దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు.. దగ్గరపడుతున్న దరఖాస్తుల గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి

www.mannamweb.com


బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, కాకతీయ వర్శిటీ దూర విద్య ప్రవేశాల గడువు దగ్గరపడుతోంది. ఈనెల 31వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల సమయం ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిగ్రీ, పీజీతో పాటు డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

సైఓపెన్(డిస్టెన్స్ ఎడ్యుకేషన్) లో డిగ్రీ, పీజీ లేదా ఏదైనా డిప్లోమా కోర్సులో చేరాలనుకుంటున్నారా..? అయితే హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీ దూర విద్యలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా… ఆగస్టు 31వ తేదీతో ఈ గడువు పూర్తి కానుంది.

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ప్రవేశాలు :

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్‌, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాలి. www.braouonline.in, www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 31వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాలి.

డిగ్రీలో చూస్తే… బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి.ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. https://online.braou.ac.in/PG/PGFirstHome లింక్ పై క్లిక్ చేస్తే నేరుగా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

ఆయా కోర్సులను బట్టి ఫీజులను ఖరారు చేశారు. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు. జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చు.

కేయూలో ప్రవేశాలు – ముఖ్య వివరాలు

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ.. ‘స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్‌ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్’ ద్వారా దూర విద్య కోర్సులను నిర్వహిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 31వ తేదీని తుది గడువుగా ఉంది. మరో మూడు రోజులు అయితే ఈ గడువు ముగియనుంది. http://sdlceku.co.in/index.php వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హత కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:

ప్రవేశాల ప్రకటన – స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్‌ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, కాకతీయ వర్శిటీ, వరంగల్.
యూజీ కోర్సులు: బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)/ BLIsc (వ్యవధి: మూడేళ్లు.)
పీజీ కోర్సులు – ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్). (వ్యవధి: )రెండేళ్లు.
డిప్లొమా కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్/ రిటైల్ మార్కెటింగ్/ ట్యాలీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్/ పీడీ అండ్‌ సి స్కిల్స్ (వ్యవధి: ఒక ఏడాది)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2024.
అధికారిక వెబ్ సైట్ – http://sdlceku.co.in/index.php
మెయిల్ – info@sdlceku.co.in

మరోవైపు ఈ విద్యా సంవత్సరాని(2024 -25)కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కూడా అప్లికేషన్లను స్వీకరిస్తోంది. దూర విద్యలో డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తోంది. ఆగస్టు 16 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://oupgrrcde.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.