ఏపీలో 9 రోజుల పాటు దసరా సెలవులు.. ఎప్పటి నుంచి అంటే.

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. దసరా పండుగ కోసం రాష్ట్రంలోని పాఠశాలలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2, 2025 వరకు 9 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.


ఈ సుదీర్ఘ విరామం విద్యార్థులకు కుటుంబంతో కలిసి జరుపుకోవడానికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, పండుగ సీజన్‌ను ఆస్వాదించవచ్చు.

ఈ దసరా పండగ అక్టోబర్ 2, 2025 న వస్తుంది. చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబర్ 3న తెరుచుకోనున్నాయి.

విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తారు. వీరికి మొత్తం 6 రోజులు దసరా సెలవులు ఉంటాయి.

గతేడాదితో పోల్చితే ఈసారి దసరా ముందుగానే వచ్చింది. గతేడాదిలో దసరా పండగ అక్టోబర్ 12వ తేదీ రాగా, ఈసారి మాత్రం అక్టోబర్ 2వ తేదీనే వచ్చింది. అందుకే ఈసారి ముందుగానే సెలవులు ప్రారంభం కానున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.