ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఉచితంగా రూ. 21 వేలు, రూ. 11 వేలు, రూ.5 వేలు అందిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులే కాదు దేశ ప్రజలు ఎవరైనా ఈ నగదు గెలుచుకోవచ్చు. అందుకు ఓ చిన్న పని చేస్తే చాలు. మీ ఇంటి నుంచే ఈ పని పూర్తి చేయవచ్చు. అదే ఈపీఎఫ్ఓ ట్యాగ్ లైన్ చెప్పడం. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన భవిష్య నిధిని నిర్వహిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక భరోసా కల్పించే పలు రకాల సేవలు అందిస్తోంది. అయితే మరో కొత్త రకం ఆఫర్తో ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చింది. ఉచితంగా రూ.21 వేలు, రూ.11 వేలు, రూ.5 వేలు మేర అందిస్తోంది. అందుకు పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులే కాదు ప్రజలు ఈ నగదు బహుమతి గెలుచుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
దేశ ప్రజలకు ప్రత్యేకమైన ఆన్ లైన్ పోటీ నిర్వహిస్తున్నామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఈపీఎఫ్ఓ సంస్థ ఆశయాలు, సేవలకు అద్దం పట్టే విధంగా ఓ అర్థవంతమైన ట్యాగ్ లైన్ (Tag Line) సూచించాలని కోరింది. తమ కంపెనీ అధికారిక వెబ్సైట్కు ఆన్లైన్ ట్యాగ్ లైన్ పెట్టాలని నిర్ణయించినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పేర్కొంది. ఇందు కోసం ఓ ప్రకటన విడుదల చేసింది. మంచి ట్యాగ్ లైన్ సూంచిన ముగ్గురుని విజేతలకు ఎంపిక చేస్తామని పేర్కొంది. వారికి నగదు బహుమతి (Cash Reward) అందిస్తామని ఈ సందర్భంగా తెలిపింది.
మంచి ట్యాగ్ లైన్ సూచించిన వారికి మొదటి బహుమతిగా రూ.21 వేలు అందిస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఇక రెండో బహుమతి కింద రూ.11 వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. మూడో బహుమతిగా రూ.5100 ఇవ్వనున్నట్లు తెలిపింది. విజేతలకు త్వరలోనే ఢిల్లీలో నిర్వహించే ఈపీఎఫ్ఓ వ్యవస్థాక దినోత్సవానికి హాజరయ్యే అవకాశం కూడా కల్పిస్తామని వెల్లడించింది. ముగ్గురు విజేతలకు ఈ అవకాశం ఉంటుంది.
అక్టోబర్ 10 వరకు ఛాన్స్
ఈపీఎఫ్ఓ ట్యాగ్ లైన్ పోటీలో పాల్గొనేందుకు గడువు విధించింది. అక్టోబర్ 1వ తేదీనే ఈ పోటీ ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కంపెనీ తెలిపింది. అంటే ఇంకో ఐదు రోజుల వరకు సమయం ఉంది. దీంతో ప్రజల పెద్ద ఎత్తున పోటీలో పాల్గొనాలని ఈపీఎఫ్ఓ కోరింది. పోటీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈపీఎఫ్ఓ ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా ఓ క్యూఆర్ కోడ్ విడుదల చేసింది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ట్యాగ్ లైన్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఇంటి నుంచే ఈ పని పూర్తి చేసి రూ.21 వేలు గెలుచుకోవచ్చు. ఈపీఎఫ్ఓ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని మంచి ట్యాగ్ లైన్ సూచించే పనిలో నిమగ్నమై నగదు బహుమతి గెలుపొందండి మరి.



































