ఓటీటీలోకి వచ్చేసిన ఇనయా సుల్తానా క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

www.mannamweb.com


సాధారణంగా థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలో కూడా ప్రతి శుక్రవారం కొత్త లు, వెబ్ సిరీస్ లు రిలీజవుతుంటాయి. అయితే కొన్ని ఓటీటీ సంస్థలు వారం మధ్యలోనే లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి.

అది కూడా ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రకటనలు లేకుండా. అలా మూడు నెలల క్రితం థియేటర్లలో విడుదలై యావరేజ్ గా నిలిచిన ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అదే బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా ప్రధాన పాత్రలో నటించిన నట రత్నాలు. అలనాటి అందాల తార అర్చన ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించింది. ఈ ఏడాది మే17న థియేటర్లలో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ యావరేజ్ గా నిలిచింది. కథ, కథనాలు బాగున్నా సరైన ప్రమోషన్స్ నిర్వహించలేదు. అందుకే మోస్తరు కలెక్షన్లకే పరిమితమైంది. ఇప్పుడీ నటరత్నాలు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా మంగళవారం ( సెప్టెంబర్ 13) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రిలీజ్ జరిగిన తర్వాత సుమారు మూడు నెలల తర్వాత నటరత్నాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రావడం గమనార్హం. అయితే ఇక్కడే ఇంకొక ట్విస్ట్ ఇచ్చారు.

నటరత్నాలు మూవీ ప్రస్తుతం కేవలం రెంటల్ బేస్ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ ను చూడాలంటే రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని సమాచారం. నర్ర శివనాగు తెరకెక్కించిన నటరత్నాలు లో సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇండస్ట్రీలో ఏదో సాధించాలని ఆశలతో వెళ్లిన ముగ్గురు యువకులు.. తీరా అక్కడికి వెళ్లాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారన్న దాని చుట్టూ నటరత్నాలు తిరుగుతూ ఉంటుంది. క్రైమ్ లను ఇష్టపడే వారు టైమ్ పాస్ కోసం ఈ మూవీని చూడవచ్చు.