TG News: ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం

www.mannamweb.com


TG News: ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. జులై 5 నుంచి నేటి వరకు బదిలీ ప్రక్రియ జరిగేలా ఈనెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ జరగడం లేదంటూ వివిధ విభాగాల ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో బదిలీలు కొలిక్కి రాలేదు. దీతో బదిలీల ప్రక్రియను ఈనెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని రామకృష్ణరావు పేర్కొన్నారు.