భర్త బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న భార్య.. ఎందుకంటే

www.mannamweb.com


భర్త బ్రతికి ఉండగానే డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. అంతేకాదు భర్త పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మేసి సొమ్ము చేసుకుంది ఆ భార్య. భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న తగాదాలు రావడం కామన్‌. కానీ ఆ మహిళ మాత్రం ఏకంగా డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన మాలోత్ వినోద్ ఉద్యోగరీత్యా రంగారెడ్డి జిల్లాలో పనిచేసేవాడు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడంతో 2013 సెప్టెంబర్‌లో వినోద్ భార్య నిర్మల పోలీస్ స్టేషన్లో 498A కింద కేసు పెట్టింది. విచారణ నిమిత్తం వరంగల్ లోని అడ్వకేట్ ప్రభాకర్ ను వినోద్ కలిశాడు. వీరు కేసు డీటెయిల్స్ తీసుకొని మరిన్ని వివరాలను సేకరించే క్రమంలో ఓ విచిత్రమైన విషయం వెలుగుచూసింది. 2013 మార్చ్ లోనే వినోద్ మరణించినట్టుగా నిర్మల డెత్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు తేలింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు.