రైలు డ్రైవర్ల జీతం ఎంతో తెలిస్తే అసలు వదులుకోరు

భారతీయ రైల్వేలో ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాదు, అదొక సామాజిక హోదా. ముఖ్యంగా రైలును నడిపే లోకో పైలట్ పోస్ట్ అత్యంత కీలకం. రైలు వేగం పెరిగేకొద్దీ, సాంకేతికత మారుతున్న కొద్దీ వీరి ఆదాయం కూడా ఊహించని రీతిలో పెరుగుతుంది.


ప్రస్తుతం దేశంలో సెమీ హై-స్పీడ్ రైలు వందే భారత్ క్రేజ్ మామూలుగా లేదు. ఈ రైళ్లను నడిపేందుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అందుకే వీరికి వేతనాలు కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయి.భత్యాలతో కలిపి నెలకు రూ. 70,000 నుండి రూ. 1,10,000 వరకు ఉంటుంది. ముఖ్యంగా కాట్రా-శ్రీనగర్ వంటి క్లిష్టమైన మరియు ప్రీమియం మార్గాల్లో పనిచేసే వారికి అత్యధిక ప్యాకేజీలు అందుతున్నాయి.

దేశంలోని ప్రీమియం రైళ్లైన రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలో పనిచేసే అనుభవజ్ఞులైన లోకో పైలట్లు కూడా ఆకర్షణీయమైన జీతాలు పొందుతున్నారు.ప్రాథమిక వేతనం: రూ. 35,000 నుండి రూ. 55,000 వరకు ఉంటుంది. వీరికి ప్రాథమిక జీతంతో పాటు స్పెషల్ షిఫ్ట్ అలవెన్సులు, కిలోమీటరు ప్రాతిపదికన ఇచ్చే రన్నింగ్ అలవెన్సులు అదనంగా అందుతాయి.

రైల్వేలో డ్రైవర్ కావాలనుకునే వారు తమ ప్రయాణాన్ని అసిస్టెంట్ లోకో పైలట్‌గా ప్రారంభిస్తారు. అక్కడి నుండి వారి ఎదుగుదల ఇలా ఉంటుంది. అసిస్టెంట్ లోకో పైలట్ ప్రారంభ ప్రాథమిక జీతం రూ. 19,900. అన్ని అలవెన్సులు కలిపితే నెలకు రూ. 25,000 – రూ. 35,000 అందుతుంది. లోకో పైలట్ అనుభవం పెరిగేకొద్దీ గూడ్స్ రైళ్ల నుండి ప్యాసింజర్ రైళ్లకు పదోన్నతి లభిస్తుంది. సీనియర్ & చీఫ్ లోకో పైలట్ ఇది అత్యున్నత స్థాయి. ఇక్కడ బాధ్యతలతో పాటు జీతం కూడా లక్షల్లో ఉంటుంది.

లోకో పైలట్లకు కేవలం జీతం మాత్రమే కాదు, రైల్వే శాఖ అనేక రకాల భత్యాలను కల్పిస్తుంది. డియర్నెస్ అలవెన్స్ రిగే ధరలకు అనుగుణంగా కరువు భత్యం. నివసించే నగరాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం. ప్రయాణించిన ప్రతి కిలోమీటరుకు అదనపు నగదు. కుటుంబ సభ్యులకు ఉచిత రైలు ప్రయాణ పాస్‌లు వైద్య సదుపాయం. స్లీపర్ క్లాస్ రైలైనా, బుల్లెట్ వేగంతో దూసుకెళ్లే వందే భారత్ అయినా.. వేల మంది ప్రాణాలను సురక్షితంగా చేర్చే లోకో పైలట్ల కృషి వెలకట్టలేనిది. వారి శ్రమకు తగ్గట్టుగానే భారతీయ రైల్వే గౌరవప్రదమైన వేతనాన్ని అందిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.