Monday, December 15, 2025

బిగ్ బ్యాటరీ.. ఆకట్టుకోనే ఫీచర్లు.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

కొన్నేళ్ల కిందటి నుంచి స్మార్ట్‌ఫోన్‌లలో చాలా మార్పులు వస్తున్నాయి. కంపెనీలు పోటీపడి మరీ కొత్త మోడల్స్ మార్కెట్లోకి తెచ్చి సక్సెస్ అవుతున్నాయి.

పెద్ద డిస్‌ప్లేతో కొన్ని ఫోన్లు సక్సెస్ కాగా, అధిక బ్యాటరీతో కొన్ని, స్టోరేజీ కెపాసిటీ, గేమింగ్ కోసం ఫాస్టెస్ట్ ప్రాసెసర్ వల్ల కొన్ని స్మార్ట్‌ఫోన్లు విక్రయాలలో రాణించాయి. ఓవైపు డిస్‌ప్లే పెరగడం, డౌన్‌లోడ్ చేసే యాప్స్, గేమింగ్ ఫీచర్ల కారణంగా పలు కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లలో జంబో బ్యాటరీ ప్యాక్‌లను ఇవ్వడం ప్రారంభించాయి. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో ఈ ఏడాది విడుదలైన 7,000mAh కంటే పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్‌ల వివరాలపై ఓ లుక్కేయండి.

వివో టీ4 5జీ

ఈ వివో ఫోన్ 6.77 క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో ప్రారంభించారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP (OIS) + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీని ముందు భాగంలో సెల్ఫీలు, వీడియోల కోసం 32MP సెన్సార్ ఇచ్చారు. ఈ ఫోన్ 7300 mAh బ్యాటరీతో వచ్చింది. వివో టీ4 5జీ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ. 24,999కి లిస్ట్ చేయబడింది.

వన్‌ప్లస్ 15

ఈ ప్రీమియం ఫోన్ 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో ప్రారంభించబడింది. ఇందులో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉంది. ఇది 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో 32MP లెన్స్‌తో వస్తుంది. ఇది 7,300mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది, ఇది 120W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 72,999.

ఐక్యూ 15

ఐక్యూ 15 స్మార్ట్ ఫోన్ కూడా తన ఫీచర్లతో OnePlus 15కి పోటీనిస్తుంది. iQOO 15లో 6.85 అంగుళాల M14 LEAD OLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది పవర్‌ఫుల్ Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో వచ్చింది. ఫోన్ వెనుక భాగంలో ఫొటోలు, వీడియోల కోసం 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. అయితే ఐక్యూ 15 ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 100W ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్ట్ చేసే 7,000mAh సిలికాన్ యానోడ్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంది. ఐక్యూ 15 ఫోన్ ప్రారంభ ధర రూ. 72,999గా ఉంది.

ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తమకు తెలియకుండానే గంటలపాటు రీల్స్, షార్ట్స్ చూస్తూ కూర్చునే వారు కొందరైతే.. గంటల తరబడి ఆన్‌లైన్ గేమ్స్ ఆడే జెన్ జెడ్ యువత ఉన్నారు. ఆఫీసు పనిమీద బయటకు వెళ్లేవారు, ఎక్కువ గంటలపాటు ఫోన్‌లోనే బిజినెస్ చక్కబెట్టే వారికి ఇలాంటి బిగ్ బ్యాటరీ ఫోన్లతో ప్రయోజనం ఉంటుంది. ఎక్కువ mah బ్యాటరీ అనే ఫీచర్లతో కొన్ని కంపెనీలు మార్కెట్లో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి.

హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని అమీర్ పేట మైత్రీవనం సమీపంలో ఉన్న శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్ లో ఈ ప్రమాదం సంభవించింది.

అన్నపూర్ణ బ్లాక్ లో ప్రమాదం జరగటంతో రెండో అంతస్తు నుండి దట్టంగా పొగలు వ్యాపించాయి. ప్రమాదం తరవాత విద్యార్థులను బయటకు పంపించారు. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అదించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాటరీలు పేలడం వల్లనే మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు.

వణికించే చలికి చెక్ పెట్టండి.. ఎలక్ట్రిక్ దుప్పట్లు తక్కువ ధరకే.

లి గాలులతో దేశంలో నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పోయింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి గజగజ వణికిస్తోంది. దీంతో ప్రజలు హీటింగ్ ఉపకరణాలను కొనడం పై దృష్టి పెడుతున్నారు.

హీటర్లు, గీజర్లతో పాటు, ఎలక్ట్రిక్ దుప్పట్లు కూడా వేగంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఎలక్ట్రిక్ దుప్పట్లు సాధారణ దుప్పట్ల కంటే చాలా ఎక్కువ వెచ్చదనాన్ని అందిస్తాయి. తీవ్రమైన చలిలో కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. అవి త్వరగా వేడెక్కుతాయి. అమెజాన్ లో తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ నాణ్యత విషయంలో రాజీపడటం హానికరం. ఎలక్ట్రిక్ దుప్పటిని కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

సెక్యూరిటీ ఫీచర్లు

ఎలక్ట్రిక్ దుప్పటిని కొనుగోలు చేసేటప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం దాని సెక్యూరిటీ ఫీచర్లు. మల్టిపుల్ టెంపరేచర్ కంట్రోల్, ఆటో షట్-ఆఫ్ ఫీచర్ ఉన్నదాన్ని ఎంచుకోవాలంటున్నారు. ఇది నిర్ణీత సమయం తర్వాత ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. వేడెక్కడం, మంటల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

BIS లేదా ISI సర్టిఫికేషన్

సేఫ్టీ సర్టిఫికెట్స్ ఏదైనా విద్యుత్ ఉత్పత్తి ప్రమాణాలను సూచిస్తాయి. అందువల్ల, విద్యుత్ దుప్పటిని కొనుగోలు చేసేటప్పుడు, BIS ధృవీకరణ లేదా ISI గుర్తు కోసం చూడండి. ఇది దుప్పటి అవసరమైన ప్రభుత్వ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారిస్తుంది. విద్యుత్ దుప్పట్లను తయారు చేసే కంపెనీలు BIS కింద IS 302 (పార్ట్ 1):2024 ధృవీకరణ పొందవలసి ఉంటుంది.

వైరింగ్, ఫాబ్రిక్ క్వాలిటీ

ఎలక్ట్రిక్ దుప్పటి లోపల వైరింగ్ అనేది అతి ముఖ్యమైన భాగం. ఇది బలంగా, సరళంగా ఉండాలి. తద్వారా నిరంతరం ఉపయోగించడం వల్ల వంగదు లేదా విరిగిపోదు. విరిగిన వైర్ విద్యుత్ షాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా, దుప్పటి, ఫాబ్రిక్ తేలికైనది, మృదువైనది, చర్మానికి అనుకూలంగా ఉండాలి. మీరు ఒకదాన్ని కొనుగోలు చేసే ముందు వైరింగ్, ఫాబ్రిక్ నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

మీరు శుభ్రతను ఇష్టపడితే, తొలగించగల కంట్రోలర్ ఉన్న ఎలక్ట్రిక్ దుప్పటిని ఎంచుకోండి. కంట్రోలర్‌ను తీసివేయడం వల్ల నీటితో కడగడం సులభం అవుతుంది. ఉపయోగించిన తర్వాత ఎలక్ట్రిక్ దుప్పటిని ఎప్పుడూ గట్టిగా మడవకూడదని గుర్తుంచుకోండి. ఇది వైరింగ్‌ను దెబ్బతీస్తుంది. దుప్పటి జీవితకాలాన్ని తగ్గిస్తుంది. అమెజాన్ లో Zennovate బ్రాండ్ కు చెందిన ఎలక్ట్రిక్ బ్లాంకెట్ రూ. 1498కి అందుబాటులో ఉంది.

టాస్కుల ద్వారా ఒకరు..ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఒకరు..ఈ వారం ‘బిగ్ బాస్ 9’ నుండి ఆ ఇద్దరు అవుట్

ఊహించని ట్విస్టులు , ఎమోషన్స్ తో ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ తో ఎట్టకేలకు 13 వారాలు పూర్తి చేసుకొని 14వ వారం లోకి అడుగుపెట్టింది.

ఇన్ని వారాలు ఉత్కంఠ భరితంగా సాగింది కదా, చివరి ఈ రెండు వారాలు అయినా కంటెస్టెంట్స్ ని ప్రశాంతంగా ఉంచుతారేమో బిగ్ బాస్ అని అంతా అనుకున్నారు. కానీ ఈ రెండు వారాలు కూడా ఆడియన్స్ కి ఉత్కంఠ తో నరాలు తెగిపోయే రేంజ్ టాస్కులు డిజైన్ చేశారు బిగ్ బాస్ టీం. నిన్న నామినేషన్స్ ప్రక్రియ లాంటివి ఏమి లేకుండా, బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ ని మినహా, మిగిలిన కంటెస్టెంట్స్ అందరినీ నామినేట్ చేసాడు. ఇప్పుడు నామినేషన్స్ లో ఇమ్మానుయేల్, తనూజ, భరణి, డిమోన్ పవన్, సంజన మరియు సుమన్ శెట్టి ఉన్నారు.

వీరిలో ఈ వారం ఆడుతున్న టాస్కులలో ఎవరికైతే అత్యధిక పాయింట్స్ వస్తాయో, వాళ్ళు నేరుగా నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి, ఫినాలే వీక్ లోకి అడుగుపెడతారు. అదే విధంగా ఎవరికైతే తక్కువ పాయింట్స్ వస్తాయో, వాళ్ళు ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. దమ్ము శ్రీజా ఎలిమినేషన్ మీ అందరికీ గుర్తుంది కదా, అదే తరహా ఎలిమినేషన్ ఈ వారం కూడా జరగబోతుంది. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన టాస్కులో ఇమ్మానుయేల్ గెలిచి 50 పాయింట్స్ సాధించాడు. ఆ తర్వాత భరణి 40 పాయింట్స్ సాధించి రెండవ స్థానం లో ఉండగా, డిమోన్ పవన్ 30 పాయింట్లు, తనూజ 20 పాయింట్లు , సుమన్ శెట్టి 10 పాయింట్స్ సాధించారు. ఇక సంజన కి కంటెస్టెంట్స్ అందరూ జీరో పాయింట్స్ ఇచ్చి జైలు లో వేయడం వల్ల ఆమె మొదటి టాస్కులో ఆడలేకపోయింది. ఇక రెండవ టాస్కు ని కాసేపటి క్రితమే మీరు ప్రోమో లో చూసి ఉంటారు.

ఈ టాస్క్ లో కూడా ఇమ్మానుయేల్ గెలిచి 100 పాయింట్స్ సాధించాడు. మొదటి రెండు టాస్కులు కలిపి 150 పాయింట్స్ ని ఇమ్మానుయేల్ సాధించి నెంబర్ 1 స్థానం లో కొనసాగగా, రెండవ స్థానం లో 120 పాయింట్స్ తో డిమోన్ పవన్, ఇక 90 పాయింట్స్ లో తనూజ, భరణి, సుమన్ శెట్టి మూడవ స్థానం లో 80 పాయింట్స్ తో సంజన నాల్గవ స్థానంలో కొనసాగుతున్నారు. వీరిలో ప్రస్తుతానికి సంజన డేంజర్ జోన్ లో ఉంది. ఆమె ప్రతీ టాస్క్ గెలుస్తూ రావాలి, లేదంటే అందరికంటే తక్కువ పాయింట్స్ ఈమెకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈమె ఎలిమినేట్ అవ్వొచ్చు. ఇక ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అయితే సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఈయన కూడా వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వొచ్చు. కాబట్టి ఈ వారం ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ టెన్షన్ తోనే ఉండాలి.

ఎలాన్‌ మస్క్‌ సమర్పించు… మెమొరీ ట్రిక్స్‌

‘అదేమిటో… చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాను’ అనుకునేవారిలో మీరు కూడా ఉన్నారా? అయితే మీరు అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అనుసరించే మెమోరీ ట్రిక్స్‌ ఫాలో కావాల్సిందే.

‘ట్రిక్స్‌ టు రిమెంబర్‌ ఎవ్రీథింగ్‌’ అంటున్నాడు మస్క్‌. వాటిలో కొన్ని…

బ్రెయిన్‌ అనేది కొన్నిసార్లు అనవసర సమాచారంతో, అనవసర ఆలోచనలతో చెత్తబుట్టగా మారిపోతుంది. దీంతో అవసరమైన విషయాలకు చోటు ఉండదు. అందుకే అనవసర విషయాలను ఎప్పటికప్పుడూ డిలీట్‌ చేసి మంచి విషయాల కోసం స్పేస్‌
ఏర్పాటు చేసుకోవాలి.

ముఖ్యమైన విషయాలతో ‘మెమోరీ ట్రీ’ నిర్మించాలి. ఈ చెట్టుకు కొమ్మలుగా కొత్త విషయాలను అనుసంధానిస్తూ పోవాలి.

