డిగ్రీ అర్హతతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు..

డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉన్నారా..? అయితే, మీకొక సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం..


దేశ వ్యాప్తంగా ఉన్న పీఎన్‌బీ శాఖల్లో 2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంగ్లిష్ / హిందీ మాధ్యమంలోనే ప్రశ్నాపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేందుకు జనరల్‌/ ఓబీసీలకు రూ.944చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీలు రూ.708 చెల్లించాలి. దివ్యాంగులకు రూ.472గా నిర్ణయించారు.

మొత్తం పోస్టులు

అప్రెంటిస్‌: 2,700 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌లో 27 పోస్టులు,

తెలంగాణలో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి

వయోపరిమితి : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు 30.06.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్ : నెలకు రూరల్/ సెమీ అర్బన్ ప్రాంతానికి రూ.10,000 చెల్లిస్తారు. పట్టణ ప్రాంతానికి రూ.12,000 ఉంటుంది. మెట్రో ప్రాంతానికి రూ.15,000 అందజేస్తారు.

శిక్షణ కాలం : సంవత్సరం..

రాత పరీక్ష విధానం

జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలకు 25 మార్కులు.

జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలకు 25 మార్కులు.

క్వాంటిటేటివ్ అండ్‌ రీజనింగ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి.

కంప్యూటర్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు.

ముఖ్యమైన తేదీలివే..

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది : 30.06.2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ : 14.07.2024.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 28.07.2024.