ఆస్పత్రి పాలైన దేవర బ్యూటీ జాన్వీ

www.mannamweb.com


బాలీవుడ్ తార, దేవర బ్యూటీ ఇటీవల స్పోర్ట్స్ డ్రామా “మిస్టర్”లో కనిపించింది. తాజాగా అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్.. ఆస్పత్రిలో చేరింది. నటి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంకా విశ్రాంతి కోసం బుధవారం తన అపాయింట్‌మెంట్‌లన్నింటినీ రద్దు చేసింది.

అయితే గురువారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కారణంతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

ముంబై కుండపోత వర్షాలతో పోరాడుతున్నందున, నగరంలో అంటువ్యాధులు పెరిగాయి. వైద్యుల పర్యవేక్షణలో ఆమె పరిస్థితి మెరుగుపడే వరకు ఒకటి రెండు రోజులు ఆసుపత్రిలో ఉంటారని తెలుస్తోంది. వర్క్ ఫ్రంట్‌లో ఆమె చేతిలో 2 సినిమాలు ఉన్నాయి.