ఎవరికివారు పర్సనల్‌ కోడింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. విషయాలను వేగంగా గుర్తు తెచ్చుకోవడానికి సంఖ్యలు, చిహ్నాలు, చిత్రాలు.. మొదలైన వాటిని ఉపయోగించాలి. ‘ఈ ట్రిగ్గర్‌లు మెదడులోని సంక్లిష్ట సమాచారాన్ని త్వరగా, తక్కువ శ్రమతో తిరిగి పోందడానికి ఉపయోగపడతాయి’ అంటాడు మస్క్‌.

విషయాలు, పేర్లను గుర్తు తెచ్చుకోవడంలో ‘మీనింగ్‌ఫుల్‌ కనెక్షన్‌’ ముఖ్యం అంటాడు ఎలాన్‌ మస్క్‌. ఉదాహరణకు ఒక వ్యక్తి పేరును గుర్తు తెచ్చుకోవడానికి వారి హాబీ, ఫన్నీస్టోరీ, వారి ముఖానికి సంబంధించి యూనిక్‌ ఫీచర్, ఆ వ్యక్తి నవ్వు, మాట్లాడే పద్ధతి… మొదలైన వాటితో పేరును గుర్తు పెట్టుకోవాలి.

మీనింగ్‌ఫుల్‌ కనెక్షన్‌ అనేది ఎందుకు ముఖ్యమైనది అంటే… మన మెదడు ర్యాండమ్‌ ఫ్యాక్ట్స్‌ కంటే స్టోరీలను, ఎమోషన్‌లనూ ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది.

‘అసోసియేట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌’ టెక్నిక్‌ గురించి నొక్కిచెబుతున్నాడు మస్క్‌. అసాధారణ దృశ్యాలతో, సమాచారాన్ని గుర్తు పెట్టుకోవడమే… అసోసియేట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌. ఉదాహరణకు… ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు అరటిపండ్లు కొనాలనుకున్నారు. ఇందుకోసం ఒక అసాధారణ దృశ్యాన్ని మదిలో ఆవిష్కరించుకోవాలి. ఏనుగంత సైజులో ఉన్న అరటిపండు సన్‌గ్లాసెస్‌ ధరించి మీ కిచెన్‌లో డ్యాన్స్‌ చేస్తుంటుంది!

‘రిపీట్‌ అండ్‌ రివ్యూ’ మెథడ్‌లో భాగంగా గతంలోకి వెళ్లి మనకు నచ్చిన విషయాలను గుర్తు తెచ్చుకోవాలి. ఇలా తరచుగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది.

ఆరు నెలల్లో 20 కేజీలు తగ్గిన వ్యక్తి.. 14 గోల్డెన్ రూల్స్ కచ్చితంగా పాటించాడట, అవేంటంటే..

కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. చాలామందికి బరువు తగ్గాలనే కోరిక మళ్లీ రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ చాలామంది విష్​ లిస్ట్​లో ఒకటి ఉంటుంది.

అలానే ఓ వ్యక్తి కూడా ఫిట్​నెస్ విషయంలో స్ట్రిక్ట్​గా ఉండాలనుకున్నాడు. 6 నెలలు కష్టపడి 14 విషయాలు ఫాలో అవుతూ 20 కేజీలు తగ్గాడు. అతనే పృథ్వీ చౌదరి. ప్రాజెక్ట్ ప్రోగామ్ మేనేజ్​మెంట్ కన్సల్టెంట్​గా చేస్తోన్న పృధ్వీ తన వెయిట్​లాస్ జర్నీ గురించి.. సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

బరువు తగ్గడానికి హెల్ప్ చేసిన 14 గోల్డెన్ రూల్స్..

బరువు తగ్గాలని కోరిక ఉంటే సరిపోదు. కానీకోసం శారీరకంగా, మానసికంగా కొన్ని కమిట్మెంట్స్, ఓపిక, నిబద్ధత ఉండాలన్నారు పృధ్వీ. అయితే తన 20 కేజీల వెయిట్​లాస్ జర్నీలో 14 విషయాలు కచ్చితంగా ఫాలో అయ్యాడట. అవేంటంటే..

1. నో షుగర్ – 6 నెలలు స్వీట్స్​కి పూర్తిగా దూరంగా ఉన్నాడట. అయితే Monk fruit స్వీటనర్​ని రిప్లేస్​మెంట్​గా తీసుకునేవాడట. ఇది క్రేవింగ్స్​ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేసిందని తెలిపారు.

2. నో మైదా – మైదాతో తయారు చేసిన బిస్కెట్లు, ఇతర వేయించిన పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపారు.

3. బిర్యానీకి బై – ఈ ఆరు నెలలు బిర్యానీ, స్వీట్స్, ఐస్​ క్రీమ్ జోలికి వెళ్లలేదని చెప్పాడు.

4. కార్డియో – ప్రతిరోజూ 45 నిమిషాలు కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ 45 నిమిషాలు చేసేవారట.

5. ప్రోటీన్ – ప్రతి భోజనంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండేలా చూసుకునేవారట. తన బరువును బట్టి.. ఒక్కో కేజీకి 1.5 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకునేవారట.

6. నీళ్లు – శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉండేందుకు రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగేవారట.

7. స్నాక్స్ – బయట దొరికే చిరుతిళ్లకు బదులుగా.. 500 గ్రాముల పండ్లు తీసుకునేవారట.

8. డ్రై ఫ్రూట్స్ – రోజుకు రెండు వాల్​నట్స్, 5 బాదం తీసుకునేవారట. ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్​గా వీటిని ఫ్రూట్స్​ని తినేవారట.

9. భోజన సమయాలు – మధ్యాహ్న భోజనం 12.30కి, రాత్రి భోజనం 7లోపు ముగించేవారట.

10. నిద్ర సమయం – రోజూ రాత్రి 9.30కి పడుకుంటే.. ఉదయం 5.30కి లేచేవారట.

11. బ్రేక్​ఫాస్ట్ – ఉదయాన్నే రెండు దోశలు లేదా మూడు ఇడ్లీలు తినేవారట. వాటితో పాటు మూడు ఎగ్ వైట్స్, 125ml పాలు లేదా కాఫీ షుగర్ లేకుండా తీసుకునేవారట.

12. లంచ్ – 120 గ్రాముల అన్నం, వెజ్ లేదా నాన్​వెజ్ కర్రీ. అలాగే 100 గ్రాముల పెరుగు మధ్యాహ్న భోజనంలో తీసుకునేవారట.

13. 250 గ్రాముల తందూరి లేదా గ్రిల్ చేసిన చికెన్ తీసుకునేవారట.

14. కెలరీ ట్రాకింగ్ చేసేవారట.

ఇవన్నీ తాను బరువు తగ్గడంలో హెల్ప్ చేశాయంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. పృథ్వీ ఫాలో అయింది రొటీన్​లో చిన్న చిన్న మార్పులే. కానీ వాటిని సమయానికి ఫాలో అవుతూ.. లైఫ్​స్టైల్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల భారీ రిజల్ట్స్ చూశారు. మీరు కూడా 2026లో ఫిట్​నెస్ మీ గోల్ అనుకుంటే.. ఈ తరహా లైఫ్​స్టైల్ ప్లాన్ చేసుకోవచ్చు. అన్నీ ఇవే ఫాలో అవ్వాలని లేదు. మీ హెల్త్, మీ బరువు, మీ వర్క్​ లైఫ్​కి తగ్గట్లుగా దీనిని మార్చుకోవచ్చు.

భారతీయులకు బిగ్ షాక్.. డిసెంబర్ 15 నుండి అమలులోకి H-1B వీసా కొత్త నిబంధనలు

H-1B వీసా నిబంధనలు కఠినతరం చేసింది అమెరికా. H-1B వీసా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. H-1B వీసాలకు సోషల్ మీడియా ప్రొఫైల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం ఇదే తొలిసారి.

డిసెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ట్రంప్ ప్రభుత్వం అన్ని రాయబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు నుండి, సోషల్ మీడియా ప్రొఫైల్‌లను పబ్లిక్‌గా ఉంచాలనే నిబంధన F-1, M-1 మరియు J-1 స్టడీ వీసాలతో పాటు B-1, B-2 విజిటర్ వీసాలకు కూడా అమలు చేయడం జరుగుతుంది.

H-1B దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాల్సి ఉంటుంది. తద్వారా అమెరికా అధికారులు వారి ప్రొఫైల్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు, లైక్‌లను పరిశీలిస్తారు. దరఖాస్తుదారుడి సోషల్ మీడియా కార్యకలాపాలు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే H-1B వీసా జారీ నిలిపివేస్తారు. H-4 వీసాల కోసం H-1B ఆధారపడినవారు (జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులు) కూడా పబ్లిక్ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను నిర్వహించాల్సి ఉంటుందని వైట్ హౌజ్ అధికారులు ప్రకటించారు.

అమెరికా విదేశాంగ శాఖ కొత్త సోషల్ మీడియా పరిశీలన విధానం భారతదేశంలోని H-1B వీసా దరఖాస్తుదారులకు భారీగా ప్రభావం చూపిస్తోంది. అనేక నియామకాల వల్ల వీసా దరఖాస్తులు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి వీసా దరఖాస్తుదారులకు ఒక సలహా జారీ చేసింది. ‘మీ వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ చేసినట్లు మీకు ఇమెయిల్ అందితే, మీ కొత్త అపాయింట్‌మెంట్ తేదీలో మీకు సహాయం చేయడానికి మిషన్ ఇండియా ఎదురుచూస్తోంది’ అని అది పేర్కొంది.

గతంలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ తేదీన కాన్సులేట్‌కు వచ్చే ఏ వీసా దరఖాస్తుదారుడికైనా రీషెడ్యూల్ గురించి తెలియజేసిన తర్వాత ప్రవేశం నిరాకరిస్తామని రాయబార కార్యాలయం హెచ్చరించింది. ‘మీరు గతంలో షెడ్యూల్ చేసిన అపాయింట్‌మెంట్ తేదీకి చేరుకోవడం వలన మీకు రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌కు ప్రవేశం నిరాకరిస్తాము’ అని రాయబార కార్యాలయం తెలిపింది.

డిసెంబర్ మధ్య నుండి చివరి వరకు జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. అయితే, ఖచ్చితమైన సంఖ్య రీషెడ్యూల్‌ వివరాలను వెల్లడించలేదు. ప్రముఖ వ్యాపార వలస న్యాయ సంస్థకు చెందిన న్యాయవాది స్టీవెన్ బ్రౌన్ దీనిపై స్పందించారు. ‘మిషన్ ఇండియా మేము వింటున్న విషయాన్ని ధృవీకరిస్తోంది. రాబోయే వారాల్లో అనేక అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసి, సోషల్ మీడియా పరిశీలనకు వీలుగా మార్చికి వాటిని తిరిగి షెడ్యూల్ చేశారు’ అని అన్నారు.

అమెరికా ప్రభుత్వం H-1B వీసా దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన H-4 వ్యక్తుల కోసం స్క్రీనింగ్, పరిశీలన చర్యలను విస్తరించింది. వారి అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో గోప్యతా సెట్టింగ్‌లను ‘పబ్లిక్’గా ఉంచాలని వారిని ఆదేశించింది. వీసా దరఖాస్తుదారులలో అనుమతి లేని, అమెరికా జాతీయ భద్రతకు, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తించడానికి అధికారులు డిసెంబర్ 15 నుండి వారి ఆన్‌లైన్ ఉనికిని సమీక్షిస్తారు. విద్యార్థులు, సందర్శకులు ఇప్పటికే అలాంటి పరిశీలనకు గురయ్యారు.

ట్రంప్ సర్కార్ నుండి పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్న నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు ప్రాథమిక వలస మార్గం అయిన H-1B ప్రోగ్రామ్ తాజా పరిశీలన సోషల్ మీడియా స్క్రీనింగ్. సెప్టెంబర్‌లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త H-1B వర్క్ వీసాలపై ఒకేసారి $100,000 రుసుమును విధించారు. ఈ ఉత్తర్వు అమెరికాలో తాత్కాలిక ఉపాధిని కోరుకునే భారతీయులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.

ఆల్ టైమ్ రికార్డులు బద్దలు.. బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గిన వెండి ధర మళ్లీ రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఫలితంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ..

కిలో వెండి రూ.2లక్షలు దాటేసింది..

