సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌ఆర్‌ఏ 24శాతానికి పెంపు

www.mannamweb.com


ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు తీపికబురు అందించారు. సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఉన్న 16 శాతం హెచ్‌ఆర్‌ఏను 24 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మొత్తం రూ.25వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 12వ పీఆర్సీ సిఫారసులు ఇంకా రానందున.. 2025 జూన్‌ వరకు ఈ హెచ్‌ఆర్‌ఏ అమలు చేయనున్నట్లు చెప్పారు.