ఆధార్ కార్డు తీసుకురాలేదు.. ఫ్రీ అని ఎక్కేశా.. ఆర్టీసీ బస్సులో నారా భువనేశ్వరి.

పీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం వెళ్లిన నారా భువనేశ్వరి..


శుక్రవారం ఉచిత బస్సులో ప్రయాణించారు. మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా కండక్టర్‌తో సరదాగా సంభాషించారు. తాను ఆధార్ కార్డు తీసుకురాలేదని.. ఫ్రీ అని ఎక్కేశానని అన్నారు. ముఖ్యమంత్రే ఉచితమని చెప్పారుగా అంటూ కండక్టర్‌తో సరదాగా మాట్లాడారు. ఇక కండక్టర్ కూడా అంతే సరదాగా ఉచిత ప్రయాణానికి ఐడెంటిటీ కార్డు తప్పనిసరి మేడమ్ అని చెప్పటంతో.. భువనేశ్వరి తన ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొందారు. అనంతరం శాంతిపురం నివాసం నుంచి తుమ్మిసి వరకూ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. శుక్రవారం రోజున శాంతిపురంలోని నివాసంలో గ్రీవెన్స్ నిర్వహించారు. అలాగే తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆధార్ కార్డు తీసుకురాలేదు.. ఫ్రీ అని ఎక్కేశా.. ఆర్టీసీ బస్సులో నారా భువనేశ్వరి..
స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీ బస్సులో నారా భువనేశ్వరి ఉచిత ప్రయాణం

స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీ బస్సులో నారా భువనేశ్వరి ఉచిత ప్రయాణం

స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీ బస్సులో నారా భువనేశ్వరి ఉచిత ప్రయాణం

చిన్నారిని ముద్దాడుతున్న నారా భువనేశ్వరి

తుమ్మిసి పెద్ద చెరువులో జలహారతి

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.