ఏయే డిపోల్లో ఎవరెవరిని కలిశారో కూడా తెలిపారు. అయినా పొరుగు జిల్లాల నేతలపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు.

Diabetes Control Tips : ఈ పువ్వుతో షుగర్ క్షణాల్లో మాయం.. కనిపిస్తే వదలకండి!

xr:d:DAGB56-AyGU:2,j:2583238692350205831,t:24040907

Diabetes Control Tips : పూలు చాలా రకాలు ఉన్నాయి. తరచు పువ్వులు చూస్తుంటే మన మనసు ఎంతో సంతోషిస్తుంది. పువ్వులు చాలా అందంగా, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. చాలా పువ్వులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అటువంటి పువ్వులలో ఒకటి పనీర్ పువ్వు. అవును చదవడానికి వింతగా అనిపించే ఈ పువ్వు అనేక వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉందని నిరూపించబడింది. పనీర్ పువ్వు ముఖ్యంగా మధుమేహాన్ని నయం చేస్తుంది.

పనీర్ పువ్వును పనీర్ దోడా అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Withania coagulans. ఇది సోలనేసి కుటుంబానికి చెందినది. సంస్కృతంలో ఈ పువ్వు పేరు ఋష్యగంధ. దీనికి పనీర్ బెడ్, ఇండియన్ రెన్నెట్, ఇండియన్ చీజ్ మేకర్ వంటి అనేక ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ పువ్వు భారతదేశం, దక్షిణ ఆసియాలోని అనేక దేశాలలో కనిపిస్తుంది. ఈ పువ్వు మొక్క గుబురుగా ఉంటుంది. ఇది చిన్న పువ్వులను కలిగి ఉంటుంది. ఈ పూలను ఔషధంగా ఉపయోగిస్తారు.

మధుమేహం

పనీర్ పువ్వు ఓ మూలికలా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ప్యాంక్రియాస్ బీటా కణాలను నయం చేస్తుంది. ప్యాంక్రియాస్ శరీరంలో ఇన్సులిన్ తయారు చేయడానికి పనిచేస్తుంది. బీటా కణాలు దెబ్బతినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి ప్రక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో పనీర్ పువ్వు బీటా కణాలను నయం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. అలానే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.

ఎలా వినియోగించాలి

మధుమేహ వ్యాధిగ్రస్తులు 7 నుండి 8 పనీర్ పువ్వులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే ఈ నీటిని కొద్దిగా వేడి చేయండి. ఈ నీటిని ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. మీరు ఈ ప్రక్రియను 6 నుండి 7 రోజులు నిరంతరంగా చేస్తే మీ రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కావాలంటే పనీర్ పూల పొడిని కూడా వాడుకోవచ్చు. నీరు త్రాగిన ఒక గంట తర్వాత మాత్రమే ఆహారం తినండి. రక్తంలో చక్కెర స్థాయి సాధారణమైందని మీరు భావించినప్పుడు మీరు దానిని ఆపవచ్చు.

ఈ వ్యాధులకు కూడా ఇది ఉపయోగపడుతుంది

పనీర్ ఫ్లవర్ మధుమేహంతో పాటు అల్జీమర్స్, ఎర్లీ ఫెటీగ్, బ్లడ్ శుద్ధి, ఆస్తమా, నిద్రలేమి, ఊబకాయం, చర్మ సమస్యలు మరియు జలుబు వంటి సమస్యలను కూడా నయం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో పాటు.. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, వాపు, కాలేయం, గుండె సంబంధిత వ్యాధుల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

Disclaimer : ఈ కథనాన్ని ఆరోగ్య సంబంధిత నిపుణుల సలహాల మేరకు అందిస్తున్నాం. ఇది సాధారణ సమాచారం మాత్రమే. దీనిని అవగాహనగా మాత్రమే భావించండి.

Summer Health Care Tips : మండుతున్న ఎండలు.. ఈ చిట్కాలు తప్పనిసరి!

Summer Health Care Tips : దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. అటువంటి పరిస్థితులలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో విపరీతమైన చెమట వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఆహారపు అలవాట్ల నుంచి జీవనశైలి వరకు ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ చిట్కాలు మిమల్ని సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉంటారు. ఆ ఆరోగ్య చిట్కాలపై ఓ లుక్కేయండి.

హీట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

హైడ్రేటెడ్‌గా ఉండండి

వేసవిలో నీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తీసుకోవాలి. డీహైడ్రేషన్ కారణంగా మీకు తల తిరగడం, అలసట, తలనొప్పి మరియు అలసట వంటి సమస్యలు రావచ్చు.