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 800 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై ఏకంగా 18డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,206 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధర రికార్డుల మోత మోగిస్తోంది. కిలో వెండిపై ఇవాళ ఏకంగా రూ.8వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2లక్షలు దాటేసింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈనెల చివరి నాటికి వెండి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,19,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,30,310కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,600 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,30,460కు చేరింది.
ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,20,300 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,31,240కు చేరింది.
వెండి ధర ఇలా..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.8వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,07,000 వద్దకు చేరింది.
ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,99,000 వద్దకు చేరింది.
చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,07,000 వద్దకు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ప్రమాదకరం.. నిద్రలేమి, డిప్రెషన్​తో పాటు తీవ్ర నష్టాలు, జాగ్రత్త

 స్మార్ట్ఫోన్కు బానిస అవ్వడం వల్ల పెద్దలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. క్రమంగా ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది.

స్మార్ట్​ ఫోన్​కి బానిసైపోతున్న చిన్నారులు ఎందరో. ఇదే గనుక మీ పిల్లలకు ఉంటే.. జాగ్రత్త. ఎందుకంటే అది తీవ్రమైన నష్టాలతో.. మరింత ప్రమాదకరంగా మారుతుంది. తాజా అధ్యయనం ప్రకారం.. పిల్లలకు చిన్న వయస్సులోనే ఫోన్ ఇస్తే.. వారు అనేక నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి పిల్లలలో నిద్ర లేకపోవడం, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయట.

అధ్యయనంలో షాకింగ్ విషయాలు

అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మొబైల్ ఉపయోగించే వ్యసనం ఉంటే.. వారిలో నిద్ర సమస్యలు, బరువు పెరగడం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నట్లు తేలింది. అధ్యయనం ప్రకారం.. ఫోన్ కారణంగా పిల్లల దినచర్య దెబ్బతింటుంది. దీనివల్ల ఇతర సమస్యలు మొదలవుతాయి. ఫోన్ ఉన్న పిల్లలు రాత్రిపూట స్క్రోలింగ్ చేస్తూ తక్కువ నిద్రపోతారు. స్క్రీన్ సమయం కారణంగా శారీరక శ్రమ తగ్గిపోతుంది. దీనితో పాటు సోషల్ మీడియాలోని నెగిటివ్ కంటెంట్ పిల్లల మనస్సుపై ప్రభావం చూపుతుంది. దానిని వారి మనస్సు అర్థం చేసుకోవట్లేదని.. దీనివల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించారు.

అధ్యయనంలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఫోన్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నారని.. కానీ వారు సోషల్ మీడియాలో చూసే కంటెంట్ ఇంపాక్ట్ వారిపై రకారకాలుగా ఉంటుందని తెలిపారు. చిన్న వయస్సులోనే స్మార్ట్ఫోన్ ఇస్తే వారికి నైపుణ్యాలు అభివృద్ధి చెందవని తెలిపారు.

నష్టాలను నివారించే మార్గం ఇదే

భద్రత లేదా ఆన్​లైన్ స్టడీ వంటి ఇతర కారణాల వల్ల చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తున్నారు. అలాంటి పేరెంట్స్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వారి నుంచి ఫోన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మొబైల్ యాప్స్ కంట్రోల్ పేరెంట్స్​ సెట్ చేయాలని.. సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచాలని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో రీచ్ కోసం చాలామంది పేరెంట్స్ తమ పిల్లల ప్రైవసీని సోషల్ మీడియాలో పెడుతున్నారని.. అది ఏమాత్రం మంచిది కాదని.. పిల్లల సేఫ్టీ కూడా దీనిపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. పిల్లలకు ఇలా ఐడీలు క్రియేట్ చేయడం వల్ల దానికి వచ్చే నెగిటివ్ కామెంట్స్ వారిపై తెలియకుండానే ప్రభావితం చూపిస్తుంది.

పిల్లలకు స్క్రీన్ సమయాన్ని సెట్ చేయాలని చెప్తున్నారు. మొబైల్ గేమ్స్ కంటే.. బయట గేమ్స్ ఆడేలా ప్రోత్సాహించాలి. పిల్లల డిస్టర్బెన్స్ ఉండొద్దని.. వారికి ఫోన్ ఇచ్చేయడం చేయకుండా.. పిల్లలతో కూర్చొని మాట్లాడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారి మానసిక పరిస్థితి మెరుగవుతుంది. అలాగే స్టడీపై ఆసక్తి కూడా పెరిగే అవకాశం ఉంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

భార్యాభర్తల కోసం అద్భుతమైన స్కీమ్‌.. రూ.2 లక్షల డిపాజిట్‌పై రూ.90 వేల వడ్డీ

బ్యాంకుల్లో నిరంతరం తగ్గుతున్న వడ్డీ రేట్ల మధ్య, సురక్షితమైన, అధిక రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు పోస్ట్ ఆఫీస్ ఉత్తమ ఎంపికగా ఉంది.

రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును తగ్గించినప్పటికీ, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పథకం ఇప్పటికీ 7.5% వరకు బంపర్ వడ్డీని అందిస్తోంది. భార్యాభర్తలు కలిసి ఉమ్మడి ఖాతాలో డబ్బు పెట్టుబడి పెడితే, వారు మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తాన్ని పొందవచ్చు. 2 లక్షల పెట్టుబడిపై రాబడి పూర్తి గణితాన్ని తెలుసుకుందాం.

ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును నిరంతరం తగ్గిస్తూనే ఉంది. ఈ సంవత్సరం 0.25% తగ్గింపు జరగడం ఇది నాల్గవసారి, మొత్తం తగ్గింపు 1.25%కి చేరుకుంది. ఇది బ్యాంకింగ్ రంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. దాదాపు అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే ఉపశమనం ఏమిటంటే పోస్టాఫీస్ తన కస్టమర్లకు వడ్డీ రేట్లను మార్చకుండా, అధికంగా ఉంచింది. సురక్షితమైన పెట్టుబడి కోసం పోస్టాఫీసే ఇప్పటికీ ప్రజల మొదటి ఎంపిక.

భార్యాభర్తల ఉమ్మడి ఖాతాలో రూ.89,990 ప్రయోజనం:

మీరు మీ భార్యతో కలిసి ఉమ్మడి ఖాతా తెరిచి, అందులో రూ.2,00,000 (రెండు లక్షలు) 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మీకు 7.5% చక్రవడ్డీ రేటుతో భారీ లాభం లభిస్తుంది. లెక్కింపు ప్రకారం, 5 సంవత్సరాల చివరిలో మీకు రూ.89,990 వడ్డీ మాత్రమే లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయంలో మీ మొత్తం మొత్తం రూ.2,89,990 అవుతుంది.

ఈ పథకం ఎందుకు ఉత్తమమైనది?

ప్రస్తుతం దేశంలోని చాలా బ్యాంకులు 5 సంవత్సరాల FDలపై 7.5% వరకు వడ్డీని అందించడం లేదు. పోస్టాఫీసు ప్రభుత్వ భద్రతతో పాటు ఈ రాబడిని అందిస్తోంది. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే టైమ్ డిపాజిట్ పథకంలో సాధారణ పౌరులు, సీనియర్ పౌరులకు వడ్డీ రేట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి (కొన్ని ఇతర పథకాలలో, సీనియర్ పౌరులు 0.50% ఎక్కువ ప్రయోజనం పొందుతారు). అందువల్ల ఈ పథకం రిస్క్-ఫ్రీ, స్థిర రాబడికి అద్భుతమైన ఎంపిక.

తక్కువ వడ్డీకి HDFC బ్యాంక్‌ నుంచి రూ.60 లక్షల హోమ్‌ లోన్‌ కావాలంటే ఎంత జీతం ఉండాలి? పూర్తి వివరాలు ఇవే..

ప్రస్తుత కాలంలో ఇల్లు కొనాలని ఎవరు చూస్తున్నా.. హోమ్‌ లోన్‌ గురించి తప్పక ఆలోచిస్తారు. దేశంలోని చాలా మంది ప్రజలు తమ కలల ఇంటిని పొందడానికి గృహ రుణాలపై ఆధారపడతారు.

అన్ని ఇతర రుణాలతో పోలిస్తే హోమ్‌ లోన్లు లాంగ్‌ డ్యూరెషన్‌తో ఉంటాయి. అందువల్ల వడ్డీ రేటు అత్యల్పంగా ఉంటుంది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన HDFC బ్యాంక్ ప్రస్తుతం 7.90 శాతం వడ్డీ రేటుతో ప్రారంభమయ్యే గృహ రుణాలను అందిస్తోంది.

ఈ సంవత్సరం ఆర్‌బిఐ రెపో రేటును బాగానే తగ్గించింది, దీని కారణంగా మార్కెట్లో గృహ రుణాలు సహా ఇతర రుణాల వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. ఆర్‌బిఐ నిర్ణయం తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం కలిగించింది. రూ.60 లక్షల గృహ రుణం పొందడానికి అవసరమైన జీతం గురించి మాట్లాడుకుంటే, మీరు 30 సంవత్సరాల కాలానికి రూ.60 లక్షల గృహ రుణం తీసుకోవాలనుకుంటే, మీ నెలవారీ జీతం 7.90 శాతం వడ్డీ రేటుతో కనీసం రూ.88,000 ఉండాలి. మీ పేరు మీద ఇప్పటికే ఏదైనా ఇతర రుణం ఉంటే, అది రుణ పరిమితి, అర్హతపై ఎఫెక్ట్‌ చూపిస్తుంది.

60 లక్షల రుణంపై ఈఎంఐ ఎంత ఉంటుందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, HDFC బ్యాంక్ 7.90 శాతం వడ్డీ రేటు, 30 సంవత్సరాల కాలపరిమితితో రూ.60 లక్షల గృహ రుణంపై ప్రతి నెలా దాదాపు రూ.44,000 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. రుణ ఆమోదం, వడ్డీ రేట్లను నిర్ణయించడంలో క్రెడిట్ స్కోరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ క్రెడిట్ స్కోరు పేలవంగా ఉంటే, బ్యాంకు మీ రుణ దరఖాస్తును తిరస్కరించవచ్చు. మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉంటే, మీరు బ్యాంకుతో తక్కువ వడ్డీ రేటు కోసం కూడా చర్చలు జరపవచ్చు.

ఆ కరెన్సీ ఇకపై చెల్లదా? దేశ ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ RBI ఎలాంటి క్లారిటీ ఇచ్చిందంటే..

2016 నుంచి కరెన్సీ ముద్రణ, ఉపసంహరణ, రద్దు వంటి వాటి గురించి ఎప్పుడూ చర్చ ఉండనే ఉంటుంది. అయితే తాజాగా నాణేల ముద్రణ నిలుపుదల గురించి తీవ్ర చర్చ అయితే జరుగుతోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఆర్‌బిఐ అధికారిక వాట్సాప్ నంబర్‌కు పంపిన కొత్త సందేశంలో నాణేల గురించి వ్యాపించే ఎలాంటి తప్పుడు సమాచారం లేదా పుకార్లను ప్రజలు నమ్మవద్దని కేంద్ర బ్యాంకు స్పష్టంగా పేర్కొంది.

గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ పుకార్లు వ్యాపించాయి. ప్రత్యేకంగా రూపొందించిన రెండు రూపాయల నాణెం ఇప్పుడు చెలామణిలో లేదని కొందరు వాదిస్తున్నారు, మరికొందరు చిన్న ఒక రూపాయి నాణెం నకిలీదని వాదిస్తున్నారు, మరికొందరు 50 పైసల నాణెం నిలిపివేయబడిందని నమ్ముతారు. ఈ అపోహలన్నింటినీ RBI పూర్తిగా తోసిపుచ్చింది. వివిధ విలువల నాణేల డిజైన్లు భిన్నంగా ఉంటాయని, అన్ని డిజైన్లు చెల్లుబాటు అవుతాయని కేంద్ర బ్యాంకు తెలిపింది. డిజైన్‌లో మార్పు చేసినంత మాత్రాన నాణెం చెల్లదు. 50 పైసలు, 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల విలువల నాణేలన్నీ ప్రస్తుతం చట్టబద్ధమైనవని, లావాదేవీలలో ఆమోదించబడాలని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

నాణేలు చాలా కాలం పాటు చెలామణిలో ఉన్నందున, పాత డిజైన్లు కూడా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో లేదా స్థానిక స్థాయిలో ధృవీకరణ లేకుండా వ్యాప్తి చెందుతున్న ఏవైనా వాదనలను నమ్మవద్దని బ్యాంక్ ప్రజలను కోరింది. నిజమైన, నకిలీ కరెన్సీ, కొత్త నియమాలు, పద్ధతుల గురించి ప్రజలకు కచ్చితమైన సమాచారం లభించేలా సెంట్రల్ బ్యాంక్ కాలానుగుణంగా వాస్తవ తనిఖీ, అవగాహన సందేశాలను విడుదల చేస్తుంది. ఈ కొత్త సందేశంతో అన్ని నాణేలు చెల్లుబాటు అయ్యేవని, ఎటువంటి పుకార్ల ద్వారా తప్పుదారి పట్టించవద్దని RBI మరోసారి ప్రజలకు హామీ ఇచ్చింది.

భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.బూమ్రా సంచలన రికార్డు

భారత ఫాస్ట్ బౌలింగ్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా సౌతాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో బంతిని అందుకోగానే మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో అతను తన మొదటి వికెట్ తీయగానే, టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ భారతీయ బౌలర్‌ కూడా సాధించని అరుదైన రికార్డును నెలకొల్పాడు.

సౌతాఫ్రికా మ్యాచ్‌లో బుమ్రా తన మొదటి వికెట్‌ను తీయడం ద్వారా తన టీ20 కెరీర్‌లో 100 వికెట్ల మైలురాయిని పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారతీయ బౌలర్‌లలో అర్ష్‌దీప్ సింగ్ తర్వాత బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. అయితే బుమ్రా ఈ మైలురాయిని కేవలం 81 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే అందుకోవడం విశేషం. ఇది అతని నిలకడైన, అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్‌కు నిదర్శనం.

ఈ రికార్డులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో (టెస్ట్, వన్డే, టీ20) 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా ఇప్పటికే టెస్టుల్లో 234 వికెట్లు, వన్డేల్లో 149 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్‌లలో 100+ వికెట్లు తీసిన బౌలర్ల జాబితా ప్రపంచ క్రికెట్‌లో చాలా చిన్నదిగా ఉంది. ఇప్పుడు ఆ అరుదైన జాబితాలో భారత క్రికెట్ తరపున బుమ్రా పేరు కూడా చేరింది.

ప్రపంచవ్యాప్తంగా బుమ్రాకు ముందు ఈ ఘనత సాధించిన బౌలర్లు వీరే:

లసిత్ మలింగ (శ్రీలంక): టెస్ట్ (101 వికెట్లు), వన్డే (338 వికెట్లు), టీ20 (107 వికెట్లు)

టిమ్ సౌథీ (న్యూజిలాండ్): టెస్ట్ (391 వికెట్లు), వన్డే (221 వికెట్లు), టీ20 (164 వికెట్లు)

షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్): టెస్ట్ (246 వికెట్లు), వన్డే (317 వికెట్లు), టీ20 (149 వికెట్లు)

షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్): టెస్ట్ (121 వికెట్లు), వన్డే (135 వికెట్లు), టీ20 (126 వికెట్లు)

జస్ప్రీత్ బుమ్రా (భారత్): టెస్ట్ (234 వికెట్లు), వన్డే (149 వికెట్లు), టీ20 (101* వికెట్లు)

మలబద్ధకం + షుగర్ + బరువు తగ్గడం అన్నింటికీ సింపుల్ చిట్కా

న వంటగదిలోనే ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మసాలాలు ఉంటాయి. ఆహారాన్ని రుచిగా మార్చడానికి ఉప్పు, మిరియాలు, పసుపును ఉపయోగిస్తారు. వీటితో పాటు కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా వాడుతుంటారు.

ఇవి వంటకి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే ఇంకోకటి ఉంది. అదే కసూరి మేథీ. దీన్ని మనం ఎన్నో వంటల్లో ఉపయోగిస్తాం. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కసూరి మేథీ అంటే.. ఎండిన మెంతి ఆకుల పొడి. ఆయుర్వేదంలో మెంతి ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు. మెంతి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, అలాగే ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇక, కసూరి మేథీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో వ్యాధులకి చెక్ పెట్టడంలో సాయపడుతుంది. కసూరి మేథీని ఎలా తినాలి, ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, దీని పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది

కసూరి మేథీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సహజంగా డయాబెటిస్‌ని నియంత్రించడంలో సాయపడుతుంది. ఈ ఎండిన ఆకులు రక్తంలో షుగర్ లెవల్స్‌ని నియంత్రించే లక్షణాల్ని కలిగి ఉంటాయి. ఈ ఆకులు డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని కంట్రోల్ ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచడం ద్వారా, ఇది టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో సాయపడతుంది.

మలబద్ధకానికి చక్కటి పరిష్కారం

ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఫైబర్ అధికంగా ఉండే కసూరి మెథీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. దీనిని తినడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం చికిత్సకు బాగా సాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్న కసూరి మేథి మంటను నియంత్రిస్తుంది. కడుపు ఉబ్బరం సమస్య నుంచి రిలీఫ్ అందిస్తుంది. దీంతో గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సమస్యల్ని తగ్గించడంలో ప్రభావాన్ని చూపుతుంది.

ఊబకాయం

నేటి తరంలో ఊబకాయం దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. ఊబకాయంతో బాధపడుతూ.. బరువు తగ్గాలనుకునేవారికి కసూరి మేథీ బెస్ట్ ఆప్షన్. ఈ ఆకుల్ని తినడం వల్ల బరువుని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఈ ఎండిన ఆకులు ఆకలిని నియంత్రించే జీవక్రియను పెంచే లక్షణాల్ని కలిగి ఉంటాయి. జీవక్రియను వేగవంతం చేయడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. ఈ ఆకులు బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది

కసూరీ మేథీని వంటల్లో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించవచ్చు. ఈ ఆకులు చెడు కొలెస్ట్రాల్ (LDL)ను నియంత్రించే లక్షణాలను కలిగి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రించి.. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో సాయపడతుంది. దీంతో, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇతర ప్రయోజనాలు

ఎండిన మెంతి ఆకులు రుతువిరతి, హార్మోన్ల మార్పులకు చికిత్స చేయడంలో సాయపడతాయి. ఇవి మహిళలకు అత్యంత సాధారణ సమస్యలు. మెంతి ఆకుల్లో కనిపించే సమ్మేళనాలు హార్మోన్ల మార్పులను నియంత్రించడంలో సాయపడతాయని నిపుణులు అంటున్నారు. తల్లి పాలను పెంచడానికి కసూరి మేథీ తీసుకోండి. కసూరి మేథీలో లభించే సమ్మేళనం పాలిచ్చే స్త్రీలలో పాలను పెంచడానికి సాయపడుతుంది.

కసూరి మేథీ ఎలా తీసుకోవాలి?

కసూరి మేథీని వంటల్లో తీసుకోవచ్చు. గరిష్ట ప్రయోజనాలను పొందడానికి, మీరు దీన్ని సలాడ్‌లు లేదా సూప్‌లలో జోడించవచ్చు. ప్రత్యామ్నాయంగా.. ఒక టీస్పూన్ కసూరి మేథీని ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగవచ్చు. ఇక, పుల్కాలు లేదా చపాతీలు చేసుకునేటప్పుడు ఒక టీస్పూన్ కసూరి మేథీ కలపాలి. ఆ పిండితో చపాతీలు లేదా పుల్కాలు చేసుకుని తింటే ఆరోగ్యం మెరుగుపుడుతుంది. ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది.

అసైన్డ్ భూములపై,,,,పునఃపరిశీలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను పునఃపరిశీలించాలని నిర్ణయించారు.

గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు 5,28,217 గ్రీవెన్సులు రాగా.. అందులో 4,55,189 గ్రీవెన్సులు పరిష్కరించినట్లు తెలిపారు. మరో 73 వేల వరకు గ్రీవెన్సులు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, సీసీఎల్ఏ అధికారులు హాజరయ్యారు.

పీజీఆర్ఎస్ సహా 22ఏ, ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములు, రీ సర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమ్యూటేషన్ ప్రక్రియ వేగవంతమైందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తులు 6,846 అని వెల్లడించింది. కాగా ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములను 22ఏ నుంచి తొలిగించినట్లు వెల్లడించింది. 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి అయిందని.. వెబ్ ల్యాండ్ 2.0లో వివరాలు నమోదు చేశారని పేర్కొంది. కాగా, రీసర్వేలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్‌గ్రెడేషన్ చేసినట్లు చెప్పింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో రెవెన్యూ సేవలను సులభతరం చేయాలని సంబంధిత శాఖ ఉన్నాతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రియల్ టైమ్‌లో ఆటోమ్యుటేషన్ పూర్తి కావాలని ఆదేశించారు. పట్టదార్ పాస్ పుస్తం కోసం భూముల యజమానులు ఆఫీసులకు చుట్టూ తిరగకూడదని సూచించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక ఆదేశాల అమలుపై ప్రతి నెల రెవెన్యూ శాఖపై సమీక్ష చేస్తానని సీఎం చెప్పారు. కాగా, భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకోసం ప్రయత్నిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తున్నామని.. రాష్ట్రంలో జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇక భూ సమస్యలకు ఇకపై జాయింట్ కలక్టర్లే బాధ్యులు అని చెప్పారు.

డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.15వేలు ఇస్తున్నారు, నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డ్వాక్రా సంఘాలకు తీపికబురు చెప్పింది.. వారందరికి రివాల్వింగ్‌ ఫండ్‌ ప్రకటించారు.. ఒక్కో సంఘానికి రూ.15 వేలు ఇస్తారు.

ఈ మేరకు రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 వేల కొత్త డ్వాక్రా సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.15 వేల చొప్పున ఈ నిధిని అందిస్తారు. ఈ డబ్బును సంఘ సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది సంఘం ఖాతాలోనే నిల్వ ఉంటుంది.

ఈ రివాల్వింగ్ ఫండ్ ద్వారా సంఘం నిధిని పెంచుకోవచ్చు. సభ్యుల అవసరాలకు అనుగుణంగాడ్వాక్రా సంఘంలోపలే అప్పులు మంజూరు చేసుకోవచ్చు. అంతేకాకుండా, బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తంలో రుణం పొందడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. త్వరలోనే ఈ నిధులు సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటికే జిల్లాలకు సంఘాల జాబితాను పంపించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయండ్వాక్రా సంఘాలఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.

డిప్యూటీ సీఎం మాటామంతి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ నేడు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో మాటామంతీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘జెడ్పీ సీఈవోలు, డ్వామా పీడీలు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు, జడ్పీ డిప్యూటీ సీఈవోలు, డీడీఓలు, డీఎల్‌పీవోలు హాజరు కావాలి’ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఆదేశించారు.ఏపీలో వారికి స్కాలర్‌షిప్‌లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పీఎంజీఎస్‌వై (ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన) పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన రోడ్లకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు బిల్లులు చెల్లించే నిమిత్తం రూ.47.84 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇటు సమగ్ర శిక్షా అభియాన్‌ ఉపకారవేతనాలను కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు విడుదల చేశారు. ఈ మేరకు ఒక్కొక్క విద్యార్థినికి నెలకు రూ.100 చొప్పున 10 నెలలకు కలిపి రూ.వెయ్యి విడుదల చేసింది. మొత్తం 1,07,580 మంది విద్యార్థినులు రూ.10.76 కోట్లు విడుదలయ్యాయి.స్టాంపు రుసుము మినహాయింపు

ఏపీ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ పీవీ ఉత్పత్తి ప్లాంట్‌కు స్టాంపు రుసుము మినహాయింపు ఇచ్చింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో ఇండోసోల్‌ సోలార్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ పీవీ మాడ్యూల్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కరేడులో 8,348 ఎకరాలు, గుడ్లూరు మండలం చేవూరులో 114.5 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించారు.. ఈ మేరకు షిర్డీసాయి అనుబంధ సంస్థ సూర్యచక్ర డెవలపర్స్‌కు 798.98 ఎకరాల భూమి కేటాయించారు. అయితే రూ.12.19 కోట్ల స్టాంపు రుసుము మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్రీయ, నవోదయ స్కూళ్లలో 14,967 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్‌

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS).. దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో భారీగతా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి ఇటీవల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 14,967 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హతత కలిగిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు గడువు మరో 2 రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు డిసెంబర్‌ 11, 2025వ తేదీ తుది గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నియామక ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, నైపుణ్య పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నిజానికి, గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు డిసెంబర్‌ 4, 2025వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే ఈ గడువును డిసెంబర్‌ 11 వరకు కేంద్రం ప్రకటించింది.

దేశం వ్యాప్తంగా మొత్తం 1,288 కేంద్రీయ విద్యాలయాలు, మొత్తం 653 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు దేశంలో ఎక్కడైనా, గ్రామీణ, పట్టణ, రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో పని చేయాల్సి ఉంటుంది. టైర్‌1, టైర్‌2, టైపింగ్/స్టెనోగ్రఫీ/ట్రాన్స్‌లేషన్‌ నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. PRT, TGT పోస్టులకు CTET అర్హత తప్పనిసరి.

పోస్టుల వివరాలు ఇవే..

  • అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల సంఖ్య: 17
  • ప్రిన్సిపల్ పోస్టుల సంఖ్య: 227 (KVS 134 + NVS 93)
  • వైస్ ప్రిన్సిపల్ పోస్టుల సంఖ్య: 58 (KVS)
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs) పోస్టుల సంఖ్య: 2,996
  • ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs) పోస్టుల సంఖ్య: 6,215
  • ప్రైమరీ టీచర్ – PRT పోస్టుల సంఖ్య: 2,684
  • PRT (సంగీతం) పోస్టుల సంఖ్య: 187
  • స్పెషల్ ఎడ్యుకేటర్ (పీఆర్‌టీ) పోస్టుల సంఖ్య: 494
  • లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య: 147 (KVS 147)
  • KVS బోధనేతర పోస్టుల సంఖ్య: 1,155
  • NVS బోధనేతర పోస్టుల సంఖ్య: 787

టాటాల నుంచి దేశంలోనే తొలిసారిగా కొత్త పథకం.. కనీసం రూ. 5 వేలతో చేరొచ్చు

స్టాక్ మార్కెట్లలో ఐపీఓ మాదిరిగానే.. మ్యూచువల్ ఫండ్లలో ఎన్ఎఫ్ఓ ఉంటుంది. అక్కడ కంపెనీలు తొలిసారిగా షేర్ల విక్రయం ద్వారా పబ్లిక్‌లోకి వస్తే.. ఇక్కడ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు మూలధనాన్ని సేకరించేందుకు కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాల్ని ప్రకటిస్తుంటాయి.

ఎన్ఎఫ్ఓ సమయంలో మ్యూచువల్ ఫండ్ యూనిట్స్.. సాధారణంగా స్థిరమైన, నామమాత్రపు ధరకు అందిస్తాయి. ముందుగా ఎన్ఎఫ్ఓ పీరియడ్ సమయంలోనే తక్కువ ధరకు యూనిట్లు అందుబాటులో ఉంటాయి. ఈ పీరియడ్ అయిపోయాక.. మళ్లీ రెగ్యులర్‌గా కొనుగోళ్ల కోసం అందుబాటులో ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు దేశంలోనే దిగ్గజ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ఒకటిగా ఉన్నటువంటి టాటా మ్యూచువల్ ఫండ్ నుంచి కీలక ప్రకటన వచ్చింది.

>> వినూత్న ముందడుగు వేస్తూ.. టాటా మ్యూచువల్ ఫండ్ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఫస్ట్ మల్టీ- క్యాప్ కన్పంప్షన్ (వినియోగ) ఇండెక్స్ ఫండ్ ప్రారంభించింది. దీనిని టాటా బీఎస్ఈ మల్టీక్యాప్ కన్సంప్షన్ 50:30:20 ఇండెక్స్ ఫండ్ పేరుతో లాంఛ్ చేసింది. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఒకే ఉత్పత్తి ద్వారా పెట్టుబడిదారులకు.. వినియోగరంగంలోని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో వైవిధ్యభరితమైన పెట్టుబడి అవకాశాల్ని కల్పిస్తుంది. ఈ ఎన్ఎఫ్ఓ సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచారు. డిసెంబర్ 23 లాస్ట్ డేట్‌గా ఉంది.

సాధారణంగా కన్సంప్షన్ ఇండెక్స్‌లు లార్జ్ క్యాప్స్, FMCG లేదా ఆటో స్టాక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. దీన్ని సరిదిద్దుకునేందుకే టాటా మ్యూచువల్ ఫండ్.. ప్రత్యేక మోడల్‌లో 50:30:20 మోడల్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ స్థిరత్వం కోసం 50 శాతం లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో.. మెరుగైన వృద్ధి సామర్థ్యం కోసం 30 శాతం మిడ్ క్యాప్ స్టాక్స్‌లో.. అధిక వృద్ధి అవకాశాల కోసం 20 శాతం స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులకు కేటాయిస్తుంది.

ప్రధానంగా వినియోగ రంగం స్టాక్స్‌పై దృష్టి సారిస్తుంది. భారతదేశ జీడీపీలో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ వాటాను ఇదే అందిస్తుంది. అందుకే ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తూ కొత్త మోడల్‌లో ఈ స్కీమ్ తెచ్చినట్లు టాటా అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆనంద్ వరదరాజన్ చెప్పారు. ఈ ఫండ్ ద్వారా.. క్విక్ కామర్స్, డిజిటల్ ఎంటర్‌టైన్మెంట్, ట్రావెల్ ఇలా న్యూ ఏజ్ వినియోగ రంగాల్లో పెట్టుబడి పెట్టొచ్చు.

ఈ పథకం పనితీరుకు బీఎస్ఈ మల్టీక్యాప్ కన్సంప్షన్ 50:30:20 ఇండెక్స్ కొలమానంగా ఉంది. ఫండ్ మేనేజర్లుగా నితిన్ భారత్ శర్మ, రాకేష్ ప్రజాపతి వ్యవహరిస్తారు. ఇందులో కనీసం రూ. 5 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆపై ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

SUV లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. కొత్త ఏడాదిలో కార్‌ కొనాలని అనుకున్న వాళ్లకే పండగే! కళ్లు చెదిరే మోడల్స్‌ లాంచ్‌

SUVల పట్ల క్రేజ్ పెరుగుతోంది. అందుకే ఆటో కంపెనీలు ఈ విభాగంపై దృష్టి సారించి కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. 2025లో అనేక SUV మోడల్స్ లాంచ్‌ అయ్యాయి.

ఇప్పుడు కంపెనీలు వచ్చే సంవత్సరానికి సిద్ధమవుతున్నాయి. మీరు వచ్చే ఏడాది కొత్త ఎలక్ట్రిక్ SUV ని కొనుగోలు చేయాలనుకుంటే 2026లో కస్టమర్ల కోసం ఏ SUV లను విడుదల చేస్తున్నారో ఓ లుక్కేయండి. టయోటా వచ్చే ఏడాది అర్బన్ క్రూయిజర్ BEV ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వాహనం ఏ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుందో, ఈ ఎలక్ట్రిక్ SUV బ్యాటరీ సామర్థ్యం ప్రస్తుతానికి వెల్లడించలేదు.

టాటా సియెర్రా EV

టాటా మోటార్స్ కొత్త SUV సియెర్రా, ICE వెర్షన్‌ను ప్రారంభించిన తర్వాత, కంపెనీ ఇప్పుడు 2026 ప్రారంభంలో వాహనం, పూర్తి-ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. సియెర్రా EV బ్యాటరీ సిస్టమ్, ఎలక్ట్రికల్ సెటప్ వంటి కర్వ్ EV, హారియర్ EV లతో కొన్ని కీలక లక్షణాలను పంచుకుంటుందని భావిస్తున్నారు.

మహీంద్రా XUV 3XO EV

మహీంద్రా తన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ లైనప్‌ను వచ్చే ఏడాది XUV 3XO EVతో విస్తరించవచ్చు. ఈ వాహనం టాటా పంచ్ EVకి పోటీగా నిలవవచ్చు, బ్రాండ్ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనంగా స్థానం పొందవచ్చు. దీనిని రెండు బ్యాటరీ ఎంపికలలో అందించవచ్చు, ఎలక్ట్రిక్ SUV ఒకే ఛార్జ్‌పై 450 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ పరిధిని అందించగలదు.

మహీంద్రా బిఇ రాల్-ఇ

మహీంద్రా BE Rall E అనేది అడ్వెంచర్-సెంట్రిక్ ఎలక్ట్రిక్ SUV, దీని ప్రొడక్షన్ వెర్షన్ 2026 నాటికి విడుదల కానుంది. బ్రాండ్ INGLO ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన ఈ SUV గణనీయమైన మెకానికల్ అప్‌డేట్‌లతో పాటు ఆఫ్-రోడ్-ప్రేరేపిత డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు, అయితే దీని ఇంటీరియర్ BE 6 మాదిరిగానే ఉంటుంది.

అఖండ-2 రిలీజ్. అభిమానులే గెలిచారు

త గురువారం మరి కొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రిమయర్స్ పడాల్సి ఉండగా.. అనూహ్యంగా అఖండ-2 సినిమాకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు ఉదయానికన్నా షోలు మొదలవుతాయేమో అనుకుంటే అదీ జరగలేదు.

ఒక రోజు ఆలస్యంగా కూడా సినిమా రిలీజ్ కాలేదు. దీంతో బాలయ్య కెరీర్లో మోస్ట్ హైప్డ్ మూవీకి ఇలా జరిగిందేమిటా అని నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇక అప్పట్నుంచి కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈరోస్ సంస్థతో 14 రీల్స్ అధినేతలకు ఫైనాన్స్ వివాదం కోర్టు వరకు వెళ్లడం వల్లే సినిమా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఆ ఇష్యూ సెటిల్ కావడానికి మూణ్నాలుగు రోజులు సమయం పట్టింది. దీంతో కొత్త డేట్ కోసం క్రిస్మస్ సీజన్‌ను చూసుకుందామని మేకర్స్ అనుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లలో చాలామంది ఆ డేటే వద్దనుకున్నారు. బాలయ్య అభిమానులు సైతం అన్ని రోజులు వెయిట్ చేయలేమని.. 12నే సినిమాను రిలీజ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇందుకోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ కూడా చేశారు.

చివరికి అభిమానుల పంతమే గెలిచింది. 12నే సినిమా రిలీజ్ కాబోతోంది. ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ కూడా పడబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య తన అభిమానుల అభిప్రాయాలకు ఎంత విలువ ఇస్తారో తెలిసిందే. దీనికి తోడు ఆన్ లైన్లో అభిమానులు ట్రెండ్ చేసే క్రమంలో చూపించిన అగ్రెషన్ చూసి మేకర్స్ భయపడ్డట్లే ఉన్నారు. 12న రిలీజ్ చేయడం ఒక దశలో అసాధ్యం అనిపించినా సరే.. చకచకా అన్ని ఏర్పాట్లు చేసుకుని సినిమాను శుక్రవారమే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు.

సినిమా వాయిదా పడడం అందరికీ తీవ్ర ఆవేదన కలిగించినప్పటికీ.. మరీ ఆలస్యం కాకుండా వారం వ్యవధిలోనే రిలీజ్ కాబోతుండడం గొప్ప ఉపశమనమే. మధ్యలో వచ్చిన బ్రేక్ వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కొంత నష్టం తప్పలేదు. కానీ సినిమాకు మంచి టాక్ వస్తే.. ఆ నష్టాన్ని రికవర్ చేయడం కష్టమేమీ కాదు. నందమూరి అభిమానులు ముందుకన్నా ఎక్కువగా ఈ సినిమాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు. ‘అఖండ-2’ అఖండమైన విజయం సాధించాలని ఇండస్ట్రీ అంతా కూడా బలంగా కోరుకుంటోంది.

వారణాసి: కరగాల్సిందే, కొత్తగా మెరవాల్సిందే.

టాలీవుడ్ లో రాజమౌళితో సినిమా చేయాలని కోరుకోని హీరో ఉండరు. ఆయనతో సినిమా అంటే గ్లోబల్ ఇమేజ్ గ్యారెంటీ. కానీ ఆ క్రేజ్ వెనుక హీరోలు పడే కష్టం అంతా ఇంతా కాదు.

అవుట్ పుట్ కోసం నటీనటులను పిండేస్తారని, పర్ఫెక్షన్ కోసం చుక్కలు చూపిస్తారని రాజమౌళికి ఇండస్ట్రీలో ఒక పేరుంది. గతంలో ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ వంటి హీరోలు కూడా జక్కన్న పెట్టే పని గురించి సరదాగా భయపడుతూనే చెప్పారు. ఇప్పుడు ఆ వంతు సూపర్ స్టార్ మహేష్ బాబుకి వచ్చింది. వారణాసి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం వస్తున్న వార్తలు చూస్తుంటే మహేష్ బాబు వారణాసి సినిమా కోసం తన కెరీర్ లోనే ఎప్పుడూ పడనంత కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. దానికి కారణం సినిమాలో ఉన్న పాత్రలే. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా 5 విభిన్న అవతారాల్లో కనిపించబోతున్నారట. రాముడు, రుద్ర పాత్రలతో పాటు మరో మూడు గెటప్స్ కూడా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్.

అసలు ఇన్నేళ్ల కెరీర్ లో మహేష్ బాబు ఎప్పుడూ ద్విపాత్రాభినయం కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 5 పాత్రలు అంటే మాటలు కాదు. ఒక్కో పాత్రకు ఒక్కో బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ చూపించాలి. ఒక్క పాత్ర ఉంటేనే వంద టేకులు తీసుకునే రాజమౌళి, ఇప్పుడు 5 పాత్రలంటే మహేష్ ను ఇంకెంత కష్టపెడతారో అని ఫ్యాన్స్ సరదాగా చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా ఈ 5 గెటప్స్ కోసం మహేష్ ఫిజికల్ గా కూడా చాలా మారాల్సి వస్తోంది. ఇప్పటికే రుద్ర లుక్ కోసం జుట్టు పెంచి, కండలు పెంచి కొత్తగా తయారయ్యారు. రాముడి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యిందని అంటున్నారు. మిగిలిన పాత్రల కోసం ఇంకెన్ని మేకోవర్లు చేయాలో, ఇంకెంత కసరత్తు చేయాలో ఆ జక్కన్నకే తెలియాలి. మహేష్ బాబుకి ఇది నిజంగా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనే చెప్పాలి.

