CM చంద్రబాబు కీలక ప్రకటన.. వారికి రూ.3 వేలు

www.mannamweb.com


సీఎం చంద్రబాబు: వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లా మంత్రులు వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని చెప్పారు.

వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.3 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. పంట నష్టం వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్లే ఎక్కువ నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద బాధితులకు గతంలో కంటే ఎక్కువ పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.