తేలికపాటి, తాజా ఆహారాన్ని తినండి

వేసవిలో మీరు ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారాన్ని తీసుకోకండి. దీనివల్ల అనారోగ్యానికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో మీ లంచ్ లేదా డిన్నర్ తేలికగా, తాజాగా ఉండేలా చూసుకోండి. మీరు ఇందులో సీజనల్ పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను తప్పనిసరిగా చేర్చాలి. అలాగే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండండి.

బట్టలు

ఈ సీజన్‌లో వదులుగా ఉండే దుస్తులు ధరించాలని పెద్దలు ఎప్పటినుంచో సలహా ఇస్తూనే ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మీరు ధరించే బట్టలు బిగుతుగా ఉండకుండా లేదా మీ చర్మానికి అతుక్కోకుండా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కారణంగా చెమట ఎండిపోకుండా చర్మం ఇన్ఫెక్షన్ సమస్యను కూడా ఎదుర్కోవచ్చు.

ఈ సీజన్‌లో వీలైనంత వరకు సూర్యరశ్మికి గురికాకుండా ఉండండి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సూర్యకాంతి చాలా బలంగా ఉంటుంది. ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినా గొడుగు ఉపయోగించండి.

వ్యాయామం

ఈ రోజుల్లో ఆరుబయట వ్యాయామం చేయవద్దు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పార్క్ మొదలైన వాటిలో వ్యాయామం చేయడం వల్ల హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఈ సీజన్‌లో మీరు ఎక్కువగా వేయించిన, మసాలా ఆహారాన్ని తినడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వీధి వ్యాపారులు ఉపయోగించే మురికి నూనె వస్తువులు మిమ్మల్ని ఫుడ్ పాయిజనింగ్‌కు గురి చేస్తాయి. అటువంటి పరిస్థితిలో హీట్‌స్ట్రోక్‌ను నివారించడానికి పరిశుభ్రత ఉండే ఆహారాన్ని తీసుకోండి.

ఈ చిట్కాలు పాటించండి

చల్లని ప్రదేశాల్లో ఉండండి.
ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండే నీరు త్రాగాలి.
శరీర ఉష్ణోగ్రతను గమనించండి.
ఎండలో తిరగడం మానుకోండి.
పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దు.
చెప్పులు లేకుండా నడవకండి.
మధ్యాహ్నం బయటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
వేసవి కాలంలో రొటీన్ చెకప్‌లను తప్పకుండా చేయించుకోండి.

ఏపీ ఇంటర్ ఫలితాలు… మీ ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేసుకోండి

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది.

అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తికానున్నాయి. ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో (AP Inter Results) మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరం 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం సాధించింది. 81 శాతంతో గుంటూరు ద్వితీయ స్థానం, 79 శాతంతో ఎన్టీఆర్‌ జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. 48 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. రెండో సంవత్సరం ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 63 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది.

రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ ఫీజు చెల్లింపునకు ఈ నెల 18 నుంచి 24 వరకు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

AP Inter Results 2024 Live Updates: BIEAP to declare 1st, 2nd year results today at bie.ap.gov.in. Here’s how to check

AP Inter Results 2024 Live: How to check results?
To check your scores for AP Intermediate Results 2024, follow these steps: Visit the official website at bie.ap.gov.in.

Click on the link provided for AP Inter Results 2024 on the homepage.

Log in by entering your credentials.

Your AP Intermediate Result score will be displayed on the screen.

Download the AP Inter Results mark sheet. Keep a hard copy of the mark sheet for future reference.

12/4/2024 ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల!

AP Inter Board Website

INTERMEDIATE PUBLIC REGULAR EXAMINATIONS RESULTS-2024
1st Year General Results Click Here
1st Year Vocational Results Click Here
2nd Year General Results Click Here
2nd Year Vocational Results Click Here

https://resultsbie.ap.gov.in/

Eenadu Website

JUNIOR INTER General Vocational
SENIOR INTER General Vocational

sakshi education results

Mana Badi Results 

AP Inter 1st Year Results …..click here

AP Inter 2nd Year Results …..click here

              

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (10/04/24)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

మేషం
మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు .ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.

వృషభం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్త వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

మిథునం
మీదైన రంగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చంద్ర సంచారం అనుకూల లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన శుభకరం.

కర్కాటకం
కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి,వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రుల సహకారం ఉంది. శ్రీలక్ష్మీ స్తుతి శ్రేయస్కరం.

సింహం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

కన్య
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ఫర్వాలేదనిపిస్తుంది. పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. గోసేవ చేయడం మంచిది.

తుల
ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనసు చెడు విషయాలవైపు మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

వృశ్చికం
మంచి పనులు చేస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు. శని ధ్యానం చేయాలి.

ధనుస్సు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ శుభప్రదం.