అయితే ఆ మాత్రం కష్టం లేకపోతే కిక్ ఉండదు కదా. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ఇది. ప్రపంచం మొత్తం ఈ సినిమా వైపు చూస్తోంది. అందుకే రాజమౌళి ఎక్కడా రాజీ పడటం లేదు, మహేష్ కూడా దర్శకుడు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ ఐదు గెటప్స్ లో వేరియేషన్స్ చూపించడానికి నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు.

ఏదేమైనా జక్కన్న చేతిలో పడ్డాక ఎంతటి స్టార్ హీరో అయినా కరగాల్సిందే, కొత్తగా మెరవాల్సిందే. ఆ పని రాక్షసుడు పెడుతున్న ఈ కష్టం రేపు స్క్రీన్ మీద అద్భుతంగా మారుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ 5 అవతారాల వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే.

ఏపీలో రేషన్‌కార్డుదారులకు బిగ్ అలర్ట్.. మూడు రోజులే డెడ్‌లైన్.. ఆ తర్వాత రూ.200 ఫీజు

పీ ప్రభుత్వం రేషన్ కార్డులు, రేషన్ పంపిణీలో నూతన సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తోంది.

క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ రేషన్ కార్డులను ఉచితంగా గత కొద్ది నెలల నుంచి పంపిణీ చేస్తోంది. అయితే కొంతమంది ఈ కార్డులను ఇంకా తీసుకోలేదు. ఆగస్టు నుంచి కార్డులను ఏపీ ప్రభుత్వం ఇస్తుండగా.. ఇప్పటికీ చాలామంది తీసుకోలేదు. కేవలం వృద్దులు, వికలాంగులకు మాత్రమే రేషన్ డీలర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటికెళ్లి ఇస్తున్నారు.

ఇప్పటికీ స్మార్ట్ కార్డులను తీసుకోనివారికి ప్రభుత్వం తుది అవకాశం కల్పించింది. డిసెంబరు 15లోపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోవాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. లేకపోతే ఆ తర్వాత రూ.200 రుసుం చెల్లించి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ తర్వాత ప్రజలు ఎవరు కార్డులను రద్దు చేస్తారన్న ఆందోళన అవసరం లేదు. దగ్గర్లోని సచివాలయాల్లో రూ.200 రుసుం చెల్లించి చిరునామాతో సహా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సదరు చిరునామాకు కమిషనరేట్ నుంచి నేరుగా లబ్ధిదారుకు స్మార్ట్ కార్డు పంపుతారు. సచివాలయ అధికారులకు రేషన్ కార్డుదారులకు ఫోన్ చేసి స్మార్ట్ కార్డులు తీసుకోవాలని, లేకపోతే వెనక్కి పంపిస్తామని సమాచారం అందిస్తున్నారు. కొంతమంది ఫోన్ కాల్స్‌కు అందుబాటులో లేకపోగా.. మరికొంతమంది కాల్ చేసి చెప్పినా తీసుకుని వెళ్లడం లేదు. దీంతో అధికారులు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. ఆ లోపు వచ్చి తీసుకెళ్లాలని చెబుతున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా రేషన్ సరకులు అందించడానికి స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పేదలకు రేషన్ సరకులు అందిస్తోంది. అక్రమాలకు కళ్లెం వేసేందుకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను కొత్తగా రూపొందించింది. వాటిని లబ్ధిదారులకు ఆగస్టు నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆయా గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించింది. అక్కడి అధికారులు వీటిని లబ్దిదారులకు అందజేస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట రేషన్ కార్డులు ఏటీఎం సైజు తరహాలో ఉంటాయి. వీటిపై కుటుంబసభ్యుల పేర్లు, రేషన్ నెంబర్ ఉంటుంది.

హైదరాబాద్ కు బీచ్.. నెరవేరుతున్న పట్టణవాసుల కల..

హైదరాబాద్‌ భవిష్యత్‌ రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయే దిశగా పయనిస్తున్నాయి. ఒకప్పుడు ‘సముద్రం లేని నగరం’గా చెప్పుకునే హైదరాబాద్‌, ఇప్పుడు సముద్ర అలల్ని, బీచ్‌ గాలిని, నీటి అడుగున కనిపించే అద్భుత ప్రపంచాన్ని తనలోనే దాచుకోబోతుంది.

ఇది కేవలం ఒక వినోద ప్రాజెక్టు కథ కాదు.. ఇది నగర జీవనశైలిని, పర్యాటక ఆర్థిక వ్యవస్థను, ప్రజల ఊహల సరిహద్దులను మార్చే ఒక పెద్ద మార్పు. ‘హైదరాబాద్‌కు బీచ్ వస్తోంది’ అని వినగానే ఆనందం రావచ్చు. కానీ ఇప్పుడది అధికారికంగా రూపుదిద్దుకుంటున్న ఒక ఆధునిక నగర కల.

కొత్వాల్ గూడలోని 35 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ బీచ్‌ నిర్మించే ప్రణాళిక ఈ నగరానికి పూర్తిస్థాయి మలుపు తీసుకురానుంది. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ సంస్థల సాంకేతిక సహకారంతో ₹235 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టు ముందుకువెళ్తోంది. ఈ బీచ్‌ కేవలం ఇసుక రేకులు, నీలిరంగు అలలు మాత్రమే కాదు. ఇది ఒక కుటుంబం రోజు మొత్తం గడిపి తిరిగి రావాలనిపించని స్థాయి అనుభవాన్ని అందించే టూరిజం డెస్టినేషన్‌గా రూపుదిద్దుకోనుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు, అందరికీ అందుబాటులో ఉండే చార్జీలతో బీచ్‌లో స్నానం, వాటర్‌ స్పోర్ట్స్‌, బోటింగ్‌, వేదిక ఈవెంట్లు ఇవన్నీ హైదరాబాద్‌ మధ్యలోనే ఉన్నాయని ఊహించడం ఆశ్చర్యమే కదా..

ఇది మాత్రమే కాదు. ఈ ప్రాజెక్టులకు ముందుకొచ్చిన కంపెనీలు, పెట్టుబడులు, సాంకేతికత, వ్యూహాలు ఇవన్నీ హైదరాబాద్‌ గ్లోబల్‌ గుర్తింపునకు మరో పెద్ద ముద్రవేయబోతున్నాయి. అదే సమయంలో ₹300 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ‘టన్నెల్ అక్వేరియం’ అయితే ఈ నగరానికి పూర్తిగా కొత్త స్థాయి ప్రతిష్ఠ తెచ్చే ప్రాజెక్టు. దుబాయ్‌, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో మాత్రమే చూసే అక్వేరియంలను హైదరాబాద్‌ ప్రజలు తమ నగరంలోనే అనుభవించగలరంటే, అది ఈ నగర అభివృద్ధి ఆలోచన ఎంత దూరం ముందుకెళ్లిందో చెప్పడానికి చాలు. సముద్ర జీవులు మన పక్కన నడుస్తున్నట్టుగా కనిపించే ఆ గాజు మార్గం (Glass Road) భవిష్యత్తులో పాఠశాల పిల్లల్ని, పర్యాటకులను, విదేశీ ప్రతినిధులను నగరానికి ఆకర్షించే ప్రధాన కేంద్రంగా మారడం ఖాయం.

ఇంతలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో మరో అద్భుతం రూపుదిద్దుకుంటోంది. అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం. ఇది కేవలం కళల ప్రదర్శన స్థలం కాదు; ప్రపంచ సంస్కృతుల సమ్మేళనం ఒకే చోట ప్రత్యక్షమయ్యే గ్లోబల్‌ వేదిక. నృత్యం, సంగీతం, ప్రదర్శనలు, కళాఖండాలు, ప్రపంచ పర్యాటకులు ఇవన్నీ ఈ కేంద్రాన్ని అంతర్జాతీయ రంగంలో ఒక సాంస్కృతిక రాయబారిగా నిలబెట్టే సూచనలు ఇస్తున్నాయి. అదే ప్రాంతంలో ‘ఫ్లయింగ్ థియేటర్’ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రేక్షకులు కుర్చీలో కూర్చుని ఆకాశంలో ఎగురుతున్నట్టుగా అనుభవించగలరు. సినిమా కాదు, నిజమైన 4D ప్రయాణం. హైదరాబాద్‌ టెక్నాలజీ, వినోదాన్ని కలిపి, కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నదనడానికి ఇంత కంటే గొప్ప ఉదాహరణ అవసరం లేదు.

పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా, గ్రామీణ పర్యాటకాన్ని, సాహస యాత్రలను విస్తరించడానికి వికారాబాద్‌లో క్యారవాన్‌ పార్క్ ప్రాజెక్టు కూడా వేగంగా నడుస్తోంది. ఇక్కడ పర్యాటకులకు 24 గంటలు పార్కింగ్‌, EV చార్జింగ్‌, ఆహారం, వ్యూయ్‌టవర్‌, ట్రైల్ వాక్స్‌ వంటి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాక, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి STEPS అనే ప్రత్యేక శిక్షణా కేంద్రం కూడా నిర్మించబోతున్నారు. ఇది పర్యాటక రంగంలో ఒక కొత్త ఎకోసిస్టంను నిర్మించడానికి కీలక దశ.

హైదరాబాద్‌ ఎప్పుడూ ఒక ఐటీ హబ్‌, ఒక విద్యా కేంద్రం, ఒక స్టార్టప్ నగరం. ఇప్పుడు అది పర్యాటక అద్భుతాల ప్రధాన కేంద్రంగా నిలబెట్టే దిశలో వేగంగా పరిగెడుతోంది. సముద్రం లేని నగరానికి బీచ్ వచ్చింది అంటే అది కేవలం ఒక వార్త కాదు.. అది ఒక నగర స్వప్నం నిజమవుతున్న క్షణం. అభివృద్ధి అంటే కేవలం రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్లే కాదు.. ప్రజలు జీవనశైలిని మార్చే అనుభవాలను సృష్టించడం కూడా. హైదరాబాద్‌ ఇప్పుడు అదే చేస్తోంది. భవిష్యత్తు ఊహలకు రెక్కలు ఇస్తూ, ప్రపంచం చూడడానికి అర్హమైన ఒక కొత్త నగర రూపాన్ని నిర్మిస్తోంది. బీచ్‌, అక్వేరియం, ఫ్లయింగ్ థియేటర్ ఇవి కేవలం ప్రాజెక్టులు కాదు.. ఇవి హైదరాబాద్‌ తన భవిష్యత్తును ప్రపంచ పటంలో మరింత ప్రకాశింపజేయడానికి వేసిన కొత్త అడుగులు.

మంగళవారం నాడు పొరపాటున కూడా ఈ పనులు చేశారో..దరిద్రానికి వెల్కం చెప్పిన్నట్టే

న హిందూ సంప్రదాయాలలో వారంలో ప్రతి రోజుకూ ఒక గ్రహాధిపతి ఉన్నారని భావిస్తారు. అందులో మంగళవారం కుజగ్రహం (మంగళుడు) అధిపత్యం వహిస్తాడని శాస్త్రాలు చెబుతాయి.
కుజుడు అగ్నితత్వానికి, యుద్ధానికి, ఆగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ రోజున కొన్ని పనులు చేయడం దుష్పలితాలను కలిగిస్తుందని పెద్దలు హెచ్చరిస్తూ వచ్చారు. సాధారణంగా మంగళవారం కుజుడి ప్రభావం అధికంగా ఉంటుందని, అజాగ్రత్తగా చేసిన పనులు ప్రమాదాలకు, అనుకోని సమస్యలకు దారితీయవచ్చని సంప్రదాయ నమ్మకం ఉంది.

మంగళవారం నాడు తప్పక నివారించాల్సిన పనులు
1. వ్యక్తిగత శుభ్రత సంబంధిత పనులు

* గోళ్లను కత్తిరించడం
* జుట్టును కత్తిరించుకోవడం
* గడ్డం గీయించుకోవడం

ఇవి చేస్తే శరీర శక్తి తగ్గిపోతుందని, శరీర శ్రేయస్సు దెబ్బతింటుందని, అనారోగ్యం వచ్చే అవకాశం పెరుగుతుందని పెద్దలు చెప్పుకొచ్చారు. దీనికి శాస్త్రీయ ఆధారం లేకపోయినా, ఇది శతాబ్దాలుగా పాటిస్తున్న ఆచారం.

2. ఆర్థిక లావాదేవీలు

*అప్పు ఇవ్వడం

*అప్పు తీసుకోవడం

మంగళవారం ఇచ్చిన అప్పు తిరిగి రాదని, ఇచ్చినా చిక్కులు వస్తాయని, తీసుకుంటే ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయని భావన ఉంది. అనవసర ఖర్చులు ఎక్కువవుతాయని కూడా అంటారు.

