విద్యార్థుల ప్రవేశాలకు ‘ నేను బడికి పోతా ‘ కార్యక్రమం

విద్యార్థుల ప్రవేశాలకు ‘ నేను బడికి పోతా ‘ కార్యక్రమం


ఈనాడు,అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ‘ నేను బడికి పోతా ‘ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమగ్ర శిక్షా అభియాన్ ఆదేశాలు జారీ చేసింది.జులై 12 వరకు ఈ కార్యక్ర మాన్ని నిర్వహించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 6-14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలందరూ బడుల్లో ఉండేలా చూడాలని,వంద శాతం ప్రవేశాలు ఉండాలని సూచించింది.బడి మానేసిన పిల్లల్ని మళ్లీ పాఠశా లల్లో చేర్పించాలని పేర్కొంది. ఇందుకు జిల్లా,మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇంటింటికీ ప్రచారం చేయాలని చెప్పింది.ఈ నెల 18 వరకు ప్రత్యేక ప్రణాళికను విడుదల చేసింది. బడి ఉత్సవం, బాలికా ఉత్సవం,విద్యా సదస్సు లాంటివి నిర్వహించాలని సూచించింది.