కేంద్ర ప్రభుత్వ ఉద్యోగలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఏకంగా నాలుగు శాతం డీఏ పెంపు

భారతదేశంలో వేతన జీవుల సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ ఉద్యోగికైనా జీతం పెంపు అంటే ఓ రకమైన ఆనందరం ఉంటుంది.
ఈ నేపథ్యంలో పెరిగిన ఖర్చులు, అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపునకు సిద్ధం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు అంటే జనవరి, జూలైలో డియర్‌నెస్ అలవెన్స్‌ని సవరిస్తుంది. సాధారణంగా మార్చిలో డీఏ పెంపు ప్రకటన వస్తుంది. .కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పారిశ్రామిక కార్మికుల కోసం తాజా వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా లెక్కిస్తారు. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో ప్రతి నెలా సీపీఐడబ్ల్యూ డేటాను ప్రచురిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌ను లెక్కించడానికి ఒక ఫార్ములా ఉంది. కాబట్టి డీఏ పెంపు గురించి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

నాలుగు శాతం డీఏ పెంపుతో జీతం పెరుగుదల ఇలా

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులందరికీ డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతంలో డియర్నెస్ అలవెన్స్ ఒక భాగం. ఇది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల ప్రభావవంతమైన వేతనాన్ని క్రమానుగతంగా సవరిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుదల వారి టేక్-హోమ్ జీతం పెరుగుతుంది. నెలకు రూ.53,500 మూల వేతనం పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి విషయమే తీసుకుందాం. 46 శాతం వద్ద అతని కరువు భత్యం రూ. 24,610. ఇప్పుడు, డీఏ 50 శాతానికి పెరిగితే అతని డీఏ రూ.26,750కి పెరుగుతుంది. రాబోయే రౌండ్‌లో డీఏ నాలుగు శాతం పెరిగితే అతని జీతం రూ. 26,750 – రూ. 24,610 = రూ. 2,140 పెరుగుతుంది.

నాలుగు శాతం డీఆర్ పెంపుతో పింఛన్ పెరుగుదల ఇలా

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు వర్తించే డియర్నెస్ రిలీఫ్ డీఏ లాగానే ఉంటుంది. డియర్‌నెస్ రిలీఫ్ కూడా త్వరలో 4 శాతం పెరిగే అవకాశం ఉంది. డీఆర్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు వారి నెలవారీ పెన్షన్లలో పెరుగుదలను చూస్తారు. కేంద్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు నెలకు రూ.41,100 ప్రాథమిక పెన్షన్ లభిస్తుందనుకుందాం. 46 శాతం డీఆర్ వద్ద పెన్షనర్ రూ. 18,906 పొందుతారు. అతని డీఆర్‌ను 50 శాతానికి పెంచితే అతను ప్రతి నెలా రూ. 20,550 డియర్‌నెస్ రిలీఫ్‌గా పొందుతాడు. కాబట్టి త్వరలో డీఏ 4 శాతం పెంచితే అతని పెన్షన్ నెలకు రూ.1,644 పెరుగుతుంది.
డీఏ పెంపు ఎప్పుడు?

గతంలో ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం త్వరలో డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వచ్చిన డీఏ పెంపు, మార్చి 24, 2023న ప్రకటించారు. జూలై 1, 2023 నుంచి వర్తించే డీఏ పెంపును అక్టోబర్ 18, 2023న ప్రకటించారు. కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ, డీఆర్ పెరుగుదల నుంచి ప్రయోజనం పొందుతుంది.