3. పదునైన వస్తువుల కొనుగోలు

*కత్తి

*కత్తెర

*బ్లేడ్

*మరియు ఇతర పదునైన వస్తువులు

ఇవి మంగళవారం కొనుగోలు చేస్తే కలహాలు, గాయాలు, ప్రమాదాలు ఎదురవుతాయని పెద్దలు నమ్ముతారు.

4. పెద్ద కొనుగోళ్లు

*కొత్త ఇల్లు కొనుగోలు

*వాహనం కొనుగోలు

*ఇతర ముఖ్యమైన ఆస్తుల కొనుగోలు

ఈ రోజు కొనుగోలు చేస్తే ఆర్థిక నష్టాలు ఎదురవుతాయని, కుటుంబంలో వివాదాలు రావచ్చని చెబుతారు.

5. శుభకార్యాలు చేయడం

మంగళవారం పెళ్లి, నిశ్చితార్థం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు సాధారణంగా చేయలేరు. కుజ ప్రభావం వల్ల కుటుంబ కలహాలు, విభేదాలు రావచ్చని నమ్మకం.

6. ప్రమాదకర పనులు లేదా చికిత్సలు

*అగ్నితో సంబంధం ఉన్న పనులు

*యంత్రాలతో చేసే పనులు

*పెద్ద శస్త్రచికిత్సలు

మంగళవారం ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని భావించి, వీటిని మినహాయించాలని పెద్దలు చెబుతారు. అయితే, వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఈ నమ్మకాలు వర్తించకపోవచ్చు.

మంగళవారం చేయదగిన శుభకార్యాలు

*భగవాన్ హనుమంతుడి పూజ

మంగళవారం హనుమాన్ స్వామి రోజు అని భావిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం..మారుతి స్తోత్రం..సుందరకాండ పారాయణం..చేస్తే శుభం కలుగుతుందని విశ్వాసం.

7. దానధర్మాలు చేయడం

* ముఖ్యంగా ఎర్ర రంగుకు సంబంధించిన వస్తువులు: ఎర్ర పూలు, ఎర్ర పప్పులు

నోట్: ఈ అన్ని సంప్రదాయాలు ధర్మశాస్త్రాలు, జ్యోతిష్య గ్రంథాలు మరియు పెద్దల చెప్పుకువచ్చిన అనుభవపరమైన ఆశయాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరూ అనుసరించాలనే తప్పనిసరి నియమం కాదు. ఒక్కో ఇంట్లో ఒక్కో విధంగా ఆచరించే సంప్రదాయాలు ఉంటాయి. ఈ నియమాలు వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి మారవచ్చు. ఈ ఆచారాలకు శాస్త్రీయ ఆధారం ఉన్నా లేకపోయినా, వీటిని పాటించడం పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం, కుటుంబ సంప్రదాయం, మనసులో కలిగే శ్రద్ధలపైనే ఆధారపడి ఉంటుంది.

‘నరసింహా’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి ‘నీలాంబరి’ క్యారక్టర్ చేస్తున్నది ఎవరంటే

సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాల్లో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్(Super star Rajinikanth) హీరో గా నటించిన ‘నరసింహా’ (Narasimha Movie).

1999 వ సంవత్సరం లో తమిళం లో ఈ చిత్రం ‘పడియప్పా’ అనే పేరుతో విడుదలైంది. అక్కడ ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో తెలుగు లో ఈ చిత్రాన్ని ‘నరసింహా’పేరుతో దబ్ చేసి రిలీజ్ చేశారు. అప్పటికే బాషా చిత్రం తో తెలుగు ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న రజినీకాంత్, ‘నరసింహా’ చిత్రం తో మన తెలుగు ఆడియన్స్ లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయనకు టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ స్థాయి దక్కింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ నెల 12న పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ రీ రిలీజ్ పై తమిళ ఆడియన్స్ లో ఉన్న హైప్ మామూలుది కాదు. కచ్చితంగా ఈ చిత్రం ‘గిల్లీ’ రికార్డుని బద్దలు కొడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు రజినీకాంత్ అభిమానులు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ రేంజ్ లోనే జరిగాయి. గడిచిన 24 గంటల్లో ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 5 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మరి పూర్తి స్థాయి బుకింగ్స్ ప్రారంభించిన తర్వాత ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా రీ రిలీజ్ గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘మహిళలు థియేటర్స్ గేట్లు బద్దలు కొట్టుకొని మరీ వచ్చి చూసిన చిత్రమిది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ చేయకపోతే ఎలా?, ఈమధ్య కాలం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి. నేను కూడా రోబో సీక్వెల్ చేశాను, ఇప్పుడు జైలర్ 2 చేస్తున్నాను, ఈ సినిమాలు చేస్తున్నప్పుడే నాకు ఈ ఆలోచనలు వచ్చాయి. ఈ సీక్వెల్ కి నీలాంబరి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాం’ అంటూ రజినీకాంత్ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఈ సినిమాలో రజినీకాంత్ కంటే ఎక్కువ పేరు విలన్ క్యారక్టర్ చేసిన రమ్య కృష్ణ కి వచ్చింది. ఆమె పోషించిన ‘నీలాంబరి’ పాత్రలో లేడీ విలన్ రోల్స్ కి ఒక ట్రేడ్ మార్క్ లాగా నిల్చింది. ఏ హీరోయిన్ అయినా ఇప్పుడు లేడీ విలన్ క్యారక్టర్ చేస్తే, రమ్య కృష్ణ నీలాంబరి క్యారక్టర్ తో పోల్చి చూస్తున్నారు. ఆ రేంజ్ స్టాండర్డ్స్ ని సెట్ చేసిన క్యారక్టర్ ఇది. ఈ క్యారక్టర్ కోసం అప్పట్లో ముందుగా ఐశ్వర్యారాయ్ ని సంప్రదించారట. కానీ ఎందుకో ఆమెని ఒప్పుకోలేదు. ఆ తర్వాత శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి వారిని కూడా సంప్రదించామని, చివరికి రమ్యకృష్ణ వద్ద ఆగామని రజినీకాంత్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తే నీలాంబరి క్యారక్టర్ ని ఎవరు చేస్తారు?, ఆ రేంజ్ టాలెంట్ ఎవరికీ ఉంది ? అనే ప్రశ్న సోషల్ మీడియా లో రాగా, అత్యధిక శాతం మంది తమన్నా పేరు చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా కార్యరూపం దాల్చిన తర్వాత ఎవరు ఆ క్యారక్టర్ చేస్తారో చూడాలి.

నెలకు రూ.1.5 లక్షలు సంపాదించుకోవచ్చు..! తక్కువ పెట్టుబడిలో సూపర్‌ బిజినెస్‌

నేటి కాలంలో చాలా మంది వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలను వదిలేసి ప్రైవేట్‌ ఉద్యోగాల కోసం చూస్తున్నారు. కానీ కొన్ని చోట్ల తేనెటీగల పెంపకం ద్వారా నెలకు రూ.75,000 నుండి రూ.1.5 లక్షల వరకు సంపాదిస్తున్న యువకులు ఉన్నారు.

మరి ఈ బిజినెస్‌ను మీరు కూడా స్టార్ట్‌ చేయాలంటే ఎలా? పెట్టుబడి ఎంత అవుతుంది? పెంపకం ఎలా చేపట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తేనెటీగల పెంపకం అనేది చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల వ్యాపారం. తేనెటీగల పెట్టె సగటు ఖర్చు రూ.3,000 నుంచి 4,000. మీరు ప్రారంభంలో 20-50 పెట్టెలతో ప్రారంభిస్తే, రూ.1-2 లక్షలు సరిపోతుంది. మీరు మొదటి సంవత్సరంలోనే మీ పెట్టుబడిని తిరిగి పొందవచ్చు. మీరు ఒక పెట్టె నుండి సంవత్సరానికి 15-30 కిలోల తేనె పొందవచ్చు. ప్రస్తుతం ఒక కిలో తేనె హోల్‌సేల్ ధర రూ.180-250 మధ్య ఉంది. దీనిని రిటైల్ మార్కెట్లో రూ.500-800 వరకు అమ్మవచ్చు. బీస్వాక్స్, రాయల్ జెల్లీ, ప్రొపోలిస్, బీ విషం మొదలైన వాటిని కూడా అధిక ధరలకు అమ్ముతారు. ముఖ్యంగా సౌందర్య సాధనాలను తయారు చేసే కంపెనీలు బీస్వాక్స్‌కు మంచి ధరలను అందిస్తాయి. తేనెటీగల పెంపకం సేంద్రీయ రైతులకు మరో అదనపు ఆదాయం. తేనెటీగలు పంటలను పరాగసంపర్కం చేస్తాయి, ఇది దిగుబడిని 20-30 శాతం పెంచుతుంది. దీని కోసం చాలా మంది రైతులు బీ బాక్స్‌లను అద్దెకు తీసుకుంటారు. ఒక బాక్స్ ధర సీజన్‌కు రూ.1,000-2,000 మధ్య ఉంటుంది.

తమిళనాడులో యెర్కాడ్, కొల్లి కొండలు, కొడైకెనాల్, ఈరోడ్ ప్రాంతాలు, నీలగిరి వంటి కొండ ప్రాంతాలు తేనెటీగల పెంపకానికి అనువైన వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. కానీ సరైన సాగుతో మైదాన ప్రాంతాలలో కూడా మంచి దిగుబడిని పొందవచ్చు. ప్రభుత్వం నుంచి జాతీయ తేనెటీగల పెంపక బోర్డు (NBHM) 40-50 శాతం సబ్సిడీని అందిస్తుంది. అనేక ప్రైవేట్ కంపెనీలు కూడా ఉచిత శిక్షణను అందిస్తాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే తేనెటీగలను సరిగ్గా చూసుకోవడం. వేసవిలో నీరు, టీకాలు వేయడం, శత్రువుల నుండి (ఎలుగుబంట్లు, చీమలు) రక్షణ చాలా అవసరం. మొదటి ఆరు నెలలు నేర్చుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ, ఒక సంవత్సరం అనుభవం తర్వాత, ఇది చాలా సులభమైన పని అవుతుంది.

ఆన్‌లైన్‌లో కూడా తేనె అమ్మకాలు పెరుగుతున్నాయి. మీరు మీ స్వంత బ్రాండ్‌ను సృష్టించి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నేరుగా కస్టమర్లను చేరుకుంటే, మీ లాభాలు మరింత పెరుగుతాయి. గ్రామీణ యువత, మహిళలు లేదా పదవీ విరమణ చేసిన వారు ఎవరైనా ప్రారంభించగల ఈ వ్యాపారం పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా శరీరానికి మంచి వ్యాయామం కూడా అందిస్తుంది. తక్కువ పెట్టుబడి, స్థలం అవసరం లేదు, రోజుకు 2-3 గంటలు, నెలకు లక్షకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

EPFO ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..! రూ.52 వేలు అకౌంట్లో పడునున్నాయి?

EPFO వడ్డీ రేట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేట్ల పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు.

ఇది మీ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రభుత్వం ఈ ఏడాది వడ్డీ రేట్లను 8.75 శాతానికి పెంచవచ్చని వర్గాలు, మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 8.2 శాతం వడ్డీ రేటును అందించడం గమనించాల్సిన విషయం, ఇది ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయబడింది. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరానికి అధిక రేట్ల అంచనా ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంచింది. ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, జనవరిలో తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

రూ.52,000 ఎలా పొందాలి?

వడ్డీ రేట్లలో పెరుగుదల మీ PF బ్యాలెన్స్‌ను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. PF ఖాతాలో సుమారు రూ.6 లక్షలు ఉన్న ఉద్యోగి 8.75 శాతం రేటుతో సుమారు రూ.50,000 నుండి రూ.52,000 వరకు వడ్డీని పొందవచ్చు. రూ.5 లక్షలు ఉన్న వ్యక్తి సుమారు రూ.42,000 వడ్డీని పొందవచ్చు. ఈ మొత్తం నేరుగా మీ పదవీ విరమణ నిధికి జమ అవుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 80 మిలియన్ల PF ఖాతాదారులు ఈ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిపాదనను EPFO ​​సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) రాబోయే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత వడ్డీ రేట్లు ఆమోదించబడతాయి.

బ్యాలెన్స్‌ ఎలా చెక్‌ చేసుకోవాలంటే..?

మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. మీరు కాల్ చేసిన తర్వాత, మీ PF బ్యాలెన్స్, చివరి సహకార వివరాలను త్వరలో SMS ద్వారా అందుకుంటారు. మీరు SMS ద్వారా కూడా మీ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు “EPFOHO UAN” (ఇంగ్లీషులో) అని టైప్ చేయండి. అప్పుడు మీకు నచ్చిన భాషలో (హిందీ, తమిళం, తెలుగు, మొదలైనవి) సమాచారం అందుతుంది.

తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఏ పరీక్ష ఏ తేదీలోనంటే!

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ మంగళవారం (డిసెంబర్ 9) విడుదలైంది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలుత ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈసారి పదవ తరగతి పరీక్షల్లో సమయంలో హాలిడేస్ రావడంతో ఒక్కో పరీక్షకు ఎక్కువ గ్యాప్ వచ్చింది. ప్రతి పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించినున్నారు. సైన్స్ పేపర్ రెండు భాగాలుగా రెండు రోజులు జరగనున్న నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు సైన్స్ పేపర్ 1, పేప 2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి టైం టేబుల్‌ను ఈ కింద చెక్‌ చేసుకోండి.

పూర్తి టైం టేబుల్ ఇదే..

  • 14 మార్చి 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
  • 18 మార్చి 2026 – సెకెండ్ లాంగ్వేజ్
  • 23 మార్చి 2026 – థర్డ్ లాంగ్వేజ్
  • 28 మార్చి 2026 – మాథెమాటిక్స్
  • 02 ఏప్రిల్ 2026 – ఫిజికల్ సైన్స్
  • 07 ఏప్రిల్ 2026 – బయోలాజికల్ సైన్స్
  • 13 ఏప్రిల్ 2026 – సోషల్ స్టడీస్

ప్రతి ఎగ్జామ్ కి దాదాపు నాలుగు రోజుల గ్యాప్ రావడంతో విద్యార్థులకు పండగల ఒత్తిడి ఉండదని అధికారులు చెబుతున్నారు. ఫెస్టివల్ టైమ్ లో ఎక్కువ గ్యాప్ రావడంతో ప్రిపేర్ అవడానికి విద్యార్థులకు సమయం దొరుకుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారికంగా పరీక్షల షెడ్యుల్ విడుదల చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల DEO లకు, స్కూల్ హెడ్ మాస్టర్ లకి విద్యాశాఖ సమాచారం పంపింది

పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లతో కో ఆర్డినేట చేసుకొని జిల్లా విద్యా అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల పూర్తి టైం టేబుల్ ఇక్కడ చూడండి..

సోడియం ఎక్కువగా ఉండే ఈ 7 భారతీయ ఆహారాలకు దూరంగా ఉండాలి! వైద్యుల హెచ్చరిక

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన రోజువారీ సోడియం పరిమితి 2,000 mg. అయితే భారతీయుల్లో ఉప్పు వినియోగం దీనికి రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అధిక సోడియం వల్ల రక్తపోటు పెరగడం, గుండెజబ్బులు, కిడ్నీ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతున్నాయని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

గ్లెనెగ్లెస్ హాస్పిటల్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ గుప్తా ప్రకారం, మనం తెలియకుండానే ప్రతిరోజూ ఉప్పు అధికంగా తీసుకుంటున్నాం. రోజూ ఉపయోగించే అనేక భారతీయ ఆహారాల్లో సోడియం దాగి ఉందని, ముఖ్యంగా హై బిపి ఉన్నవారు వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు తప్పక తగ్గించాల్సిన 7 సోడియం అధిక ఆహారాలు

1. పచ్చళ్లు (Pickles / Achar)

మామిడి, మిక్స్‌డ్ వెజిటబుల్, నిమ్మ… ఏ పచ్చడి అయినా ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే అధిక ఉప్పు అవసరం.

1. ఒక్క టేబుల్‌స్పూన్ పచ్చడి కూడా రోజువారీ సోడియం పరిమితిలో సగం చేరుస్తుంది.

2. నిరంతరం తీసుకుంటే రక్తపోటు, ఉబ్బరం (Bloating) పెరుగుతాయి.

2. అప్పడాలు (Papad)

అప్పడాల్లో

1. సోడియం,

2. ప్రిజర్వేటివ్‌లు,

3. అదనపు ఉప్పు

చాలా ఎక్కువగా ఉంటాయి. రోజూ భోజనంతో కలిపి తింటే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది.

3. ఇన్‌స్టంట్ నూడుల్స్

పిల్లలు, పెద్దలు ఇష్టపడే ఈ నూడుల్స్‌లోని టేస్ట్‌మేకర్లో అధిక ఉప్పు, ఫ్లేవర్ ఎన్‌హాన్సర్లు ఉంటాయి.

1. ఒక్క సర్వింగ్ కూడా WHO సూచించిన సోడియం పరిమితిని మించిపోతుంది.

4. నమ్‌కీన్, చిప్స్ (Namkeen & Chips)

సేవ్, భుజియా, మిక్చర్స్, ఆలూ చిప్స్…

1. ఎక్కువ ఉప్పు,

2. ఎక్కువ ఆయిల్,

3. ప్రిజర్వేటివ్‌లు తో తయారు చేస్తారు.

తరచూ తింటే బరువు, ఉబ్బరం, హై బిపి సమస్యలు రావచ్చు.

5. రెడీ-టు-ఈట్ గ్రేవీలు, సూప్స్

స్టోర్‌లో దొరికే రెడీ-మిక్స్ సూప్స్, గ్రేవీల్లో సోడియం అత్యధికం.

1. నిల్వ కోసం ఉప్పు ఎక్కువగా వాడుతారు.

డాక్టర్ గుప్తా సలహా: “తాజాగా ఇంట్లో వండిన సూప్‌లు, గ్రేవీలు మంచివి.”

6. బ్రెడ్, బేకరీ ఐటమ్స్

సాధారణ బ్రెడ్‌లో కూడా హిడెన్ సోడియం ఎక్కువగా ఉంటుంది.

1. ప్రతిరోజూ తింటే ఉప్పు వినియోగం గణనీయంగా పెరుగుతుంది.

7. కాండిమెంట్స్ (Sauces, Ketchup, Soy Sauce)

ఒక్క స్పూన్ సాస్‌లో కూడా చాలా ఎక్కువ సోడియం ఉంటుంది.

1. తరచుగా వాడితే రోజువారీ ఉప్పు వినియోగం దాటిపోతుంది.

ఉప్పు వినియోగాన్ని తగ్గించడానికి వైద్యుల సూచనలు

1. తక్కువ ఉప్పుతో వంట చేయండి

  • తినే ముందు స్వల్పంగా చల్లుకోవడం మంచిది.
  • నిమ్మరసం, చింతపండు, అల్లం, మిరియాలు, వెనిగర్, సుగంధద్రవ్యాలతో రుచి పెంచండి.

2. తాజా ఆహారాలు ఎక్కువగా తినండి

  • ఫ్రోజన్ & ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఎక్కువ ఉప్పు ఉంటుంది.

3. ఉప్పు ఉన్న స్నాక్స్‌కు దూరంగా ఉండండి

  • చిప్స్, నమ్‌కీన్, ప్యాకేజ్డ్ స్నాక్స్ బదులుగా
  • ఉప్పులేని గింజలు, పండ్లు, రోస్టెడ్ శనగలు తీసుకోండి.

4. ఆహార లేబుల్స్ తప్పనిసరిగా చదవండి

  • “ప్రతి సర్వింగ్‌లో రోజువారీ సోడియం 30% కంటే ఎక్కువైతే ఆ ఆహారాన్ని తప్పించండి” – డాక్టర్ గుప్తా.

5. రెస్టారెంట్ ఫుడ్‌లో MSG లేకుండా అడగండి

  • తక్కువ ఉప్పుతో తయారు చేయమని చెప్పండి.
  • అధిక సోడియం శరీరానికి చేసే హానులు

1. రక్తపోటు పెరుగుతుంది (Hypertension)

రోజుకు 6 గ్రాము కంటే తక్కువ ఉప్పు తీసుకుంటే రక్తపోటు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

2. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది

గుండె చుట్టూ ద్రవం నిల్వ ఉండి శ్వాసకోశ సమస్యలు వస్తాయి.

3. కిడ్నీ పనితీరుపై ప్రభావం

ద్రవం నిల్వ అయ్యి బరువు పెరిగి, ఉబ్బరం వస్తుంది.

4. మధుమేహం ఉన్నవారికి అధిక ప్రమాదం

కిడ్నీ సమస్యలు తీవ్రమవుతాయి. డయాబెటిక్ నెఫ్రోపతి మరింత దిగజారుతుంది.

5. బరువు పెరగడం, ఉబ్బరం

నీరు నిల్వ అవ్వడం వలన bloating & sudden weight gain.

6. ఇతర సమస్యలు

తలనొప్పి, ఆస్టియోపొరోసిస్, కిడ్నీ రాళ్లు, గుండె కండరాల పెరుగుదల.

సర్కార్ బడి టీచర్లకు అగ్ని పరీక్ష.. సుప్రీం తీర్పుతో కొత్త టెన్షన్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల కొత్త టెన్షన్ పట్టుకుంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పుస్తకాలతో కుస్తీ పట్టే పరిస్థితి ఏర్పడింది.

రోజు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు ఇప్పుడు టెట్ పాఠాలు వింటున్నారు. ప్రస్తుతం టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) టెన్షన్‌తో సతమతమవుతున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పటికీ తాజా నిబంధనల ప్రకారం టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో 45,742 వేల మంది టీచర్లు ఈ పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, పరీక్షకు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉండటం, సిలబస్‌లో తాము బోధించని ఇతర సబ్జెక్టులు కూడా ఉండటంతో మెజారిటీ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలకు కేవలం నెలన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. జనవరి 16 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. పైగా, వీరు విధులు నిర్వహిస్తూనే ఈ పరీక్షకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. విధుల్లో ఆలస్యం, కుటుంబ బాధ్యతల మధ్య ఈ తక్కువ టైంలో క్వాలిఫై అయ్యేంతగా సిద్ధం కావడం కష్టమని పలువురు టీచర్లు వాపోతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. దీంతో రాష్ట్రంలోని సుమారు 45 వేల మంది టీచర్లు ప్రభావితం కానున్నారు. కొత్త నియామకాలకు మాత్రమే కాకుండా, పదోన్నతులకు కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో గతంలో డీఎస్సీ ద్వారా నియమితులై, టెట్ నుంచి మినహాయింపులేని టీచర్లు అంతా దీని పరిధిలోకి వస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 45,742లుగా ఉన్నది. వీరంతా టెట్ క్వాలిఫై కాకపోతే వారి సర్వీస్ విషయం లేదా ప్రమోషన్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో రూపొందించిన టెట్ నిబంధనల్లో.. 2010 నాటికి ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాలు తెలుపుతున్నాయి. సాధారణంగా టెట్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది. తాజాగా బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థుల్లోనే తక్కువగా పాసవుతున్నారు.

అలాంటిది టీచర్లు దశాబ్దాల క్రితం సర్వీస్లో చేరారు. అప్పటి సిలబస్ వేరు. ఇప్పుడున్నది వేరు. విద్యా విధానంలోనే అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విద్యార్థుల సైకాలజీ, నవీన విద్యావిధానం నుంచి టెట్లో ప్రశ్నలు ఇస్తారు. వీటిపై ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లకు అవగాహన తక్కువే..అదీగాక సైన్స్ టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి కేవలం తన సబ్జెక్టుపైనే దృష్టి పెడతాడు. గణితం కూడా టెట్ సిలబస్ ఉంటుంది. దీంతో ఇతర సబ్జెక్టులు రాయడం ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు టీచర్లు.. మారిన సిలబస్, బోధన విధానాలకు అనుగుణంగానే కొన్నేళ్లుగా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్తగా టెట్‌కు సన్నద్ధం అవుతున్న యువతకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ప్రశ్నలను వెతుక్కుని తేలికగా ప్రిపేర్ అవుతారు. సర్వీస్ టీచర్లకు ఈ అవకాశం తక్కువ. ఇవన్నీ సర్వీస్ టీచర్లలో వణుకు పుట్టిస్తున్నాయి.

మినహాయింపు ఇవ్వండి: టీచర్లు

టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిందన్నారు టీచర్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు నేతలు. టెట్ పై కేంద్ర విద్యా శాఖ మంత్రులతో పాటు కేంద్ర మంత్రులను కలుస్తునామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు. గత 15 ఏళ్లుగా సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదని ప్రభుత్వాలే చెప్పాయన్నారు టిచర్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు నేతలు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 2011కు ముందున్న టీచర్లకు టెట్ అవసరం లేదనే నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితులను బలంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి సర్వీస్ టీచర్లకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు టీచర్స్ ఎమ్మెల్సీలు. టెట్ కోసం అనేక మంది టీచర్లు సెలవులు పెట్టారు.తాము పాఠాలు చెప్పిన విద్యార్థుల వద్దే పాఠాలు నేర్చు కొంటున్నారు.. టెట్ను దృష్టిలో ఉంచుకుని కొన్ని కొని కేంద్రాలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. జనవరిలో టెట్ పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ.. ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వడంతో టీచర్లలో టెట్ గుబులు మరింత పెరిగింది.

Health

సినిమా