IRCTC Shirdi Tour 2024 : అతి తక్కువ ధరలో షిర్డీ టూర్ – విజయవాడ నుంచి తాజా ప్యాకేజీ వచ్చేసింది

www.mannamweb.com


IRCTC Vijayawada – Shirdi Tour 2024: విజయవాడ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ టూర్ ప్యాకేజీలో షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ కు వెళ్లి రావొచ్చు. ఫిబ్రవరి 13వ తేదీను ఈ టూర్ అందుబాటులో ఉంది.

షిర్డీ టూర్ ప్యాకేజీ
IRCTC Shirdi Tour From Vijayawada 2024: ఈ కొత్త ఏడాదిలో కొత్త ప్లేస్ లకు వెళ్లాలని అనుకుంటున్నారా…? అయితే తక్కువ ధరలోనే పలు టూర్ ప్యాకేజీలను తీసుకువస్తుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా..…ఏపీకి దగ్గరలో ఉండే షిర్డీకి టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ను విజయవాడ సిటీ నుంచి ఆపరేట్ చేస్తోంది. ‘SAI SANNIDHI EX – VIJAYAWADA’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి 13, 2024 తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశిగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది.
షిర్డీ టూర్ షెడ్యూల్ :
Day – 01: తొలి రోజు విజయవాడలో స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day – 02: రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి బయల్దేరుతారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాల్సి ఉంటుంది.

Day – 03 : ఇక 3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ షిరిడీ చేరుకోవాలి. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Day 04: తెల్లవారుజామున 3 విజయవాడ కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

విజయవాడ – షిర్డీ టూర్ ధరలు
విజయవాడ – షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 14,930 ధర ఉండగా… డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9,430, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8,030చెల్లించాలి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 5,170గా ధర ఉంది. గతేడాదితో పోల్చితే ఈ కొత్త ఏడాదిలో కొంచెం ధరలు తగ్గాయి. ఈ టూర్ ను బుకింగ్ చేసుకోవటంతో పాటు పూర్తి వివరాలను https://www.irctctourism.com వెబ్ సైట్ లో చూడవచ్చు.

ఊటీ టూర్ ప్యాకేజీ
IRCTC Tourism Tirupati – Ooty Package 2024: ఊటీకి సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్ సీటీసీ టూరిజం. ఈ టూర్ ను ఏపీలోని తిరుపతి సిటీ నుంచి ఆపరేట్ చేస్తోంది. ‘ULTIMATE OOTY EX TIRUPATI ‘ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుండగా… ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 13, 2024వ తేదీన అందుబాటులో ఉంది.

Tirupati Ooty Tour Ticket Prices: తిరుపతి – ఊటీ ప్యాకేజీ చూస్తే… కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 26,770ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 15,880 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.11,470గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. గతేడాదిలో ఇదే టూర్ ప్యాకేజీ సింగిల్ షేరింగ్ కు రూ. 29వేలుగా ఉండగా.. డబుల్ షేరింగ్ రూ. 17వేలుగా ఉండేది. ఈ కొత్త ఏడాదిలో కాస్త ధరలు తగ్గాయి. సమ్మర్ వస్తే మళ్లీ ధరలు పెరగనున్నాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.