కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్ విషయంలో ఇప్పటికే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తామని జనవరి నెలలో ప్రకటించింది.
అయితే తాజాగా ఎనిమిదో వేతన కమిషన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నూతన పే కమిషన్ చైర్మన్ అదే విధంగా ఇతర సభ్యుల నియామకం కూడా అతి త్వరలోనే జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల, ప్రభుత్వం రెండు సర్క్యులర్లు జారీ చేసింది. దీని ద్వారా వేతన కమిషన్ పోస్టుల నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పే కమిషన్ త్వరలోనే చైర్ కానుంది. ఈ నేపథ్యంలో కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తర్వాత జీతం ఎంత పెరుగుతుంది అనే దానిపైన సర్వత్ర ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. కొత్త పే కమిషన్లో కొత్త బేసిక్ పేను లెక్కించడానికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఉదాహరణకు, ఒక ఉద్యోగి ప్రస్తుత ప్రాథమిక జీతం రూ.18,000 అయితే 8వ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక 2.86 అయితే, అతని కొత్త బేసిక్ జీతం రూ. 51,480 కావచ్చు.ఆరవ వేతన సంఘం (2006)లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.86గా నిర్ణయించారు. ఫలితంగా సగటు జీతంలో దాదాపు 54% భారీ పెరుగుదల ఏర్పడింది. కానీ 7వ వేతన సంఘం (2016)లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57 వద్ద ఉంచినప్పటికీ, వాస్తవ జీత పెరుగుదల 14.2% మాత్రమే ఉంది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో రిపోర్టు చేసిన ఒక వార్త కథనంలో ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ దాదాపు 1.92 ఉండే అవకాశం ఉందని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ అంచనా వేశారు. ఇదే జరిగితే, కనీస ప్రాథమిక జీతం రూ. 34,560కు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఎనిమిదవ పే కమిషన్ జనవరి ఒకటో తేదీ 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఆరు నెలల సమయంలో నూతన పే కమిషన్ సిఫార్సులు అమలు చేయాల్సి ఉంది. జూన్ నెల సవేపిస్తున్నప్పటికీ ఇంకా ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ . ఎంపిక ఇంకా జరగలేదు. . 8వ పే కమిషన్ ఏర్పడిన అనంతరం ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేస్తుంది. ఆ తర్వాత సిఫార్సులు ప్రభుత్వానికి అందజేయాలంటే కనీసం 2026 ఏప్రిల్ వరకు సమయం పట్టే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గమనిక : పైన పేర్కొన్న సమాచారం కేవలం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వార్తా కథనాల ఆధారంగా రూపొందించడం జరిగింది. 8వ పే కమిషన్ కు సంబంధించిన సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ నోటిఫికేషన్ ప్రామాణికంగా తీసుకోవాలి.
































