AP లో 25 సంవత్సరాలు ఉచిత విద్యుత్ – ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

‘పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన’ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ అమర్చితే, వచ్చే 25 ఏళ్ల పాటు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు.


అంతేకాకుండా, అధికంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ పథకం ద్వారా దాదాపు 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

పథకం ముఖ్యాంశాలు:

✅ కరెంట్ బిల్లుల నుంచి విముక్తి

✅ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చుకునే అవకాశం

✅ అధిక విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2.09 చొప్పున అమ్ముకునే వీలుం

✅ 25 ఏళ్ల పాటు ప్యానెల్స్ నిండు సామర్థ్యంతో పనిచేస్తాయి

✅ రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇళ్లపై అమలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం

ఎంత ఖర్చు? ఎంత సబ్సిడీ?

2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ప్రాజెక్టు ఖర్చు: రూ.1.10 లక్షలు (సగటుగా)

కేంద్ర సబ్సిడీ: రూ.60,000

రాష్ట్ర సబ్సిడీ (బీసీలకు అదనంగా): రూ.20,000

అంతిమ ఖర్చు వినియోగదారుడి భుజంపై: సుమారు రూ.30,000

బ్యాంక్ లోన్ ద్వారా ఈ మొత్తాన్ని చెల్లించే వీలుంది

ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది?

2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ నెలకు సగటున 200-240 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి.

మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల వార్షిక వినియోగం 225 యూనిట్ల లోపే ఉంటుంది.

250 యూనిట్లు వినియోగిస్తే, అదనంగా వచ్చే 50 యూనిట్లకు డిస్కం టారిఫ్ ప్రకారం రూ.117 చెల్లించాల్సి ఉంటుంది.

ఎవరెవరు అర్హులు?

ఏపీలోని 1.56 కోట్ల గృహ విద్యుత్ వినియోగదారులు

రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

గరిష్ఠంగా 500 కిలోవాట్ల వరకు సోలార్ ప్లాంట్లకు అనుమతులు లభిస్తాయి

దరఖాస్తు ఎలా చేయాలి?

ఈ పథకానికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్ లేదా మీ ప్రాంతీయ డిస్కం కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారిక ప్రకటనల కోసం పర్యవేక్షించండి.

ఈ పథకం, విద్యుత్ ఖర్చుల నుంచి విముక్తి పొందాలనుకునే ప్రతి ఇంటికి గొప్ప అవకాశం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి – భవిష్యత్తుకు మేలైన పెట్టుబడి ఇది!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.