వెదర్ ఎఫెక్ట్.. నగరంలో మొక్కజొన్న పొత్తులకు పెరిగిన డిమాండ్

www.mannamweb.com


దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నిత్యవసర సరుకులు, కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఇప్పటికే ఉల్లి ఆఫ్‌ సెంచరీ కొట్టగా.. టమోట సెంచరీ రీచ్ అయింది.

ఇదే బాటలో మొక్కజొన్న పొత్తుల రేట్లు పెరిగాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, చలి తీవ్రత పెరగడంతో వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు తినేందుకు ఇష్టపడుతున్నారు నగరవాసులు. దీంతో తెలంగాణలో మొక్కజొన్న పొత్తులకు భారీ డిమాండ్ ఏర్పడింది. నిన్న మొన్న వరకూ పదిరూపాయాలు పలికిన మొక్కజొన్న పొత్తు రేటు డబుల్ అయింది.

వర్షాల కారణంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడి అయ్యే మొక్కజొన్న పొత్తులు రాకపోవడంతో ఒక్కసారి సుమారు 20 రూపాయలకు చేరింది. నగరానికి సరిఫడా దిగుమతి రావడం లేదని చెబుతున్నారు వ్యాపారులు. మరోవైపు నగరంలో జాఫ్రానీ చాయ్‌కి డిమాండ్ బాగా పెరిగింది. వర్షాలు కారణంగా చలి నుంచి తట్టుకునేందుకు జాఫ్రానీ చాయ్‌ తాగేందుకు నగర వాసులు టీ షాపులకు క్యూ కడుతున్నారు. మట్టి గ్లాసులో గంటల తరబడి కాచిన పాలు, డికాషన్ తో పాటు కుంకుమ పువ్వు వేసి తయారు చేస్తారు ఈజాఫ్రానీ చాయ్. ఈ చాయ్‌ ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు టీషాపు యాజమానులు.