మకరం
కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

కుంభం
ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

మీనం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

T20 World Cup 2024: పంత్ ఫిక్స్! టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా ఆటగాళ్ల జాబితా సిద్ధం.. ఎవరెవరున్నారంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్-17 ముగిసిన వెంటనే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా ఈ పొట్టి ప్రపంచ కప్ షురూ కానుంది. ఈ మెగా క్రికెట్ పోరు కోసం అన్ని జట్లు మే 1లోగా తమ జట్లను ప్రకటించాల్సి ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్-17 ముగిసిన వెంటనే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా ఈ పొట్టి ప్రపంచ కప్ షురూ కానుంది. ఈ మెగా క్రికెట్ పోరు కోసం అన్ని జట్లు మే 1లోగా తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం బీసీసీఐ కొంత మంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసింది. అయితే ఈ జాబితాలో ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి ఐపీఎల్ లో అదరగొడుతోన్న రిషబ్ పంత్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం ప్రకారం రిషబ్ పంత్ భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయం. ఎందుకంటే యాక్సిడెంట్ తర్వాత ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న పంత్.. ఇప్పుడు ఐపీఎల్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రాణించలేకపోతోంది. అయితే, జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం సూపర్బ్ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ అద్భుతమైన బ్యాటింగ్ ఫలితంగా ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు పంత్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.

రిషబ్ పంత్ ఇప్పటివరకు 154.55 స్ట్రైక్ రేట్‌తో 153 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. రిషబ్ పంత్ ఎంపిక దాదాపు ఖరారైన నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ జట్టులో కేఎల్ రాహుల్, జితేశ్ శర్మలకు అవకాశం దక్కడం అనుమానమేనని ప్రచారం సాగుతోంది. అలాగే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ రాబోయే మ్యాచ్‌ల్లో మంచి బ్యాటింగ్‌ కనబరిస్తే ఇద్దరిలో ఒకరిని రెండో వికెట్‌ కీపర్ గా ఎంపిక చేయవచ్చని సమాచారం.

ప్రపంచకప్‌లో పాల్గొనే టీమ్ ఇండియా ఆటగాళ్ల పేర్లు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

మహిళల కోసం సూపర్ స్కీమ్.. ఇందులో పెట్టుబడి పెడితే కళ్లు చెదిరే రాబడులు

సమాజంలోని కానీ, ప్రతి ఇంట్లో కానీ ఆర్థిక అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఎందుకంటే.. ప్రతి ఇంట్లో కష్టపడి సంపాదిస్తున్న దాంట్లో.. కొంత మొత్తన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇక పొదుపు చేసి కుటుంబన్ని ముందుకు నడిపించిన విషయంలోనే మహిళలకు సాటి ఎవరు రారు. ఇప్పటికే చాలామంది ఇలా ఇంట్లో కష్టపడిన కొంత సొమ్మును సేవింగ్స్ చేసేందుకు చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా.. స్టాక్ మార్కెట్ వంటి వాటిలో నగదును పొదుపు చేయడమనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే.. ఇందులో పెట్టిన పెట్టుబడి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో.. చాలామది మహిళలు ఇలాంటి రిస్క్ లేని పథకాల కోసం ఎదురు చూస్తుంటారు. మరి, అలాంటి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి ఆ స్కీమ్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సరిటిఫికేట్ పథకంను అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్ అనేది పోస్ట్ ఆఫీసులతో పాటు వివిధ బ్యాంకుల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే తక్కువ పెట్టుబడితో ఎలాంటి రిస్క్ లేకుంటా మంచి ఆదాయాన్ని అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. పైగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో ప్రస్తుతం వడ్డీ రేటును 7.5 శాతంగా అందిస్తోంది. అంతేకాకుండా.. ఈ పథకం మెచ్యూరిటీ టెన్యూర్ రెండేళ్లుగా వరకు ఉంటుంది. అనగా.. మహిళలు రెండేళ్ల పాటు ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. మరోవైపు.. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు సైతం క్లెయిమ్ చేసుకోనే అవకాశం ఉంది. ముఖ్యంగా.. ఇందులో 10 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్న బాలికల పేరుపైనా కూడా ఖాతా తీసుకోవచ్చు.

ఇక ఈ స్కీమ్ లో ఉదాహరణకు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే.. మీకు మొదటి ఏడాది 7.5 శాతం వడ్డీ రేటుతో రూ. 15 వేల వడ్డీ లభిస్తుంది. ఇక దానిని అసలుకు జమ చేస్తారు. ఆ తర్వాత రెండో ఏడాదిలో వడ్డీ రూ. 16,125 లభిస్తుంది. అంటే ఈ పథకంలో మహిళలు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టినట్లియితే వారికి రెండేళ్ల మెచ్యూరిటీ తర్వాత వడ్డీ రూపంలో మొత్తంగా రూ. 31,125 వరకు లభిస్తుంది. అయితే ఈ స్కీమ్ అనేది 2025 వరకే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ స్కీమ్ అందుబాటులో ఉండకపోవచ్చు.

Health

సినిమా