నిరాడంబరంగా ఐఏఎస్‌ అధికారుల వివాహం

జీవితంలో ఒక్కసారి చేసుకునే వివాహ వేడుక.. కలకాలం గుర్తుండిపోవాలంటూ రూ.కోట్లు ఖర్చు చేస్తున్న నేటిరోజుల్లో ఐఏఎస్‌ అధికారులు నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి, ఇన్‌ఛార్జి సంయుక్త కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తిరుమణి శ్రీపూజ, మేఘాలయ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఆదిత్యవర్మ కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. శుక్రవారం విశాఖపట్నంలోని సూపర్‌ బజార్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చి నమోదు చేసుకున్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.