BREAKING: ఆళ్లగడ్డలో టెన్షన్.. టెన్షన్.. మరికొద్దిసేపట్లో ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్!

ఆళ్లగడ్డలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుడు టీడీపీ నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, సతీమణి శ్రీదేవిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే.


ఈ ఘటనలో శ్రీదేవి ప్రాణాలు కోల్పోగా, భాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాల్లో పోలీసులు శాఖ 144 సెక్షన్ విధించింది. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీదేవిపై దాడిలో ప్రధాన నిందితుడిగా ఏవీ సుబ్బారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆయనతో పాటు మొత్తం 15 మంది అనుమానితులపై కేసు నమోదైంది. అందులో A1గా వేణుగోపాల్ రెడ్డి, A2గా శిరీష, A3 కేదార్నాథ్ రెడ్డి, A4 ఏవి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. హత్య జరిగిన వెంటనే పరారైన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం ఏవీ సుబ్బారెడ్డి, అఖియ ప్రియ టీడీపీ పార్టీలోనే ఉన్నారు. .