అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త ఛైర్మన్‌గా జై షా.. చిన్న వయస్సులోనే

www.mannamweb.com


అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కొత్త ఛైర్మన్‌గా బిసిసిఐ కార్యదర్శి జై షా నియమితులయ్యారు. గ్రెగ్ బార్క్లే తర్వాత జై షా బాధ్యతలు చేపట్టనున్నారు.

జగ్‌మోహన్ దాల్మియా (అధ్యక్షుడు), శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, షాహంక్ మనోహర్ తర్వాత క్రికెట్ గ్లోబల్ గవర్నింగ్ అథారిటీకి నాయకత్వం వహించిన ఐదవ భారతీయుడిగా షా నిలిచారు. 34 ఏళ్ల వయసులో ఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా షా నిలిచారు.