టీ20లకు రోహిత్, కోహ్లి వీడ్కోలు

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రపంచకప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా గెలిచిన తర్వాత వీళ్లిద్దరూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు.


2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రోహిత్‌.. 159 మ్యాచ్‌లాడి 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు. అందులో 5 శతకాలున్నాయి. ”ఇదే నా చివరి మ్యాచ్‌.

వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. ఈ ట్రోఫీని ఎలాగైనా గెలవాలనుకున్నా. అనుకున్నది సాధించా” అని రోహిత్‌ తెలిపాడు. ఇక 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేసిన కోహ్లి..

125 మ్యాచ్‌ల్లో 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. తన చివరి మ్యాచ్‌ అయిన ప్రపంచకప్‌ ఫైనల్లో కోహ్లినే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’. ”నా చివరి టీ20 ప్రపంచకప్‌ను ఎలా ముగించాలనుకున్నానో అలాగే ముగించా. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్‌ మ్యాచే కెరీర్‌లో ఆఖరిది. భవిష్యత్‌ తరం వచ్చే సమయమిది” అని ఫైనల్‌ అనంతరం విరాట్‌ అన్నా