యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘కిష్కింధపురి‘ థియేటర్లలో సక్సెస్ఫుల్గా ప్రదర్శించబడుతోంది.
విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)స్పందన మరింత జోష్ ఇచ్చింది.
చిరంజీవి నుంచి ప్రత్యేక అభినందనలు
తాజాగా చిరంజీవి ఓ వీడియో ద్వారా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ఇది కేవలం హారర్ థ్రిల్లర్ కాదు… దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి అందులో చూపించిన సైకలాజికల్ యాంగిల్ ఎంతో కొత్తగా అనిపించింది,’ అని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు.
హీరో-హీరోయిన్ల పెర్ఫార్మెన్స్పై మెగాస్టార్ కామెంట్స్
చిరంజీవి మాటల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas)నటన చాలా బలంగా ఉందని, అనుపమ పరమేశ్వరన్ కూడా తానెన్నో సినిమాల్లో చూసిన పాత్రల కంటే ఇందులో ప్రత్యేకంగా నటింప్రస్తుతం ‘కిష్కింధపురి’కి వచ్చిన మంచి స్పందనతో పాటు చిరంజీవి నుండి వచ్చిన ప్రశంసల కారణంగా, ఈ సినిమా రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరింత హైప్ను సొంతం చేసుకోనుందని సినీ విశ్లేషకుల అంచనా.చిందని అన్నారు. ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని అభినందించారు.
సాంకేతికతలోనూ మెరిసిన సినిమా
ఈ సందర్భంగా చిరంజీవి సినిమా సాంకేతిక అంశాల్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. చైతన్ భరద్వాజ్ అందించిన బీజీఎం, పాటలు సినిమాకు మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చాయని కొనియాడారు. అలాగే సినిమాకు మద్దతుగా నిలిచిన నిర్మాత సాహు గారపాటి గురించి ప్రస్తావిస్తూ, తాను నటిస్తున్న తదుపరి చిత్రానికీ అదే బేనర్ పని చేస్తోందని గుర్తు చేశారు. ‘ఇలాంటివి కొత్త ప్రయత్నాలు. మంచి కాన్సెప్ట్తో సినిమాలు వస్తే వాటిని ప్రోత్సహించాలి,’ అని చిరంజీవి పిలుపునిచ్చారు. థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడాలని ప్రేక్షకులను కోరారు.
ప్రస్తుతం ‘కిష్కింధపురి’కి వచ్చిన మంచి స్పందనతో పాటు చిరంజీవి నుండి వచ్చిన ప్రశంసల కారణంగా, ఈ సినిమా రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరింత హైప్ను సొంతం చేసుకోనుందని సినీ విశ్లేషకుల అంచనా.
































