BREAKING : ఏపీలో పానీపూరీ తిని ఇద్దరు బాలురు మృతి..!

www.mannamweb.com


BREAKING : ఏపీలో పానీపూరీ తిని ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు లోని జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది.
నిన్న రాత్రి పానీపూరీ తిన్న అన్నదమ్ములకు అస్వస్థత చోటు చేసుకుంది.

దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు రామకృష్ణ (10) విజయ్ (6)గా గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పానీ పూరి తినడం వల్లే మరణించి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.